Vijayasai Reddy: సిద్ధాంతం, నైతిక విలువలు లేని పార్టీ టీడీపీ.. విజయసాయి సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijayasai Reddy: నెల్లూరు జిల్లా కందుకూరులో ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఏ2 అయితే చంద్రబాబు పలు కేసుల్లో ఏ1 అని..తాను 22 కేసుల్లో ఏ2 కావచ్చు.. కానీ ఎక్కడా కూడా ఆర్థిక నేరాలకు పాల్పడలేదన్నారు. ఆ సెక్షన్స్ కూడా తన మీద లేవన్నారు. చంద్రబాబు ఏ1గా మూడు, నాలుగు కేసులు నమోదయ్యాయని.. ఎన్నికల అనంతరం చంద్రబాబుపై మరో 10 కేసులు నమోదవుతాయన్నారు. లక్షల కోట్ల అవినీతికి పాల్పడి, ఆ డబ్బుతో విదేశాల్లో ఆస్తులు కొన్నారని విమర్శించారు. అవినీతి సొమ్ము అయినా ఇక్కడ పెట్టుబడులు పెడితే ఏపీ అయినా బాగుపడేదన్నారు. ఏ1 గా ఉన్న వ్యక్తి ఏ2 మీద ఆరోపణలు చేయటం అసంబద్ధమని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు.
Read Also: Pawan Kalyan: పవన్ కల్యాణ్కు షాక్.. వారాహి సభకు పోలీసుల అనుమతి నిరాకరణ
Also Read
రఘురామకృష్ణంరాజు వైసీపీ ఎంపీగా గెలిచి మా పార్టీపైనే ఆరోపణలు చేశారని మండిపడ్డారు. మమ్మల్ని తిడుతూ ఉన్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ను కోరామన్నారు. బీజేపీతో కలవడం వల్లే చర్యల నుంచి తప్పించుకొన్నారని ఆరోపించారు. ఏ రాజకీయ పార్టీ అయినా రఘురామకృష్ణంరాజు లాంటి వ్యక్తిని తమ పార్టీలోకి తీసుకుని చట్ట సభలకు పంపాలంటే ఆలోచించుకోవాల్సిన పరిస్థితి కొని తెచ్చుకున్నాడని ఆయన అన్నారు. బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు ఆయనను నమ్మే పరిస్థితి లేదన్నారు. 1982లో టీడీపీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు ప్రతీ రాజకీయ పార్టీతో పొత్తు పెట్టుకుందని.. ఇండియాలోని ప్రతీ పార్టీతో టీడీపీ పొత్తు పెట్టుకుందన్నారు. ఒక సిద్ధాంతం, నైతిక విలువలు లేని పార్టీ టీడీపీ అంటూ ఆయన విమర్శించారు. బీజేపీ లాంటి పార్టీ టీడీపీతో పొత్తు పెట్టుకోవడం చాలా వర్గాలను నిరాశకు గురిచేసిందన్నారు. సామాజిక న్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని చాలా చోట్ల మార్పులు చేయాల్సి వచ్చిందన్నారు. అందరికీ న్యాయం చేసే బాధ్యత మా సీఎం తీసుకున్నారని.. అందరికీ న్యాయం జరుగుతుందని విజయ సాయి రెడ్డి స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!