అసెంబ్లీ ఎన్నికలకు అధికార పార్టీ వైసీపీ సమాయత్తం అవుతుంది. సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో పార్టీలు తమ వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. ఈ క్రమంలో.. తాడేపల్లిలో వైసీపీ కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. రాష్ట్ర స్థాయి నుంచి మండల స్థాయి వరకు నాయకులతో సీఎం జగన్ కీలక సమావేశం ఏర్పాటు చేశారు. 175 నియోజకవర్గాల నుంచి 2500 మంది నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ క్రమంలో సీఎం జగన్ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు.
Read Also: Kapu Leaders: కాపులకు సీట్లు కేటాయించాలి.. కాపు ఉద్యమ జేఏసీ డిమాండ్
మరోవైపు.. ఈ సమావేశంలో బూత్ కమిటీలను బలోపేతం చేయడంపై వైసీపీ శ్రేణులకు ఐప్యాక్ టీం ప్రజెంటేషన్ ఇచ్చారు. మార్చి 15లోపు బూత్ కమిటీలను పూర్తి స్థాయిలో యాక్టివేట్ చేయాలని రూట్ మ్యాప్ ఇచ్చారు. ఇప్పటి వరకు ఉన్న కమిటీలు సోషల్ మీడియాలో ఏ విధంగా యాక్టివ్ గా ఉండాలి.. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలో, విపక్షాలు చేసే అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. ఇదిలా ఉంటే 90 శాతం వరకు వైసీపీ బూత్ కమిటీలను ఏర్పాటు చేస్తోంది. మిగిలిన వాటిని కూడా వారం రోజుల్లో చేయాలని చూస్తోంది. ఈ ఎన్నికల్లో వై నాట్ 175 లక్ష్యంగా నేతలకు సీఎం జగన్ దిశానిర్దేశం చేయనున్నారు.
Read Also: Body building: బాడీ బిల్డింగ్ కోసం ఓ యువకుడు ఏం చేశాడో తెలుసా..?