Yuvraj Singh: సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ కాదు.. తానే నా బెస్ట్ బ్యాటింగ్ పార్టనర్..!
- సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ కంటే..
- ఎంఎస్ ధోనీనే తన బెస్ట్ బ్యాటింగ్ పార్ట్నర్
- ఇంటర్వ్యూలో యువరాజ్ సింగ్ వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yuvraj Singh: భారత క్రికెట్ చరిత్రలో గొప్ప మ్యాచ్ విన్నర్లలో ఒకరిగా పేరుగాంచిన యువరాజ్ సింగ్ గురించి ప్రత్యేకంగా చేపలసిన పనిలేదు. ఆయన అంతర్జాతీయ కెరీర్లో ఎన్నో మధుర జ్ఞాపకాలను క్రికెట్ అభిమానులకు అందించాడు. 2000లో జరిగిన అండర్-19 వరల్డ్ కప్ గెలుపు నుంచి, 2011 వరల్డ్ కప్లో భారత్కు 28 ఏళ్ల తర్వాత ట్రోఫీ అందించడంలో కీలక పాత్ర పోషించాడు యూవీ. ఈ రెండు టోర్నమెంట్లలోనూ ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అవార్డు సాధించడం మరో విశేషం.
Singer Mangli : మంగ్లీ చీటింగ్ కేసులో టాలీవుడ్ డైరెక్టర్?
Also Read
- Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
- Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
- PM Modi: ఎన్డీఏ రాకతో దేశ తలరాత మారిపోయింది.. 12 ఏళ్ల వేడుకలో మోడీ కీలక వ్యాఖ్యలు
- CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్
అంతేకాకుండా 2007లో జరిగిన తొలి టీ20 వరల్డ్ కప్ విజయంలో కూడా యువరాజ్ కీలక పాత్ర పోషించాడు. ఆ సమయంలో ఎంఎస్ ధోనీ కెప్టెన్సీలో టీమిండియా చరిత్ర సృష్టించింది. 17 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్లో యువరాజ్ అనేక దిగ్గజ ఆటగాళ్లతో కలిసి ఆడి, ఎన్నో గుర్తుండిపోయే పార్ట్నర్షిప్లు నమోదు చేశాడు. అయితే తాజాగా మైఖేల్ వాన్తో ‘ది ఓవర్ ల్యాప్ క్రికెట్’ యూట్యూబ్ ఛానల్లో మాట్లాడిన యువరాజ్ సింగ్, తనకు ఇష్టమైన బ్యాటింగ్ పార్ట్నర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇందులో యూవీ అందరినీ ఆశ్చర్యపరుస్తూ.. సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ వంటి దిగ్గజాల కంటే ఎంఎస్ ధోనీనే తన బెస్ట్ బ్యాటింగ్ పార్ట్నర్గా తేల్చేశాడు.
యువరాజ్–ధోనీ జంట కలిసి అనేక మ్యాచ్ల్లో కీలక భాగస్వామ్యాలు నమోదు చేసింది. ముఖ్యంగా 2006లో పాకిస్తాన్పై భారత్ సాధించిన 4-1 వన్డే సిరీస్ విజయానికి ఈ జంట ప్రధాన కారకులుగా నిలిచింది. అలాగే 2017లో ఇంగ్లాండ్పై కటక్ లో జరిగిన మ్యాచ్ లో వీరిద్దరూ కలిసి 256 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఆ మ్యాచ్లో యువరాజ్ 150 పరుగులు చేసి కెరీర్ బెస్ట్ స్కోర్ సాధించాడు.
మరోవైపు యువరాజ్ సింగ్ విరాట్ కోహ్లీతో కూడా అనేక కీలక పార్ట్నర్షిప్లు నమోదు చేశాడు. ముఖ్యంగా 2016 టీ20 వరల్డ్ కప్లో పాకిస్తాన్ పై సాధించిన విజయాల్లో వీరి భాగస్వామ్యం కీలకం. ఇక సచిన్ టెండూల్కర్ తో కలిసి 2008లో చెన్నై టెస్ట్లో ఇంగ్లాండ్పై భారత్ చేసిన 387 పరుగుల రికార్డు చేజ్లో యువరాజ్ పాత్ర మరువలేనిది. ఇదే ఇంటర్వ్యూలో ఐపీఎల్ వ్యవస్థాపకుడు లలిత్ మోదీపై కూడా యువరాజ్ ప్రశంసలు కురిపించాడు. 2007 టీ20 వరల్డ్ కప్లో ఇంగ్లాండ్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ పై ఆరు బంతుల్లో ఆరు సిక్సులు కొట్టిన తర్వాత మొదట ఫెరారీ ఇస్తానని చెప్పి, తర్వాత పోర్షే 911 ఇవ్వాలని హామీ ఇచ్చారని గుర్తు చేశాడు. చివరికి యువరాజ్కు బీఎండబ్ల్యూ ఎం5 కారును బహుమతిగా అందించారని వెల్లడించాడు.
తాజావార్తలు
-
Nandini Reddy: ‘పెద్ది’ వివాదంపై నందిని రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. బుచ్చిబాబు తప్పు ఒప్పుకున్నాడు!
-
Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
-
Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
-
PM Modi: ఎన్డీఏ రాకతో దేశ తలరాత మారిపోయింది.. 12 ఏళ్ల వేడుకలో మోడీ కీలక వ్యాఖ్యలు
-
CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!