Nandigam Suresh: రాష్ట్రంలో పేదలకు పట్టిన దరిద్రం చంద్రబాబు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YSRCP MP Nandigam Suresh on TDP: రాజధాని పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా అడ్డుకుంటున్న టీడీపీ నేతలకు హైకోర్టు తీర్పు చెంప చెళ్లుమనిపించిందని వైఎస్సార్సీపీ ఎంపీ నందిగం సురేష్ అన్నారు. శనివారం ఆయన తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. అమరావతిలో చంద్రబాబు తనవారికే ప్రయోజనం చేకూర్చారని ఆయన ఆరోపించారు. అమరావతిలో తన సామాజిక వర్గానికి విలువైన భూములు ఇచ్చారని ఎంపీ మండిపడ్డారు. అసైన్డ్ రైతులను చంద్రబాబు చిన్నచూపు చూశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పేదలకు అమరావతి ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా కోర్టుల్లో కేసులు వేశారన్నారు. చంద్రబాబు అనుకున్న అమరావతిలో ఎస్సీ, బీసీలు ఉండకూడదని అనుకుంటున్నారని విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో పేదలకు పట్టిన దరిద్రం చంద్రబాబు అంటూ ఆయన ధ్వజమెత్తారు. నిన్న కోర్టు తన తీర్పుతో చంద్రబాబు కళ్లు తెరిపించిందని.. ఇప్పటికైనా ఆయన తన వైఖరిని మార్చుకోవాలన్నారు. పేదల పక్షాన సీఎం జగన్ పోరాటం చేస్తున్నారని.. పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తే టీడీపీకి అభ్యంతరం ఏంటి అని ప్రశ్నించారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఒక్కవర్గానికైనా న్యాయం చేశారా అంటూ ఎంపీ సురేష్ ప్రశ్నించారు.
Also Read
- Ring Removal Tips: మీ ఉంగరం వేలికి ఇరుక్కుపోయిందా..? సింపుల్గా తీసే చిట్కాలు ఇవే..
- Narayana: త్రేతాయుగంలో రావణుడు విలన్.. కలియుగంలో రావణ్ను హీరో చేశారు..
- Hassan Eisakhil: తండ్రికి తగ్గ తనయుడు.. 28 బంతుల్లో సెంచరీ.. 16 సిక్సర్లతో విధ్వంసం.!
- Jangaon: మద్యం మత్తులో హల్చల్.. బస్టాండ్ నుంచి ఆర్టీసీ అద్దె బస్సును ఎత్తుకెళ్లిన వ్యక్తి
Read Also: Star Cricketer Wife: స్టార్ క్రికెటర్ భార్యకు చేదు అనుభవం.. వెంటపడి వేధించిన యువకులు
“చంద్రబాబు కోరుకున్న బినామీ రాజధాని కావాలా??.. సీఎం జగన్ కోరుకునే ప్రజా రాజధాని కావాలా?. మేము వచ్చాక అమరావతి పేదలను వెళ్ల గొడ్తామని అచ్చం నాయుడు అంటున్నారు.పేదలకు అమరావతిలో ఇళ్ల స్థలాలు ఇవ్వొద్దని పెయిడ్ రైతులను సుప్రీంకోర్టుకు చంద్రబాబు పంపించారు. రానున్న రోజుల్లో ప్రజలు చంద్రబాబుకి బుద్ధి చెబుతారు.” అని ఎంపీ సురేష్ అన్నారు.
తాజావార్తలు
-
Ring Removal Tips: మీ ఉంగరం వేలికి ఇరుక్కుపోయిందా..? సింపుల్గా తీసే చిట్కాలు ఇవే..
-
Gudluri Ashok Babu: హీరోగా అవకాశం ఇస్తానంటూ రూ.3.5 కోట్ల మోసం.. ‘భాగమతి’ డైరెక్టర్పై కేసు నమోదు!
-
Timex Deepwater Meridian 300: టైమెక్స్ డీప్వాటర్ మెరిడియన్ 300 వాచ్ విడుదల.. ధర, ఫీచర్ల వివరాలు ఇవే
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Narayana: త్రేతాయుగంలో రావణుడు విలన్.. కలియుగంలో రావణ్ను హీరో చేశారు..
ట్రెండింగ్
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!