Revanth Reddy : కేసీఆర్, కేజ్రీవాల్, అసదుద్దీన్ ముగ్గురూ సుపారీ కిల్లర్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Revanth Reddy : టీఆర్ఎస్ నేడు బీఆర్ఎస్ గా ఆవిర్భవించింది. బీఆర్ఎస్ పార్టీపై టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. పార్టీలను మార్చే కేసీఆర్ కు కాలం చెల్లిందన్నారు. తనను ప్రజలు నమ్మే రోజులు పోయాయన్నారు. ‘టీఆర్ఎస్ బీఆర్ఎస్ కాదు.. త్వరలో వీఆర్ఎస్ కాబోతోంది’ అంటూ వ్యాఖ్యానించారు. మూడోసారి అధికారం చేపట్టేందుకే రంగులు, పార్టీల పేర్లు మారుస్తున్నారంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటుతో తెలంగాణకు కేసీఆర్కు పేరుబంధం తెగిపోయిందన్నారు. తెలుగు రాష్ట్రాలను ఉమ్మడిగా మార్చేందుకు కేసీఆర్ పూనుకున్నారని ఆరోపించారు. ఎమ్మెల్సీ కవితకు నిజామాబాద్ లో ఓటర్లు ఎలా బుద్ధి చెప్పారో..రాబోయే ఎన్నికల్లో రాష్ట్రమంతా కేసీఆర్ కు అలానే బుద్ధి చెబుతారని రేవంత్ రెడ్డి చెప్పారు. ఎన్నో సంక్షేమ పథకాలు, ఉద్యోగాల కల్పన చేసిన కాంగ్రెస్ కు రాష్ట్రలో జనం పట్టం కట్టబోతున్నారని చెప్పారు. నిజామాబాద్ డీసీసీ అధ్యక్షుడు మోహన్ రెడ్డి ఇంట్లో నిర్వహించిన మీడియా సమావేశంలో రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.
Read Also: Alampur Ex Mla Joins in BRS: బీఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే
Also Read
- Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
- Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
- Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ 'ఎ' ట్రై-సిరీస్ పోరు..
- Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
కేసీఆర్, కేజ్రీవాల్, ఆసద్దుద్దీన్ కాంగ్రెస్ ను చంపే సుపారి కిల్లర్స్ గా రేవంత్ రెడ్డి అభివర్ణించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీనే అని రేవంత్ స్పష్టం చేశారు. ప్రత్యామ్నాయం మేమే అని చెబుతున్న బీజేపీ కి అంత సీన్ లేదన్నారు. నాలుగు ఎంపీ సీట్లు గెలిస్తే ప్రత్యామ్నాయం అవుతారా..? అంటూ ప్రశ్నించారు. చెరకు ఫ్యాక్టరీ తెరుస్తానని చెప్పి రైతులను కేసీఆర్ నట్టేట ముంచాడన్నారు. నిజమాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ బాండ్ పేపర్ ఇచ్చిన మోడీ పసుపు బోర్డే ఇవ్వలేదని విమర్శించారు. 80 వేల మందికి రైతుబీమా ఇచ్చానని కేసీఆర్ చెబుతున్నాడు. 80 వేల మంది మాత్రమే చనిపోయినట్లు ఎన్సీఆర్బీ లెక్కలు చెబుతున్నాయి. కానీ నిజానికి ఎనిమిదేళ్లలో లక్ష యాభై వేల మంది రైతులను కేసీఆర్ పొట్టనబెట్టుకున్నాడరని రేవంత్ ఆవేదన వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!