Smriti Mandhana: క్రికెట్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా స్మృతి మంధాన.. పురుష క్రికెటర్లకు కూడా సాధ్యం కాని రేర్ రికార్డు!
- చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన
- టీ20 క్రికెట్లోనే తొలి ప్లేయర్గా అరుదైన ఘనత
- పురుష క్రికెటర్లకు కూడా సాధ్యం కాని రేర్ రికార్డు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Smriti Mandhana 600 T20I Boundaries Record: ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో భారత మహిళల జట్టు వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. పాకిస్తాన్, నెదర్లాండ్స్ జట్లపై టీమిండియా అద్భుత విజయాలు అందుకుంది. ఈ రెండు మ్యాచ్లలో రాణించిన స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో 600 బౌండరీలను పూర్తిన తొలి ప్లేయర్గా రికార్డుల్లో నిలిచింది. టీ20 ఫార్మాట్ చరిత్రలో పురుషులు, మహిళల్లో ఈ ఘనత ఇప్పటివరకు ఎవరూ అందుకోలేదు.
600 బౌండరీలు పూర్తి:
ఈ జాబితాలో న్యూజిలాండ్ స్టార్ సుజీ బేట్స్ 521 బౌండరీలతో రెండో స్థానంలో ఉంది. శ్రీలంక కెప్టెన్ చమరి అతపట్టు 493 బౌండరీలతో మూడో స్థానంలో ఉంది. ఇక పురుషుల క్రికెటర్లలో పాకిస్థాన్ స్టార్ బాబర్ ఆజమ్ 477 బౌండరీలతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఐర్లాండ్ హిట్టర్ పాల్ స్టిర్లింగ్ 401 బౌండరీలతో రెండో స్థానంలో ఉండగా.. భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ 383 బౌండరీలతో మూడో స్థానంలో ఉన్నాడు. రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ టీ20 అంతర్జాతీయ క్రికెట్లో 361 బౌండరీలు బాదాడు. రోహిత్, క్రిస్ గేల్ లాంటి హిట్టర్లకు సాధ్యం కాని రికార్డును స్మృతి మంధాన అందుకోవడం విశేషం.
Also Read
- Vaibhav Sooryavanshi: 'మీ ప్రేమ ఎప్పటికీ మర్చిపోను'.. తొలి మ్యాచ్ తర్వాత వైభవ్ ఎమోషనల్ సందేశం..
- Shreyas Iyer: కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ చెత్త రికార్డు.. భారత క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి..
- Vaibhav Sooryavanshi: బౌలర్ ఎవరైతే నాకేంటి?.. ఫస్ట్ బాల్ సిక్స్ వెళ్లాల్సిందే.. దిగ్గజ బౌలర్లను వణికిస్తున్న వైభవ్..
- Axar Patel: టీ20ల్లో 'స్పెషల్ సెంచరీ'.. తొలి భారత స్పిన్నర్గా అక్షర్ పటేల్ అరుదైన రికార్డ్
స్మృతి ఇన్నింగ్స్లో 11 ఫోర్లు:
లీడ్స్ వేదికగా నెదర్లాండ్స్తో జరిగిన మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 209 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్ స్మృతి మంధాన 47 బంతుల్లో 74 పరుగులు చేసి జట్టు భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించింది. ఆమె ఇన్నింగ్స్లో 11 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. ఈ మ్యాచ్లో ఆడిన ఇన్నింగ్స్తో స్మృతి టీ20 అంతర్జాతీయ క్రికెట్లో 600 బౌండరీలను పూర్తి చేసింది. ఇప్పటికే మహిళల క్రికెట్లో అత్యంత నిలకడైన బ్యాటర్లలో ఒకరిగా గుర్తింపు పొందిన స్మృతి.. ఇప్పుడు టీ20 చరిత్రలో 600 బౌండరీల మైలురాయిని చేరుకుని తన ప్రత్యేకతను మరోసారి చాటుకుంది.
భారత్ 95 పరుగుల తేడాతో విజయం:
భారత్ నిర్దేశించిన 210 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో నెదర్లాండ్స్ బ్యాటర్లు భారత బౌలర్ల ధాటికి నిలవలేకపోయారు. 114 పరుగులకే ఆలౌట్ కావడంతో భారత్ 95 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. భారత బౌలర్లలో ఎన్. శ్రీ చరణి 4 వికెట్లతో చెలరేగగా.. షెఫాలీ వర్మ 3 వికెట్లు తీసి ఆకట్టుకుంది. ఈ విజయంతో భారత్ వరుసగా రెండో గెలుపును నమోదు చేసి గ్రూప్-ఏ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది.
తాజావార్తలు
-
Ather, Ola, TVS: ఏథర్, ఓలా, టీవీఎస్.. టచ్స్క్రీన్లతో కూడిన అత్యంత చౌకైన 5 ఎలక్ట్రిక్ స్కూటర్లు.. ధర ఎంతంటే?
-
Donald Trump: ఖమేనీ అంత్యక్రియల సీన్ చూసి ట్రంప్ మైండ్ బ్లాక్.. అసలు నిజం ఒప్పుకున్న అమెరికా బాస్!
-
Narne Nithiin: వరుస హిట్ల తర్వాత మరో క్రేజీ మూవీ.. ఇద్దరు హీరోయిన్లతో నార్నే నితిన్
-
Deewana OTT Deal: కంటెంట్పై నమ్మకం.. నిర్మాతలకు రూ.7 కోట్ల జాక్పాట్!
-
Nandamuri Mokshagna Debut: మోక్షజ్ఞ కోసం రంగంలోకి మాస్ డైరెక్టర్! బాలయ్య ప్లాన్ మామూలుగా లేదుగా..
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!