Smriti Mandhana: క్రికెట్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా స్మృతి మంధాన.. పురుష క్రికెటర్లకు కూడా సాధ్యం కాని రేర్ రికార్డు!
- చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన
- టీ20 క్రికెట్లోనే తొలి ప్లేయర్గా అరుదైన ఘనత
- పురుష క్రికెటర్లకు కూడా సాధ్యం కాని రేర్ రికార్డు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Smriti Mandhana 600 T20I Boundaries Record: ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో భారత మహిళల జట్టు వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. పాకిస్తాన్, నెదర్లాండ్స్ జట్లపై టీమిండియా అద్భుత విజయాలు అందుకుంది. ఈ రెండు మ్యాచ్లలో రాణించిన స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో 600 బౌండరీలను పూర్తిన తొలి ప్లేయర్గా రికార్డుల్లో నిలిచింది. టీ20 ఫార్మాట్ చరిత్రలో పురుషులు, మహిళల్లో ఈ ఘనత ఇప్పటివరకు ఎవరూ అందుకోలేదు.
600 బౌండరీలు పూర్తి:
ఈ జాబితాలో న్యూజిలాండ్ స్టార్ సుజీ బేట్స్ 521 బౌండరీలతో రెండో స్థానంలో ఉంది. శ్రీలంక కెప్టెన్ చమరి అతపట్టు 493 బౌండరీలతో మూడో స్థానంలో ఉంది. ఇక పురుషుల క్రికెటర్లలో పాకిస్థాన్ స్టార్ బాబర్ ఆజమ్ 477 బౌండరీలతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఐర్లాండ్ హిట్టర్ పాల్ స్టిర్లింగ్ 401 బౌండరీలతో రెండో స్థానంలో ఉండగా.. భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ 383 బౌండరీలతో మూడో స్థానంలో ఉన్నాడు. రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ టీ20 అంతర్జాతీయ క్రికెట్లో 361 బౌండరీలు బాదాడు. రోహిత్, క్రిస్ గేల్ లాంటి హిట్టర్లకు సాధ్యం కాని రికార్డును స్మృతి మంధాన అందుకోవడం విశేషం.
Also Read
- Hockey World Cup 2026: మహిళల హాకీ ప్రపంచకప్లో భారత్ జోరు.. దక్షిణాఫ్రికాపై 6-1 ఘన విజయం
- Rishabh Pant Record: టెస్టుల్లో 100 సిక్సర్లు.. పంత్ పేరిట ప్రపంచ రికార్డు!
- IND vs SL 1st Test: గాలె టెస్ట్లో భారత్కు షాక్.. రెండో ఇన్నింగ్స్లో 193 పరుగులకే చేతులెత్తేశారు..
- Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ అరుదైన ఘనత.. పుజారా కూడా సాధించలేని రికార్డు భయ్యో!
స్మృతి ఇన్నింగ్స్లో 11 ఫోర్లు:
లీడ్స్ వేదికగా నెదర్లాండ్స్తో జరిగిన మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 209 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్ స్మృతి మంధాన 47 బంతుల్లో 74 పరుగులు చేసి జట్టు భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించింది. ఆమె ఇన్నింగ్స్లో 11 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. ఈ మ్యాచ్లో ఆడిన ఇన్నింగ్స్తో స్మృతి టీ20 అంతర్జాతీయ క్రికెట్లో 600 బౌండరీలను పూర్తి చేసింది. ఇప్పటికే మహిళల క్రికెట్లో అత్యంత నిలకడైన బ్యాటర్లలో ఒకరిగా గుర్తింపు పొందిన స్మృతి.. ఇప్పుడు టీ20 చరిత్రలో 600 బౌండరీల మైలురాయిని చేరుకుని తన ప్రత్యేకతను మరోసారి చాటుకుంది.
భారత్ 95 పరుగుల తేడాతో విజయం:
భారత్ నిర్దేశించిన 210 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో నెదర్లాండ్స్ బ్యాటర్లు భారత బౌలర్ల ధాటికి నిలవలేకపోయారు. 114 పరుగులకే ఆలౌట్ కావడంతో భారత్ 95 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. భారత బౌలర్లలో ఎన్. శ్రీ చరణి 4 వికెట్లతో చెలరేగగా.. షెఫాలీ వర్మ 3 వికెట్లు తీసి ఆకట్టుకుంది. ఈ విజయంతో భారత్ వరుసగా రెండో గెలుపును నమోదు చేసి గ్రూప్-ఏ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది.
తాజావార్తలు
-
Bajaj Chetak Sales Surge 307 Percent: రూ.35 ఛార్జింగ్తో 153 కిలో మీటర్లు..! ఏకంగా 307 శాతం పెరిగిన అమ్మకాలు
-
CM Revanth Reddy: 22-ఏ భూములపై సీఎం కీలక సమీక్ష.. 2 రోజుల్లోనే పరిష్కారం..! దళారులను ఆశ్రయించవద్దు..
-
Story Board: ఎల్నినో సూపర్ ఎల్నినోగా విరుచుకుపడుతోందా..?
-
ChatGPT for Teens: టీనేజర్లకు చాట్జీపీటీపై కఠిన ఆంక్షలు.. ఓపెన్ఏఐ కీలక నిర్ణయం.. ఇవే కొత్త ఫీచర్లు
-
CM Vijay: మహిళా ఉద్యోగులకు రక్షా బంధన్ శుభవార్త.. మూడో బిడ్డకు ఏడాది ప్రసూతి సెలవు
ట్రెండింగ్
-
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ అరుదైన ఘనత.. పుజారా కూడా సాధించలేని రికార్డు భయ్యో!
-
మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 144Hz AMOLED డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో POVA 8 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
165Hz డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR Pad 20 Pro Paperlike Edition లాంచ్..!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 10,000mAh బ్యాటరీతో ఆగస్టు 27న రాబోతున్న Redmi Note 17 Pro Max 5G.. ఫీచర్లు ఇవే..!
-
Harry Brook-IPL: ఐపీఎల్ అంటేనే భయమేసింది.. డిప్రెషన్లోకి వెళ్లా.. ఇంగ్లండ్ స్టార్ సంచలన వ్యాఖ్యలు!