Kapu Leaders: కాపులకు సీట్లు కేటాయించాలి.. కాపు ఉద్యమ జేఏసీ డిమాండ్
విశాఖలో కాపు ఉద్యమ జేఏసీ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ పార్టీలకు చెందిన కాపు నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. విశాఖ జిల్లా కాపునాడు అధ్యక్షులు తోట రాజీవ్ మాట్లాడుతూ, కాపులకు జనాభా దామాషా ప్రకారం సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. కాపు జాతి కోసం చిత్తశుద్ధితో పోరాటం చేసామని.. ఎన్నికల సమయంలో తమ ఓట్లు మీకు కావాలి కాబట్టి తమ ఇబ్బందులు గుర్తించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం తమ సమస్యలను కోల్డ్ స్టోరేజ్ నుంచి బయటకు తీయాలని పేర్కొన్నారు. కాపు ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ముద్రగడ పద్మనాభంకు ఎవరు సముచిత స్థానం కలిపిస్తారో వారికి మద్దతిస్తామని తోట రాజీవ్ తెలిపారు.
Indian Railways: ప్రయాణికులకు రైల్వేశాఖ గుడ్న్యూస్
Also Read
- CM Chandrababu: ఏపీ చరిత్రలో ఇది మరిచిపోలేని రోజు.. గూగుల్ రాక గేమ్ ఛేంజర్..
- Ashwini Vaishnaw: విశాఖపట్నం ఇక ఏఐ పట్నం.. దక్షిణాది రాష్ట్రాలకు పూర్తి న్యాయం.. అమరావతి నుంచి త్వరలోనే బుల్లెట్ ట్రైన్..
- Minister Nara Lokesh: ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని మా విధానం.. అభివృద్ధి వికేంద్రీకరణ మా నినాదం..
- Google Data Center: విశాఖలో గూగుల్ డేటా సెంటర్కు శంకుస్థాపన
తమకు ఇచ్చిన పథకాలన్నీ కలిపి కాపులకు ఇంత ఇచ్చామని సీఎం జగన్ చెబుతున్నారని అన్నారు. అనేక కాపు భవనాలు ఇంకా పునాది దశలోనే ఉండిపోయాయని.. జిల్లాల విభజన సమయంలో కాపు నాయకులు పేర్లు పెట్టాలని కోరితే ఒక్కపేరు పెట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ప్రభుత్వాలు అయినా.. కాపుల సమస్యలపై దృష్టి పెట్టాలని అన్నారు. రాజకీయ పార్టీలు కాపుల సమస్యలను మేనిఫెస్టోలో పెట్టాలని ఆయన కోరారు.
TDP: ఉండి టీడీపీలో వర్గపోరు.. సిట్టింగ్ ఎమ్మెల్యేపై మాజీ ఎమ్మెల్యే మండిపాటు
కాపు జేఏసీ ఏ పార్టీకి అనుకూలం కాదని తోట రాజీవ్ తెలిపారు. జనాభా దామాషా ప్రకారం.. తమకు 27 శాతం సీట్లు కేటాయించాలని… ఈ పరిస్థితి ఏ పార్టీలోను లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖలో ఒక్క సీటు కాపులకు ఇవ్వలేదని మండిపడ్డారు. కాపుల సమస్యలు పోరాటం చేసిన వారికి సీట్లు ఇవ్వాలన్నారు. కాపు కులాన్ని రాజకీయ నాయకులు కరివేపాకులా చూస్తున్నారని.. 2014లో ముద్రగడ పద్మనాభం సారథ్యంలో ఉద్యమం చేసి కాపులకు 5 శాతం రిజర్వేషన్ ఇస్తూ అసెంబ్లీలో తీర్మానం చేశారని విశాఖ జిల్లా కాపునాడు అధ్యక్షులు తోట రాజీవ్ గుర్తు చేశారు.
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో