Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
- హుండీలో బయటపడిన వింత కోరిక
- స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు
- దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rs 20 Note Viral in Anantapur: అనంతపురం జిల్లాలోని ఓ దేవాలయంలో హుండీ లెక్కింపు సమయంలో వెలుగుచూసిన ఘటన భక్తులను ఆశ్చర్యానికి గురిచేసింది. సాధారణంగా భక్తులు ఆరోగ్యం, ఉద్యోగం, విద్య, ఆర్థికాభివృద్ధి వంటి కోరికలను దేవుడికి మొక్కుకుంటారు. అయితే ఓ మహిళ మాత్రం తన అత్త వేధింపుల నుంచి విముక్తి కల్పించాలంటూ.. దేవుడికి చేసిన వినతి అందరినీ విస్మయానికి గురిచేసింది. ఇందుకు సంబంధించిన 20 రూపాయల నోట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.
అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలంలోని ప్రసిద్ధ పంపనూరు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో అధికారులు గురువారం (జూన్ 18) హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు సమర్పించిన నగదు, కానుకలను పరిశీలిస్తుండగా.. ఓ రూ.20 నోటుపై రాసిన సందేశం అధికారుల దృష్టికి వచ్చింది. ఆ నోటుపై ‘స్వామీ.. మా అత్త వేధింపులు తట్టుకోలేకపోతున్నాను. ఆమె త్వరగా చనిపోయేలా చూడు’ అని చేతిరాతతో రాసి ఉంది. ఇది చూసి ఆలయ సిబ్బంది, అధికారులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఇంగ్లీషులో రాసున్న మరో నోటు కూడా ఉంది.
Also Read
- Kodali Nani: మాజీ మంత్రి కొడాలి నాని ప్రాసిక్యూషన్కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్!
- Gudivada Amarnath: 1-2 కేసులు ఉంటే మనిషిని చంపేస్తారా?.. ప్రజలు భయపడిపోతున్నారు!
- Grain Storage Silos: తెలంగాణలో ధాన్యం నిల్వకు అత్యాధునిక సైలోలు.. రూ.4,450 కోట్లతో భారీ ప్రణాళిక.!
- FIFA World Cup 2026: చరిత్ర సృష్టించిన కెనడా.. 'జొనాథన్ డేవిడ్' హ్యాట్రిక్ గోల్స్.! ఖతార్పై 6-0 భారీ విజయం.!
ఈ వినతి సోషల్ మీడియాలో కూడా చర్చనీయాంశంగా మారింది. కుటుంబ కలహాలు, అత్తా-కోడళ్ల మధ్య విభేదాలు ఎంత తీవ్ర స్థాయికి చేరుకుంటే.. ఇలాంటి కోరికను దేవుడి ముందుంచుతారో అంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. మరికొందరు దీనిని సరదాగా తీసుకుంటుండగా.. ఇంకొందరు కుటుంబ సమస్యల తీవ్రతకు ఇది నిదర్శనమని అభిప్రాయపడుతున్నారు. దేవాలయ హుండీల్లో భక్తులు తమ కోరికలను కాగితాలపై రాసి వేయడం కొత్త విషయం కాదు. అయితే ఒకరి మరణాన్ని కోరుతూ నోటుపై నేరుగా వినతి రాయడం మాత్రం చాలా అరుదైన ఘటన అనే చెప్పాలి. ఈ వింత కోరిక ప్రస్తుతం అనంతపురం జిల్లాలో హాట్ టాపిక్గా మారింది.
తాజావార్తలు
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
Kodali Nani: మాజీ మంత్రి కొడాలి నాని ప్రాసిక్యూషన్కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్!
-
SBI PO Recruitment 2026: 1500 ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులకు ఎస్బీఐ నోటిఫికేషన్.. అర్హత, వయస్సు, జీతం పూర్తి వివరాలు
-
Gudivada Amarnath: 1-2 కేసులు ఉంటే మనిషిని చంపేస్తారా?.. ప్రజలు భయపడిపోతున్నారు!
-
Grain Storage Silos: తెలంగాణలో ధాన్యం నిల్వకు అత్యాధునిక సైలోలు.. రూ.4,450 కోట్లతో భారీ ప్రణాళిక.!
ట్రెండింగ్
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!
-
Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
-
144Hz రిఫ్రెష్ రేట్తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Tilak Varma-Siraj: తెలుగు ప్లేయర్స్ సిరాజ్, తిలక్కు లీగల్ నోటీసులు.. ఇద్దరు టాలీవుడ్ హీరోస్కు కూడా!
-
Smriti Mandhana: క్రికెట్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా స్మృతి మంధాన.. పురుష క్రికెటర్లకు కూడా సాధ్యం కాని రేర్ రికార్డు!