Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Ysrcp Mla Grandhi Srinivas Sensational Comments On Pawan Kalyan

Grandhi Srinivas: టీడీపీతో పవన్‌ సహజీవనం.. చిరంజీవి మీలా ఎవరినీ మోసం చేయలేదు..!

Published Date :June 30, 2023 , 11:55 am
By Sudhakar Ravula
Grandhi Srinivas: టీడీపీతో పవన్‌ సహజీవనం.. చిరంజీవి మీలా ఎవరినీ మోసం చేయలేదు..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Grandhi Srinivas: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై విరుచుకుపడ్డారు భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్.. ఈ రోజు సాయంత్రం భీమవరంలో వారాహి విజయయాత్రలో ప్రసంగించనున్న విషయం విదితమే కాదు.. ముందుగానే పవన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు లోకల్‌ ఎమ్మెల్యే గ్రంధి… పవన్ కల్యాణ్‌, చంద్రబాబుకు కావాల్సింది పెత్తందార్లు మాత్రమే.. పేదల కష్టాలు వారికి అవసరం లేదని విమర్శించారు.. వారాహి యాత్రలో రెండు చెప్పులు పోయాయి అంటున్న పవన్.. ప్యాకేజీ స్టార్ అని అందరికీ తెలుసు.. చంద్రబాబు ఇంటికి వీధి గుమ్మంలో వెళ్లిన పవన్.. ప్యాకేజీ తీసుకుని దొడ్డి దారిన వెళ్లిపోయారు. అక్కడే రెండు చెప్పులు వదిలేశారు.. చంద్రబాబు ఇంటికి వెళ్లి వెతికితే ఆ రెండు చెప్పులు దొరుకుతాయి అంటూ ఎద్దేవా చేశారు.. ఇక, పవన్ కల్యాణ్‌ ఎల్‌కేజీ లో చేర్పించేందుకు వయసు నిబంధన సడలిస్తు జీవో ఇవ్వమని ముఖ్యమంత్రికి విన్నవిస్తాను అంటూ సెటైర్లు వేశారు.

Read Also: Adipurush :14 వ రోజుకు ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా..?

Also Read

  • TM Exit Poll: తమిళనాడు సీఎంగా విజయ్.. సంచలనం స్పష్టిస్తున్న సర్వే..
  • Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీపై రూ.10 కోట్లు..! ఆ జట్టు కొనుగోలు చేసే అవకాశం..
  • Rohit Sharma గాయంపై కీలక అప్డేట్.. కెప్టెన్ Hardik Pandya ఏమన్నాడంటే.!
  • Babar Azam: ఒక్క సెంచరీతో.. విరాట్ కోహ్లీ, అభిషేక్ శర్మ సరసన నిలిచిన బాబర్ ఆజమ్..

పార్టీలు పెరిగితే ప్రజాస్వామ్యానికి మంచిది.. కానీ, పార్టీని ప్యాకేజీ కోసం అమ్మేయడం సరికాదని వ్యాఖ్యానించారు గ్రంధి శ్రీనివాస్‌.. ఎప్పుడు ఏం మాట్లాడతారో పవన్ కే అర్థం కాదన్న ఆయన.. గుడ్డలు ఊడదీసి కోడతాను అనేది వైసీపీకి ఓటు వేసిన వారినా..? లేక మిమ్మల్ని, చంద్రబాబుని ఓడించిన ప్రజలనా..? అని నిలదీశారు. పవన్ అన్నయ్య ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో కలిపెస్తే.. మీరు టీడీపీతో సహజీవనం చేస్తున్నారని విమర్శించారు. అయితే, చిరంజీవి ఎవరినీ మోసం చేయలేదు… కానీ, పవన్ అడుగడుగునా ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు.. అభిమానిగా పవన్ కల్యాణ్‌ని కోరేది ఒక్కటే.. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి అని సూచించారు.

Read Also: Vijayashanthi: ఎమ్మెల్యే రాజాసింగ్‌ సస్పెన్షన్‌ పై విజయశాంతి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

కుటుంబానికి ఆధారంగా వుండే యువతకు పీకపిసికేయండి, మక్కేలు ఇరగకొట్టండి అంటూ రౌడీయిజం నేర్పిస్తున్నారు అంటూ పవన్‌పై ఫైర్‌ అయ్యారు గ్రంధి శ్రీనివాస్.. యువతను రెచ్చగొట్టి వారి జీవితాలు నాశనం చేయకండి అని సూచించారు. యువతకు ఎప్పుడైనా మంచి సలహా ఇచ్చారా.? సీఎం రాష్ట్రంలోని పిల్లల చదువులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు.. తన సభకు వచ్చేవారిపై పవన్ కు అనుమానం.. అందుకే మీరంతా నాకు ఓట్లు వేయలేదని అవమనిస్తుంటారు అని విమర్శలు గుప్పించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్‌ జగన్ లా మీరు పాదయాత్ర చేయండి అని సూచించారు. ఇక, జ్వరం అని చెబుతూ, సినిమాలకి డబ్బింగ్ పూర్తి చేసి మరోసారి అభిమానులను మోసం చేశారని ఆరోపించారు. పవన్ చెబితే తెలుసుకోవాల్సినంత అమాయకులు కాదు భీమవరం వాళ్లు అని వార్నింగ్‌ ఇచ్చారు. నాదెండ్ల భాస్కర్ వెన్నుపోటు పేటెంట్ రైట్ ఉన్నవాళ్లు, ఆయన కుమారుడు నాదెండ్ల మనోహర్ రాసినవి పవన్ చదువుతున్నారు.. వెన్ను పోటు దారులు, భూ కబ్జాదారులు, మద్యం వ్యాపారాలు వంటివి చేసేవాళ్లు రాసినవి పవన్ చదువుతున్నారు అంటూ సంచలన ఆరోపణలు చేశారు ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • grandhi srinivas
  • janasena
  • pawan kalyan
  • YSRCP

తాజావార్తలు

  • Mark Zuckerberg: ఫేస్‌బుక్‌ను సృష్టించిన ‘డ్రాపౌట్’.. వేల కోట్ల సామ్రాజ్యాన్ని నిర్మించిన జుకర్‌బర్గ్‌కు డిగ్రీ లేదు తెలుసా!

  • TM Exit Poll: తమిళనాడు సీఎంగా విజయ్.. సంచలనం స్పష్టిస్తున్న సర్వే..

  • Cigarette Price Hike: సిగరెట్ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. మే నెలలో పెరగనున్న సిగరెట్ ధరలు?

  • Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీపై రూ.10 కోట్లు..! ఆ జట్టు కొనుగోలు చేసే అవకాశం..

  • Rohit Sharma గాయంపై కీలక అప్డేట్.. కెప్టెన్ Hardik Pandya ఏమన్నాడంటే.!

ట్రెండింగ్‌

  • Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!

  • Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?

  • Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్‌లో బంధువులు!

  • 50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!

  • 13 అంగుళాల 3.5K PureSight Pro డిస్‌ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions