Arudra Meets CM Chandrababu: ఆరుద్రకు సీఎం చంద్రబాబు హామీ
- తనను కలిసిన కాకినాడ జిల్లాకు చెందిన బాధిత మహిళా ఆరుద్రకు అండగా నిలిచారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
- దివ్యాంగురాలైన ఆమె కుమార్తెకు రూ. 10 వేల పెన్షన్ మంజూరు చేస్తామని హామీ
- ఆరుద్ర కుమార్తె వైద్యానికి రూ. 5 లక్షల సాయం ప్రకటన
- ఆమె ఆస్తి వివాదాలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సాయం చేస్తుందని హామీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arudra Meets CM Chandrababu: తనను కలిసిన కాకినాడ జిల్లాకు చెందిన బాధిత మహిళా ఆరుద్రకు అండగా నిలిచారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. దివ్యాంగురాలైన ఆమె కుమార్తెకు రూ. 10 వేల పెన్షన్ మంజూరు చేస్తామని హామీ ఇచ్చిన ఆయన.. ఆరుద్ర కుమార్తె వైద్యానికి రూ. 5 లక్షల సాయం ప్రకటించారు.. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఆర్థిక సాయం అందక, కుమార్తెకు వైద్యం అందక ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఆరుద్ర. అంతేకాదు.. మాజీ మంత్రి దాడిశెట్టి రాజా గన్మెన్తో పాటు వైసీపీ నేతల దాడిలో బాధిత మహిళ ఆరుద్ర, ఆమె కుమార్తె గాయపడ్డారు.. మరోవైపు.. ఆమె ఆస్తి వివాదాలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సాయం చేస్తుందని కూడా హామీ ఇచ్చారు సీఎం చంద్రబాబు.
Read Also: Astrology: జూన్ 15, శనివారం దినఫలాలు
Also Read
- Tamil Nadu: అలాగైతే కేబినెట్ నుంచి వైదొలుగుతాం.. సీఎం విజయ్కు కాంగ్రెస్ వార్నింగ్.. కారణమిదేనా?
- IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలపై మళ్లీ వాన గండం.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
- Supreme Court: సెప్టెంబర్ 5న ఢిల్లీలో సీజేపీ నిరసన మార్చ్.. అడ్డుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ
- Vijayawada to Amaravati: విజయవాడ నుంచి అమరావతికి రాజబాట.. రూ.1000 కోట్లతో మరో బ్రిడ్జి..
కాగా, వైసీపీ హయాంలో దివ్యాంగురాలైన కుమార్తెకు వైద్యం అందక ఇబ్బందులు పడిన ఆరుద్ర.. అప్పటి సీఎం వైఎస్ జగన్ ని కలిసేందుకు వెళ్తే.. గేటు నుంచే వెనక్కి పంపారనే విమర్శలు వచ్చాయి.. ఇక, ఆరుద్ర ఆస్తిని వైసీపీ నేతల అండతో కబ్జా చేస్తే, ఏ చర్యలూ తీసుకోలేదని బాధితిరాలు కన్నీరుపెట్టుకున్నారు.. అయితే, శుక్రవారం సీఎం చంద్రబాబుని ఆరుద్ర కలిశారు. కుమార్తెకు వైద్యం, దివ్యాంగుల పెన్షన్ అందిస్తామని సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు. ఆస్తి వివాదం పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మానవతా దృక్పథంతో అండగా నిలిచారు. ఆమె కుమార్తె వైద్యానికి రూ. 5 లక్షల సాయం ప్రకటించడమే కాకుండా నెలకు రూ.10 పింఛను అందించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.. కోర్టులో ఉన్న స్థల వివాదంపై ప్రభుత్వ పరంగా ఎంత వరకు సాయం చేయవచ్చు అనేది కూడా పరిశీలించి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు సీఎం చంద్రబాబు నాయుడు.
https://twitter.com/AndhraPradeshCM/status/1801679012084785639
తాజావార్తలు
-
CM Revanth Reddy : కేసీఆర్ అప్పులపై రేవంత్ ఫైర్.. ‘భారం మోస్తున్నాం’!
-
Allu Arjun : రాకా హైప్ ఓకే.. కంటెంట్ ఆ రేంజ్ లో లేక పోతే?
-
CM Revanth Reddy : హైదరాబాద్కు కొత్త రూపు.. మూడు కార్పొరేషన్ల లోగోలు
-
Tamil Nadu: అలాగైతే కేబినెట్ నుంచి వైదొలుగుతాం.. సీఎం విజయ్కు కాంగ్రెస్ వార్నింగ్.. కారణమిదేనా?
-
IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలపై మళ్లీ వాన గండం.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!