Yuvraj Singh: సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ కాదు.. తానే నా బెస్ట్ బ్యాటింగ్ పార్టనర్..!
- సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ కంటే..
- ఎంఎస్ ధోనీనే తన బెస్ట్ బ్యాటింగ్ పార్ట్నర్
- ఇంటర్వ్యూలో యువరాజ్ సింగ్ వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yuvraj Singh: భారత క్రికెట్ చరిత్రలో గొప్ప మ్యాచ్ విన్నర్లలో ఒకరిగా పేరుగాంచిన యువరాజ్ సింగ్ గురించి ప్రత్యేకంగా చేపలసిన పనిలేదు. ఆయన అంతర్జాతీయ కెరీర్లో ఎన్నో మధుర జ్ఞాపకాలను క్రికెట్ అభిమానులకు అందించాడు. 2000లో జరిగిన అండర్-19 వరల్డ్ కప్ గెలుపు నుంచి, 2011 వరల్డ్ కప్లో భారత్కు 28 ఏళ్ల తర్వాత ట్రోఫీ అందించడంలో కీలక పాత్ర పోషించాడు యూవీ. ఈ రెండు టోర్నమెంట్లలోనూ ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అవార్డు సాధించడం మరో విశేషం.
Singer Mangli : మంగ్లీ చీటింగ్ కేసులో టాలీవుడ్ డైరెక్టర్?
Also Read
- Lionel Messi: ఫుట్బాల్ ప్రపంచంలో శకం సమాప్తం.. అర్జెంటీనా దిగ్గజం మెస్సీ రిటైర్మెంట్..
- Putin: రష్యా అధ్యక్షుడు షాకింగ్ నిర్ణయం.. కాన్వాయ్ ఆపి ఫొటోలు దిగిన పుతిన్.. వీడియో వైరల్
- CM Revanth Reddy: ఈ 1000 రోజుల్లో కేసీఆర్ ఒక్కసారైనా జనం కోసం బయటకు వచ్చారా..?: సీఎం రేవంత్రెడ్డి
- Maharashtra: ఘోర విషాదం.. జీపు బోల్తా.. నలుగురు తెలంగాణ వాసుల మృతి
అంతేకాకుండా 2007లో జరిగిన తొలి టీ20 వరల్డ్ కప్ విజయంలో కూడా యువరాజ్ కీలక పాత్ర పోషించాడు. ఆ సమయంలో ఎంఎస్ ధోనీ కెప్టెన్సీలో టీమిండియా చరిత్ర సృష్టించింది. 17 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్లో యువరాజ్ అనేక దిగ్గజ ఆటగాళ్లతో కలిసి ఆడి, ఎన్నో గుర్తుండిపోయే పార్ట్నర్షిప్లు నమోదు చేశాడు. అయితే తాజాగా మైఖేల్ వాన్తో ‘ది ఓవర్ ల్యాప్ క్రికెట్’ యూట్యూబ్ ఛానల్లో మాట్లాడిన యువరాజ్ సింగ్, తనకు ఇష్టమైన బ్యాటింగ్ పార్ట్నర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇందులో యూవీ అందరినీ ఆశ్చర్యపరుస్తూ.. సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ వంటి దిగ్గజాల కంటే ఎంఎస్ ధోనీనే తన బెస్ట్ బ్యాటింగ్ పార్ట్నర్గా తేల్చేశాడు.
యువరాజ్–ధోనీ జంట కలిసి అనేక మ్యాచ్ల్లో కీలక భాగస్వామ్యాలు నమోదు చేసింది. ముఖ్యంగా 2006లో పాకిస్తాన్పై భారత్ సాధించిన 4-1 వన్డే సిరీస్ విజయానికి ఈ జంట ప్రధాన కారకులుగా నిలిచింది. అలాగే 2017లో ఇంగ్లాండ్పై కటక్ లో జరిగిన మ్యాచ్ లో వీరిద్దరూ కలిసి 256 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఆ మ్యాచ్లో యువరాజ్ 150 పరుగులు చేసి కెరీర్ బెస్ట్ స్కోర్ సాధించాడు.
మరోవైపు యువరాజ్ సింగ్ విరాట్ కోహ్లీతో కూడా అనేక కీలక పార్ట్నర్షిప్లు నమోదు చేశాడు. ముఖ్యంగా 2016 టీ20 వరల్డ్ కప్లో పాకిస్తాన్ పై సాధించిన విజయాల్లో వీరి భాగస్వామ్యం కీలకం. ఇక సచిన్ టెండూల్కర్ తో కలిసి 2008లో చెన్నై టెస్ట్లో ఇంగ్లాండ్పై భారత్ చేసిన 387 పరుగుల రికార్డు చేజ్లో యువరాజ్ పాత్ర మరువలేనిది. ఇదే ఇంటర్వ్యూలో ఐపీఎల్ వ్యవస్థాపకుడు లలిత్ మోదీపై కూడా యువరాజ్ ప్రశంసలు కురిపించాడు. 2007 టీ20 వరల్డ్ కప్లో ఇంగ్లాండ్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ పై ఆరు బంతుల్లో ఆరు సిక్సులు కొట్టిన తర్వాత మొదట ఫెరారీ ఇస్తానని చెప్పి, తర్వాత పోర్షే 911 ఇవ్వాలని హామీ ఇచ్చారని గుర్తు చేశాడు. చివరికి యువరాజ్కు బీఎండబ్ల్యూ ఎం5 కారును బహుమతిగా అందించారని వెల్లడించాడు.
తాజావార్తలు
-
Dulquer Salman: ‘ఐ యామ్ గేమ్’ కోసం నాగ్ అశ్విన్ ఎడిటింగ్..
-
Nag Ashwin : దుల్కర్ ‘ఐ యామ్ గేమ్’లో మైండ్ బ్లాంక్ అయ్యే సీక్రెట్ లీక్ చేసిన నాగ్ అశ్విన్!
-
Lionel Messi: ఫుట్బాల్ ప్రపంచంలో శకం సమాప్తం.. అర్జెంటీనా దిగ్గజం మెస్సీ రిటైర్మెంట్..
-
Putin: రష్యా అధ్యక్షుడు షాకింగ్ నిర్ణయం.. కాన్వాయ్ ఆపి ఫొటోలు దిగిన పుతిన్.. వీడియో వైరల్
-
CM Revanth Reddy: ఈ 1000 రోజుల్లో కేసీఆర్ ఒక్కసారైనా జనం కోసం బయటకు వచ్చారా..?: సీఎం రేవంత్రెడ్డి
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!