IPL Auction 2024: ఐపీఎల్ వేలంలో కోట్లు కొల్లగొట్టిన యువ ఆటగాళ్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ వేలంలో యువ ఆటగాళ్లపై ఫ్రాంఛైజీలు కాసుల వర్షం కురిపించింది. దుబాయ్ లో జరుగుతున్న మినీ వేలంలో అత్యధికంగా ఆస్ట్రేలియా స్టార్ బాలర్ మిచెల్ స్టార్క్ రూ. 24.75 కోట్లకు సేల్ అయ్యాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ ను రూ. 20.75 కోట్లు వెచ్చించి సన్ రైజర్స్ తీసుకుంది. ఈ క్రమంలో.. పలువురు యువ ఆటగాళ్లు కూడా బంపర్ ఆఫర్ కొట్టేశారు. ఉత్తరప్రదేశ్ కి చెందిన 20 ఏళ్ల సమీర్ రిజ్వీని రూ. 8 కోట్ల 40 లక్షలకు చెన్నై సూపర్ కింగ్స్ దక్కించుకుంది. టీ20 లీగ్లో కాన్పూర్ సూపర్ స్టార్స్ తరఫున అత్యధిక సిక్సర్లు కొట్టి రికార్డు నెలకొల్పాడు. అంతేకాకుండా.. తొమ్మిది ఇన్నింగ్స్లలో రెండు తుఫాను సెంచరీలు చేశాడు. రాజస్థాన్తో జరిగిన వన్డే మ్యాచ్ లో 65 బంతుల్లో 91 పరుగులు చేశాడు. ఫైనల్లో 50 బంతుల్లో 84 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించాడు.
IAS Transfers in AP: ఏపీలో 17 మంది ఐఏఎస్లకు బదిలీలు, కొత్త పోస్టింగ్లు
Also Read
- Dharmendra Pradhan: నీట్ ప్రశ్నాపత్రం లీక్పై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సంచలన ప్రకటన!
- Ambati Rayudu: IPL 2026లో తోపు కెప్టెన్ అతనే..
- Bermuda Triangle Mystery: బెర్ముడా రహస్యాన్ని ఛేదించిన శాస్త్రవేత్తలు.. అక్కడ ఏముందంటే..
- Virat Kohli: కెప్టెన్గా కాదు.. స్నేహితుడిగా జట్టును నడిపించా.!
జార్ఖండ్ యంగ్ ప్లేయర్ కుమార్ కుషగ్రా కోసం ఫ్రాంఛైజీలు పోటీపడ్డాయి. వికెట్ కీపర్ అండ్ బ్యాట్స్మెన్ కావడంతో.. భారీ మొత్తంలో అమ్ముడుపోయాడు. కుషగ్రను- రూ.7 కోట్ల 20 లక్షల( ఢిల్లీ క్యాపిటల్స్) సొంతం చేసుకుంది. కాగా.. ఇన్ని కోట్లు పెట్టడానికి కారణం.. విజయ్ హజారే ట్రోఫీలో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. మహారాష్ట్రపై 355 రన్స్ చేజింగ్ లో జార్ఖండ్ తరఫున కుషాగ్రా ఆరో స్థానంలో వచ్చి 37 బంతుల్లో నాలుగు ఫోర్లు, ఐదు సిక్సర్లతో 67 పరుగులు చేశాడు. దీంతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో.. తుఫాను బ్యాటింగ్కు ఫిదా అయిన ఫ్రాంచైజీలు యువ ఆటగాడిని తీసుకోవడానికి పోటీ పడ్డాయి.
Ayodhya Ram Temple: అద్వానీ, జోషిలకు ఆహ్వానం ఇచ్చిన విశ్వ హిందూ పరిషత్
యువ ఆటగాళ్లలో ఎవరికి ఎంత ధర పలికిందంటే..?
షారూఖ్ ఖాన్-రూ.7 కోట్ల 40 లక్షలు (గుజరాత్ టైటాన్స్)
శివం దూబే- రూ.5 కోట్ల 80 లక్షలు (రాజస్థాన్ రాయల్స్)
యశ్ దయాళ్- రూ. 5 కోట్లు (బెంగుళూరు)
మనిమారన్ సిద్ధార్థ్- 2 కోట్ల 40 లక్షలు (లక్నో)
తాజావార్తలు
-
Peddi: కథే ‘పెద్ది’కి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అంటున్న బుచ్చిబాబు..
-
PM Modi: యూఏఈపై జరిగిన దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం.. భారత్-యూఏఈ మధ్య కీలక ఒప్పందాలు
-
Dharmendra Pradhan: నీట్ ప్రశ్నాపత్రం లీక్పై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సంచలన ప్రకటన!
-
Ambati Rayudu: IPL 2026లో తోపు కెప్టెన్ అతనే..
-
Bermuda Triangle Mystery: బెర్ముడా రహస్యాన్ని ఛేదించిన శాస్త్రవేత్తలు.. అక్కడ ఏముందంటే..
ట్రెండింగ్
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!