Nandigam Suresh: రాష్ట్రంలో పేదలకు పట్టిన దరిద్రం చంద్రబాబు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YSRCP MP Nandigam Suresh on TDP: రాజధాని పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా అడ్డుకుంటున్న టీడీపీ నేతలకు హైకోర్టు తీర్పు చెంప చెళ్లుమనిపించిందని వైఎస్సార్సీపీ ఎంపీ నందిగం సురేష్ అన్నారు. శనివారం ఆయన తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. అమరావతిలో చంద్రబాబు తనవారికే ప్రయోజనం చేకూర్చారని ఆయన ఆరోపించారు. అమరావతిలో తన సామాజిక వర్గానికి విలువైన భూములు ఇచ్చారని ఎంపీ మండిపడ్డారు. అసైన్డ్ రైతులను చంద్రబాబు చిన్నచూపు చూశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పేదలకు అమరావతి ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా కోర్టుల్లో కేసులు వేశారన్నారు. చంద్రబాబు అనుకున్న అమరావతిలో ఎస్సీ, బీసీలు ఉండకూడదని అనుకుంటున్నారని విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో పేదలకు పట్టిన దరిద్రం చంద్రబాబు అంటూ ఆయన ధ్వజమెత్తారు. నిన్న కోర్టు తన తీర్పుతో చంద్రబాబు కళ్లు తెరిపించిందని.. ఇప్పటికైనా ఆయన తన వైఖరిని మార్చుకోవాలన్నారు. పేదల పక్షాన సీఎం జగన్ పోరాటం చేస్తున్నారని.. పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తే టీడీపీకి అభ్యంతరం ఏంటి అని ప్రశ్నించారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఒక్కవర్గానికైనా న్యాయం చేశారా అంటూ ఎంపీ సురేష్ ప్రశ్నించారు.
Also Read
Read Also: Star Cricketer Wife: స్టార్ క్రికెటర్ భార్యకు చేదు అనుభవం.. వెంటపడి వేధించిన యువకులు
“చంద్రబాబు కోరుకున్న బినామీ రాజధాని కావాలా??.. సీఎం జగన్ కోరుకునే ప్రజా రాజధాని కావాలా?. మేము వచ్చాక అమరావతి పేదలను వెళ్ల గొడ్తామని అచ్చం నాయుడు అంటున్నారు.పేదలకు అమరావతిలో ఇళ్ల స్థలాలు ఇవ్వొద్దని పెయిడ్ రైతులను సుప్రీంకోర్టుకు చంద్రబాబు పంపించారు. రానున్న రోజుల్లో ప్రజలు చంద్రబాబుకి బుద్ధి చెబుతారు.” అని ఎంపీ సురేష్ అన్నారు.
తాజావార్తలు
-
Kerala Congress: కాంగ్రెస్ ఇరకాటం.. కేరళ మరో కర్ణాటక కాబోతోందా.?
-
PEDDI: 80ల నాటి విజయనగరం కోసం ఏకంగా 24 భారీ సెట్లు!
-
Nitish Rana Out: నితీష్ రాణా ఔట్పై వివాదం.. డెడ్ బాల్ ఇవ్వాలా?.. నిబంధనలు ఏమంటున్నాయి?
-
Vijay-Governor: గవర్నర్ను కలిసిన విజయ్.. 112 ఎమ్మెల్యేల మద్దతు లేఖ అందజేత
-
Akhilesh Yadav: ఐప్యాక్తో అఖిలేష్ యాదవ్ తెగదెంపులు.. నమ్మకం పోయిందా? భయం పట్టుకుందా?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!