YSRCP Strategy: గంటా రాజీనామా ఆమోదం వెనుక వైసీపీ వ్యూహం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YSRCP Strategy: దాదాపు మూడేళ్ల క్రితం రాజీనామా చేసిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామాను ఆమోదించడం వెనుక అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యూహం ఉంది అంటున్నారు విశ్లేషకులు.. వైసీపీ ప్రభుత్వం వ్యూహాత్మక అడుగుల్లో భాగంగానే గంటా రాజీనామాకు ఆమోద ముద్ర పడినట్టు చెబుతున్నారు.. టీడీపీ ఎమ్మెల్యే గంటా రాజీనామా విషయంలో అనూహ్య నిర్ణయం తీసుకోవడమే దీనికి ఉదహరణగా చెబుతున్నారు.. విశాఖపట్నం నార్త్ ఎమ్మెల్యేగా ఉన్న గంటా రాజీనామాను ఆమోదించిన అసెంబ్లీ స్పీకర్.. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు.. అయితే, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ మూడేళ్ల కిందట రాజీనామా చేశారు గంటా శ్రీనివాసరావు.. ఏళ్లపాటు రాజీనామా ఆమోదంపై వేచిచూస్తూ వచ్చిన అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం..
Read Also: Ganta Srinivasa Rao Resignation Accepted: గంటా శ్రీనివాసరావు రాజీనామా ఆమోదం..
Also Read
- Suryakumar Yadav: ఏడాదిలోనే హీరో నుంచి జీరోగా? సూర్యకుమార్ హిస్టరీలో బిగ్ ఫెయిల్యూర్స్ ఇవే..
- Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
- Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
- Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
ఇప్పుడు గంటా రాజీనామా ఆమోదం తెలపడం వెనుక రాజ్యసభ ఎన్నికల వ్యూహం ఉందంటున్నారు.. వచ్చే నెలలో రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోన్న.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. దానికి అనుగుణంగా టీడీపీ ఎమ్మెల్యే గంటా రాజీనామాకు ఆమోద ముద్ర వేసిందనే చర్చ సాగుతోంది. మరోవైపు.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచి.. టీడీపీలో చేరిన నలుగురు ఎమ్మెల్యేలతో పాటు.. టీడీపీ నుంచి వైసీపీ దగ్గరైన నలుగురు ఎమ్మెల్యేల డిస్క్వాలిఫికేషన్ పై కూడా చర్చ సాగుతోంది.. గంటా రాజీనామా ఆమోదంతో.. డిస్క్వాలిఫికేషన్ వ్యవహారం ఇప్పుడు తెరపైకి వచ్చింది.. గంటా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినప్పుడు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. దానిపై విమర్శలు గుప్పించింది.. స్పీకర్ ఫార్మేట్లో రాజీనామా ఇవ్వలేదని ఆరోపించారు.. దీంతో.. 2021, ఫిబ్రవరి 12వ తేదీన విశాఖలోని కూర్మనపాలెం గేట్ దగ్గర కార్మిక సంఘాల రిలే నిరాహారదీక్షకు మద్దతు ప్రకటించిన గంటా శ్రీనివాసరావు.. స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.. వెంటనే తన రాజీనామాను ఆమోదించాలని స్పీకర్ తమ్మినేని సీతారాంకు విన్నవించారు. అయితే, ఆ రాజీనామాపై నిర్ణయాన్ని ఇంత కాలం పెండింగ్లో ఉంచిన స్పీకర్.. ఇప్పుడు ఆమోదించింది.. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు.
తాజావార్తలు
-
Suryakumar Yadav: ఏడాదిలోనే హీరో నుంచి జీరోగా? సూర్యకుమార్ హిస్టరీలో బిగ్ ఫెయిల్యూర్స్ ఇవే..
-
Donald Trump: మోడీ నాకు మంచి స్నేహితుడు.. భారత్తో త్వరలో వాణిజ్య ఒప్పందం..
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!