Kadapa Crime: తల్లితో సహజీవనం.. నిలదీసిన కొడుకు దారుణ హత్య..
- కడప జిల్లా ప్రొద్దుటూరులో దారుణం
- తన తల్లితో సహజీవనం వద్దని వారినించిన యువకుడు
- దారుణంగా హత్య చేసి పరారమైన రామచంద్రారెడ్డి అనే వ్యక్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kadapa Crime: తన తల్లితో సహజీవనం చేస్తున్న వ్యక్తిని నిలదీసినందుకు ఓ యువకుడిని దారుణంగా హత్య చేశాడో వ్యక్తి.. గుట్టుగా పదేళ్లుగా సాగుతోన్న వ్యవహారం తప్పు అని మందలించినందుకు.. ఓ మహిళ కొడును హత్య చేసి.. అక్కడి నుంచి జారుకున్నాడు రామచంద్రారెడ్డి అనే వ్యక్తి.. ఈ ఘటన కడప జిల్లాలో కలకలం రేపుతోంది..
Read Also: Deputy CM Pawan Kalyan : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను కలిసిన సినీ కార్మికులు
Also Read
- CM Chandrababu: కాగితాలు తీసుకుని కార్లో వదిలిపెట్టొద్దు, పరిష్కారం చూపండి.. కలెక్టర్లకు సీఎం ఆదేశాలు!
- Shakti Kapoor: తన మరణ వార్తలపై.. కౌంటర్ ఇచ్చిన శక్తి కపూర్
- CM Chandrababu: మంత్రుల రివ్యూకు మినహాయింపు ఉండదు.. సీఎం చంద్రబాబు వార్నింగ్!
- Weather Forecast Today: తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరిక.. రెండు రోజుల పాటు పిడుగులతో కూడిన వర్షాలు!
కడప జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ప్రొద్దుటూరు కు చెందిన నాగరత్నమ్మ.. రామచంద్రారెడ్డి ఇరువురు ఎన్నో సంవత్సరాలుగా సహజీవనం చేస్తున్నారు. అయితే, నాగరత్నమ్మకు తన మొదటి భర్తతో మహేశ్వర రెడ్డి అనే కుమారుడు ఉన్నాడు.. అతడి వయస్సు ఇప్పుడు ఇరవై ఐదేళ్లు.. నాగరత్నమ్మ భర్త నుంచి విడిపోయాక రామచంద్రా రెడ్డి పరిచయం అవ్వడంతో దాదాపు 10 సంవత్సరాలుగా నాగరత్నమ్మ, రామచంద్రా రెడ్డి సహజీవనం చేస్తున్నారు. అయితే, గత కొద్ది రోజుల నుంచి తన తల్లి నాగరత్నమ్మ ను కలవకూడదు అని రామచంద్రా రెడ్డిని హెచ్చరిస్తూ వచ్చాడు మహేశ్వర రెడ్డి.. అయినా రామచంద్రారెడ్డి పట్టించుకోలేదు. ఈ క్రమంలోనే గత రాత్రి కూడా రామచంద్రా రెడ్డి, మహేశ్వర రెడ్డి మధ్య గొడవ జరిగినట్లు నాగ రత్నమ్మ తెలిపింది. తెల్లవారి చూసేసరికి తన కొడుకు రూమ్ నిండా, బెడ్ పైన రక్తపు మరకలు ఉండడంతో.. షాక్ తిన్న ఆమె.. ఏమైంది..? నా కొడుకు ఎక్కడ అని నిలదీసింది.. కానీ, రామచంద్రరెడ్డి సమాధానం చెప్పకుండా వెళ్లిపోయాడు అని మృతుడు తల్లి నాగ రత్నమ్మ కన్నీరుపెట్టుకుంది.. ఇక, ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. నాగరత్నమ్మ ఇంటిని పరిశీలించి డాగ్ స్వాడ్ ను రప్పించారు. రామచంద్రా రెడ్డి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
తాజావార్తలు
-
Top Stocks: ఒక షేరు ధర రూ.1 లక్ష కంటే ఎక్కువ.. దేశంలోని 5 అత్యంత ఖరీదైన స్టాక్లు ఇవే!
-
Simran: బాలీవుడ్ చీకటి కోణాలను బయటపెట్టిన సిమ్రాన్..
-
CM Chandrababu: కాగితాలు తీసుకుని కార్లో వదిలిపెట్టొద్దు, పరిష్కారం చూపండి.. కలెక్టర్లకు సీఎం ఆదేశాలు!
-
SIP: రూ.2000 SIPతో కోటీశ్వరులు కావాలంటే.. ఎన్నేళ్లు పెట్టుబడి పెట్టాలో తెలుసుకోండి!
-
RCB IPL 2026 Playoffs: ఆర్సీబీకి భారీ షాక్.. ప్లేఆఫ్స్ రేసులో కొత్త టెన్షన్!