Revanth Reddy : కేసీఆర్, కేజ్రీవాల్, అసదుద్దీన్ ముగ్గురూ సుపారీ కిల్లర్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Revanth Reddy : టీఆర్ఎస్ నేడు బీఆర్ఎస్ గా ఆవిర్భవించింది. బీఆర్ఎస్ పార్టీపై టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. పార్టీలను మార్చే కేసీఆర్ కు కాలం చెల్లిందన్నారు. తనను ప్రజలు నమ్మే రోజులు పోయాయన్నారు. ‘టీఆర్ఎస్ బీఆర్ఎస్ కాదు.. త్వరలో వీఆర్ఎస్ కాబోతోంది’ అంటూ వ్యాఖ్యానించారు. మూడోసారి అధికారం చేపట్టేందుకే రంగులు, పార్టీల పేర్లు మారుస్తున్నారంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటుతో తెలంగాణకు కేసీఆర్కు పేరుబంధం తెగిపోయిందన్నారు. తెలుగు రాష్ట్రాలను ఉమ్మడిగా మార్చేందుకు కేసీఆర్ పూనుకున్నారని ఆరోపించారు. ఎమ్మెల్సీ కవితకు నిజామాబాద్ లో ఓటర్లు ఎలా బుద్ధి చెప్పారో..రాబోయే ఎన్నికల్లో రాష్ట్రమంతా కేసీఆర్ కు అలానే బుద్ధి చెబుతారని రేవంత్ రెడ్డి చెప్పారు. ఎన్నో సంక్షేమ పథకాలు, ఉద్యోగాల కల్పన చేసిన కాంగ్రెస్ కు రాష్ట్రలో జనం పట్టం కట్టబోతున్నారని చెప్పారు. నిజామాబాద్ డీసీసీ అధ్యక్షుడు మోహన్ రెడ్డి ఇంట్లో నిర్వహించిన మీడియా సమావేశంలో రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.
Read Also: Alampur Ex Mla Joins in BRS: బీఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే
Also Read
- Supreme Court: రామమందిర విరాళాల కేసు: అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు నో
- Mustard Oil Ban in US: భారత్లో హెల్దీ.. అమెరికాలో నిషేధం.. ఆవ నూనెపై నిజాలు ఇవే..!
- iPhone 18 Launch Date: యాపిల్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. ఐఫోన్ 18 ప్రో లాంచ్ డేట్ లీక్..! ఫీచర్లు, ధరలు వైరల్..
- Boondi Sev Curry Recipe: ఇంట్లో కూరగాయలు లేవా..? పెరుగు, బూందీ, సేవ్తో సూపర్ టేస్టీ కూర..
కేసీఆర్, కేజ్రీవాల్, ఆసద్దుద్దీన్ కాంగ్రెస్ ను చంపే సుపారి కిల్లర్స్ గా రేవంత్ రెడ్డి అభివర్ణించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీనే అని రేవంత్ స్పష్టం చేశారు. ప్రత్యామ్నాయం మేమే అని చెబుతున్న బీజేపీ కి అంత సీన్ లేదన్నారు. నాలుగు ఎంపీ సీట్లు గెలిస్తే ప్రత్యామ్నాయం అవుతారా..? అంటూ ప్రశ్నించారు. చెరకు ఫ్యాక్టరీ తెరుస్తానని చెప్పి రైతులను కేసీఆర్ నట్టేట ముంచాడన్నారు. నిజమాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ బాండ్ పేపర్ ఇచ్చిన మోడీ పసుపు బోర్డే ఇవ్వలేదని విమర్శించారు. 80 వేల మందికి రైతుబీమా ఇచ్చానని కేసీఆర్ చెబుతున్నాడు. 80 వేల మంది మాత్రమే చనిపోయినట్లు ఎన్సీఆర్బీ లెక్కలు చెబుతున్నాయి. కానీ నిజానికి ఎనిమిదేళ్లలో లక్ష యాభై వేల మంది రైతులను కేసీఆర్ పొట్టనబెట్టుకున్నాడరని రేవంత్ ఆవేదన వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Supreme Court: రామమందిర విరాళాల కేసు: అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు నో
-
Kakanmath Temple: ఈ ఆలయాన్ని దెయ్యాలు నిర్మించాయా? వెయ్యేళ్లుగా చెక్కుచెదరని రహస్యం ఇదేనా?
-
RaviTeja : మాస్ మహారాజా రవితేజ ‘ఇరుముడి’ ఫస్ట్ సింగిల్ ‘ఇరుముడి కట్టు’ రిలీజ్
-
Suriya : కరుప్పు బ్లాక్ బస్టర్ జోష్..నెక్ట్స్ సినిమాలో పాట పడబోతున్న సూర్య
-
Mustard Oil Ban in US: భారత్లో హెల్దీ.. అమెరికాలో నిషేధం.. ఆవ నూనెపై నిజాలు ఇవే..!
ట్రెండింగ్
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!