Sajjala Bhargav : సజ్జల భార్గవ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్లు ఈ నెల 29కి వాయిదా
- ఏపీ హైకోర్టులో వైసీపీ సోషల్ మీడియా నేతలు సజ్జల భార్గవ్ రెడ్డి, అర్జున్రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్లపై విచారణ
- మొత్తం 8 కేసుల్లో ముందస్తు బెయిల్ ఇవ్వాలని సజ్జల భార్గవ్రెడ్డి పిటిషన్లు
- అన్ని పిటిషన్లపై నేడు విచారించిన ఏపీ హైకోర్టు
Sajjala Bhargav : ఏపీ హైకోర్టులో వైసీపీ సోషల్ మీడియా నేతలు సజ్జల భార్గవ్ రెడ్డి, అర్జున్రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్లపై నేడు విచారణ చేపట్టింది. మొత్తం 8 కేసుల్లో ముందస్తు బెయిల్ ఇవ్వాలని సజ్జల భార్గవ్రెడ్డి పిటిషన్లు దాఖలు చేశారు.. అయితే… అన్ని పిటిషన్లపై నేడు విచారణ చేసిన ఏపీ హైకోర్టు ఈ నెల 29కి వాయిదా వేసింది. వైసీపీ సోషల్ మీడియా వింగ్ నేత సజ్జల భార్గవ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్లపై ఆయన తరఫున వాదనలు పూర్తి చేశారు. ఏపీలో పోలీసులు రూలింగ్ పార్టీ ఒత్తిడికి ప్రభావితం అవుతున్నారని కోర్టుకు పిటిషనర్ తెలిపారు. వెంటాడి వరుసగా అక్రమ కేసులను పెట్టి ఇబ్బంది పెడుతున్నట్టు పిటిషనర్ తరుపు లాయర్ హైకోర్టు తెలిపారు. అంతేకాకుండా.. ఒక పోస్ట్ పెడితే శ్రీకాకుళం నుంచి కుప్పం వరకు రాష్ట్రమంతా కేసులు పెడుతున్నారన్న పిటిషనర్ తరుపు లాయర్ న్యాయస్థానానికి వివరించారు.
V. Hanumantha Rao: వి.హనుమంతరావు కారును ఢీ కొట్టిన మరో వాహనం.. సీసీ ఫుటేజ్ లో దృశ్యాలు..
Also Read
- Srilanka Cricketలో కలకలం.. అధ్యక్షుడుతో సహా మొత్తం కమిటీ మూకుమ్మడి రాజీనామా.!
- GPO Promotions : గ్రామ పంచాయతీ అధికారుల ప్రమోషన్లకు గ్రీన్ సిగ్నల్
- Vaibhav Sooryavanshi: నా బలం, శక్తికి కారణం అదే.. అందుకే ఈ దూకుడు.. మనసులో మాట చెప్పిన వైభవ్..
- MI Vs SRH Playing XI: ఊపు మీదున్న SRHకు ముంబై కళ్లెమేస్తుందా.?
వందల సంఖ్యలో కేసులు పెట్టడం వల్ల అనేక మంది ఇబ్బందులు పెడుతున్నారని, సుప్రీం కోర్టు మార్గదర్శకాలు కూడా పక్కన పెడుతున్నారని కోర్టు దృష్టికి పిటిషనర్ తీసుకువచ్చారు. ప్రస్తుతం 9 కేసులు ఉంటే అవి 90కి మించి పెరిగేలా కేసులు నమోదు ప్రక్రియ ఉందని, ప్రజాస్వామ్యంలో రాజ్యాంగ హక్కులను కూడా కాలరాసి అక్రమ కేసులు పెట్టారని పిటిషనర్ తరుపు లాయర్ వాదించారు. ఇదిలా ఉంటే.. కేసుల నమోదులో ప్రాథమికంగా స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని ప్రభుత్వం తరుపు న్యాయవాది హైకోర్టు తెలిపారు. ఆధారాలు సేకరించి కేసులు నమోదు చేసినట్లు.. అసభ్య పోస్టులు పెట్టిన వారు ఇచ్చిన స్టేట్ మెంట్ ఆధారంగా కూడా కేసులు నమోదు చేసినట్టు ప్రభుత్వం తరుపు లాయర్ వివరించారు. ఇలాంటి అన్ని కేసుల పిటిషన్లు ఈ నెల 29 విచారణ చేస్తామని ఏపీ హైకోర్టు వాయిదా వేసింది.
Nirmal: నిర్మల్ లో ఉద్రిక్తత.. ఇథనాల్ పరిశ్రమకు వ్యతిరేకంగా స్థానికులు ఆందోళన..
తాజావార్తలు
-
Srilanka Cricketలో కలకలం.. అధ్యక్షుడుతో సహా మొత్తం కమిటీ మూకుమ్మడి రాజీనామా.!
-
GPO Promotions : గ్రామ పంచాయతీ అధికారుల ప్రమోషన్లకు గ్రీన్ సిగ్నల్
-
Toxic : టాక్సిక్ డీల్.. నిర్మాతలకు ముచ్చెమటలు పట్టిస్తున్న OTTలు!
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్లో బంధువులు!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో