Yuvraj Singh: సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ కాదు.. తానే నా బెస్ట్ బ్యాటింగ్ పార్టనర్..!
- సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ కంటే..
- ఎంఎస్ ధోనీనే తన బెస్ట్ బ్యాటింగ్ పార్ట్నర్
- ఇంటర్వ్యూలో యువరాజ్ సింగ్ వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yuvraj Singh: భారత క్రికెట్ చరిత్రలో గొప్ప మ్యాచ్ విన్నర్లలో ఒకరిగా పేరుగాంచిన యువరాజ్ సింగ్ గురించి ప్రత్యేకంగా చేపలసిన పనిలేదు. ఆయన అంతర్జాతీయ కెరీర్లో ఎన్నో మధుర జ్ఞాపకాలను క్రికెట్ అభిమానులకు అందించాడు. 2000లో జరిగిన అండర్-19 వరల్డ్ కప్ గెలుపు నుంచి, 2011 వరల్డ్ కప్లో భారత్కు 28 ఏళ్ల తర్వాత ట్రోఫీ అందించడంలో కీలక పాత్ర పోషించాడు యూవీ. ఈ రెండు టోర్నమెంట్లలోనూ ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అవార్డు సాధించడం మరో విశేషం.
Singer Mangli : మంగ్లీ చీటింగ్ కేసులో టాలీవుడ్ డైరెక్టర్?
Also Read
- Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
- Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
- Telangana : తెలంగాణ ఉద్యమకారులకు గుడ్న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!
- CSK Vs LSG: లక్నో గ్రౌండ్లో కార్తీక్ శర్మ వీరవిహారం.. నిర్ణీత 20 ఓవర్లలో చెన్నై భారీ స్కోరు..
అంతేకాకుండా 2007లో జరిగిన తొలి టీ20 వరల్డ్ కప్ విజయంలో కూడా యువరాజ్ కీలక పాత్ర పోషించాడు. ఆ సమయంలో ఎంఎస్ ధోనీ కెప్టెన్సీలో టీమిండియా చరిత్ర సృష్టించింది. 17 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్లో యువరాజ్ అనేక దిగ్గజ ఆటగాళ్లతో కలిసి ఆడి, ఎన్నో గుర్తుండిపోయే పార్ట్నర్షిప్లు నమోదు చేశాడు. అయితే తాజాగా మైఖేల్ వాన్తో ‘ది ఓవర్ ల్యాప్ క్రికెట్’ యూట్యూబ్ ఛానల్లో మాట్లాడిన యువరాజ్ సింగ్, తనకు ఇష్టమైన బ్యాటింగ్ పార్ట్నర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇందులో యూవీ అందరినీ ఆశ్చర్యపరుస్తూ.. సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ వంటి దిగ్గజాల కంటే ఎంఎస్ ధోనీనే తన బెస్ట్ బ్యాటింగ్ పార్ట్నర్గా తేల్చేశాడు.
యువరాజ్–ధోనీ జంట కలిసి అనేక మ్యాచ్ల్లో కీలక భాగస్వామ్యాలు నమోదు చేసింది. ముఖ్యంగా 2006లో పాకిస్తాన్పై భారత్ సాధించిన 4-1 వన్డే సిరీస్ విజయానికి ఈ జంట ప్రధాన కారకులుగా నిలిచింది. అలాగే 2017లో ఇంగ్లాండ్పై కటక్ లో జరిగిన మ్యాచ్ లో వీరిద్దరూ కలిసి 256 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఆ మ్యాచ్లో యువరాజ్ 150 పరుగులు చేసి కెరీర్ బెస్ట్ స్కోర్ సాధించాడు.
మరోవైపు యువరాజ్ సింగ్ విరాట్ కోహ్లీతో కూడా అనేక కీలక పార్ట్నర్షిప్లు నమోదు చేశాడు. ముఖ్యంగా 2016 టీ20 వరల్డ్ కప్లో పాకిస్తాన్ పై సాధించిన విజయాల్లో వీరి భాగస్వామ్యం కీలకం. ఇక సచిన్ టెండూల్కర్ తో కలిసి 2008లో చెన్నై టెస్ట్లో ఇంగ్లాండ్పై భారత్ చేసిన 387 పరుగుల రికార్డు చేజ్లో యువరాజ్ పాత్ర మరువలేనిది. ఇదే ఇంటర్వ్యూలో ఐపీఎల్ వ్యవస్థాపకుడు లలిత్ మోదీపై కూడా యువరాజ్ ప్రశంసలు కురిపించాడు. 2007 టీ20 వరల్డ్ కప్లో ఇంగ్లాండ్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ పై ఆరు బంతుల్లో ఆరు సిక్సులు కొట్టిన తర్వాత మొదట ఫెరారీ ఇస్తానని చెప్పి, తర్వాత పోర్షే 911 ఇవ్వాలని హామీ ఇచ్చారని గుర్తు చేశాడు. చివరికి యువరాజ్కు బీఎండబ్ల్యూ ఎం5 కారును బహుమతిగా అందించారని వెల్లడించాడు.
తాజావార్తలు
-
Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
-
Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..