YSRCP Samajika Sadhikara Bus Yatra: నేటి నుంచి రెండో దశ వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YSRCP Samajika Sadhikara Bus Yatra: ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు జరిగిన అభివృద్ధిని వివరిస్తూ.. గతంలో ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడుతూ.. వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర నిర్వహించిన విషయం విదితమే.. ఇప్పటికే తొలి దశ బస్సు యాత్ర విజయవంతం చేసిన మంత్రులు, వైసీపీ నేతలు.. రెండో దశ యాత్రకు సిద్ధం అవుతున్నారు.. ఇవాళ్టి నుంచి వైసీపీ సామాజిక సాధికార యాత్ర ఫేజ్ -2 ప్రారంభం కానుంది.. ఇవాళ్టి నుంచి ఈ నెల 30వ తేదీ వరకు రెండో ఫేజ్ బస్సు యాత్ర కొనసాగనుంది.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ నాయకులతో ఈ బస్సు యాత్రలు సాగనున్నాయి.. తొలి దశలో మూడు ప్రాంతాల్లో అంటే ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమలో ఒకేసారి బస్సు యాత్రలు నిర్వహించినట్టుగానే.. ఇవాళ శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట, గుంటూరు జిల్లా పొన్నూరు, శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గాల్లో యాత్ర ప్రారంభంకానుంది.. 39 నియోజకవర్గాలలో రెండో విడత బస్సు యాత్ర సాగనుంది.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు జగన్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సాధికారతను ప్రజలకు వివరించటమే లక్ష్యంగా యాత్ర నిర్వహిస్తున్నారు.. మొదటి విడతలో 35 నియోజకవర్గాలను టచ్ చేసింది వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర.
Read Also: Stock Market Opening: రాకెట్ వేగంతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. 500 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
Also Read
- AC Usage Tips: మీరు AC వాడుతున్నారా? ఈ 5 చిట్కాలు తప్పక పాటించండి..!
- V.D. Satheesan: "సతీశన్ అనే నేను".. దశాబ్దం తర్వాత కేరళంలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం..
- AP Crime: ఏపీలో దారుణం.. మైనర్ బాలికపై రెండేళ్లుగా అత్యాచారం.. నలుగురిపై కేసు నమోదు
- Pakistan: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను గద్దె దించేందుకు అమెరికా కుట్ర.. బయటపడ్డ సంచలన రహస్యాలు!
ఈ యాత్ర ద్వారా వైఎస్ జగన్ పరిపాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు జరిగిన మేలును, సామాజిక న్యాయం, రాజ్యాధికారం పొందిన వైనాన్ని ప్రజలకు వివరిస్తున్నారు మంత్రులు, ప్రజాప్రతినిధులు, వైసీపీ నేతలు.. వైసీపీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ యాత్ర తొలి దశలో 35 నియోజకవర్గాల్లో జరిగింది. రెండో దశలో 39 నియోజకవర్గాల్లో జరుగుతుంది. ఈ యాత్రలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నాయకులు పాల్గొంటారు. ఏపీ సీఎంగా వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ నాలుగున్నరేళ్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల అభివృద్ధి, సంక్షేమంతో పాటు ఈ వర్గాల ఆర్ధిక సాధికారత కోసం తీసుకున్న చర్యలను, చేసిన మంచిని ఈ యాత్రల్లో వివరించనున్నారు నేతలు.. అక్టోబర్ 26న ప్రారంభమైన సామాజిక సాధికార బస్సు యాత్ర మొదటి దశ విజయవంతం.. కాగా, ఇప్పుడు రెండో దశను మరింత ఉత్సాహంగా నిర్వహించేందుకు సిద్ధం అవుతున్నారు వైసీపీ నేతలు.
తాజావార్తలు
-
PBKS-Dharamsala: పంజాబ్ కింగ్స్ కొంపముంచిన ధర్మశాల.. ప్రత్యర్థి జట్లకు మాత్రం అదృష్ట వేదిక!
-
AC Usage Tips: మీరు AC వాడుతున్నారా? ఈ 5 చిట్కాలు తప్పక పాటించండి..!
-
JR NTR : అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రాకుండానే థియేటర్ వద్ద భారీ కటౌట్.. పాలాభిషేకాలతో ఫ్యాన్స్ రచ్చ
-
Samsung Galaxy M47 5G, F70 Pro 5G: సామ్ సంగ్ మిడ్-రేంజ్ 5G ఫోన్లు విడుదలకు సిద్ధం.. 8GB ర్యామ్
-
Kalki Avatar: కలియుగం ముగింపుకు కౌంట్డౌన్ మొదలైందా? పురాణాలు చెప్పిన భయంకర నిజాలు ఇవే!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..