AP Crime: బయటకు పొక్కిన గుట్టు.. వదిన, మరిది ఆత్మహత్య..
- అనంతపురం జిల్లాలో వదిన.. మరిది ఆత్మహత్య
- బయటపడిన ఇద్దరి మధ్య ఉన్న వివాహేతర సంబంధం
- రెండు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయిన ఇరువురు
- చాగల్లు రిజర్వాయర్ లో దూకి ఆత్మహత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Crime: గుట్టుగా సాగుతోన్న వ్యవహారం బట్టబయలు అయ్యింది.. తలెత్తుకుని కుటుంబ సభ్యులకు ముఖం చూపించలేకపోయారు.. ఇంతకంటే తమ ప్రాణాలు విడిచిందే మంచిదనే నిర్ణయానికి వచ్చారేమో.. ఆ వదిన, మరిది.. రిజర్వాయర్లో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన అనంతపురం జిల్లా పెద్దపప్పూరు మండలం చాగల్లులో వెలుగు చూసింది.
Read Also: Kadapa Crime: తల్లితో సహజీవనం.. నిలదీసిన కొడుకు దారుణ హత్య..
Also Read
- UN Warns: ముంబై, కోల్కతా నీట మునిగే ముప్పు ఉంది.. ఐరాస హెచ్చరిక
- CM Chandrababu: 2028 నాటికి 12 ప్రాజెక్టులు పూర్తి.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
- Eknath Shinde: మోడీ అనుకుంటే ప్రపంచ పటం నుంచి పాకిస్తాన్ ఖతం.. డిప్యూటీ సీఎం వార్నింగ్..
- High Court: కొడుకు చనిపోయాక అత్తమామలకు కోడలు భరణం ఇవ్వాలా? హైకోర్టు కీలక తీర్పు
అనంతపురం జిల్లాలో జరిగిన ఆ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తాడిపత్రి మండలం గన్నేవారిపల్లి కాలనీకి చెందిన మహబూబ్ బాష, గుత్తి మండలం బేతాపల్లి గ్రామానికి చెందిన నిజామ… వదిన, మరిది అవుతారు.. అయితే, రెండు రోజుల క్రితం ఇరువురు ఇంటినుండి వెళ్లిపోయారు.. ఆదివారం సాయంత్రం చాగల్లు రిజర్వాయర్ వద్ద మోటార్ సైకిల్, అందులో మొబైల్ ఫోన్ ఉండడంతో చాగల్లు డ్యామ్ వద్ద ఉన్న స్థానికులు.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. సెల్ఫోన్ ఆధారంగా నిజామ భర్త జిలాన్ ఫిర్యాదు మేరకు.. పెద్దపప్పూరు ఎస్సై గౌస్ మహమ్మద్ మిస్సింగ్ కేసు నమోదు చేశారు. సోమవారం ఉదయం చాగల్లు రిజర్వాయర్ లో ఓ మహిళ శవం తేలడంతో.. బంధువులతో కలిసి ఎస్సై సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించి మృతి చెందిన మహిళ నిజామ అని గుర్తించారు. జిలాన్ ఆటో తోలుకుంటూ గుత్తి మండలం బేతాపల్లి గ్రామంలో జీవనం సాగిస్తున్నారు.. వారికి 16 సంవత్సరాల అమ్మాయి, 14 సంవత్సరాల అబ్బాయి ఉన్నారు. జిలాన్ కు సొంత తమ్ముడు అయిన మహబూబ్ బాష, నిజామ వివాహేతర సంబంధం కలిగి ఉన్నారని.. ఈ విషయం బహిర్గతం కావడంతో ఇద్దరు కలిసి రెండు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయారని చెబుతున్నారు.. ఇక అదే రిజర్వాయర్లో మహబూబ్ బాషా మృతదేహం లభ్యమైంది.. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
తాజావార్తలు
-
Cyberabad Constable : సోషల్ మీడియాలో పోలీస్ కామెంట్స్.. కానిస్టేబుల్పై సీపీ వేటు
-
UN Warns: ముంబై, కోల్కతా నీట మునిగే ముప్పు ఉంది.. ఐరాస హెచ్చరిక
-
CM Chandrababu: 2028 నాటికి 12 ప్రాజెక్టులు పూర్తి.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
-
Eknath Shinde: మోడీ అనుకుంటే ప్రపంచ పటం నుంచి పాకిస్తాన్ ఖతం.. డిప్యూటీ సీఎం వార్నింగ్..
-
Telangana Airports: తెలంగాణలో ఎయిర్పోర్టులకు స్పీడ్.. డిసెంబరులో బిగ్ అప్డేట్.!
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!