Kodali Nani: మాజీ మంత్రి కొడాలి నాని ప్రాసిక్యూషన్కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్!
- పంచాయతీ ఎన్నికల సమయంలో వివాదాస్పద వ్యాఖ్యలు
- ఎన్నికల సంఘం నివేదికతో కేసు నమోదు
- మంత్రిగా ఉండటంతో విచారణకు అనుమతి అవసరం
- హోంశాఖ నుంచి అధికారిక అనుమతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కొడాలి నానిపై నమోదైన కేసులో ప్రాసిక్యూషన్కు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. పంచాయతీ ఎన్నికల సమయంలో అప్పటి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్, అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై కొడాలి నాని చేసిన వ్యాఖ్యల వ్యవహారంలో ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు ఇది ఎన్నికల నిబంధనల అమలులో భాగమని అధికార వర్గాలు చెబుతుండగా.. మరోవైపు రాజకీయ కక్షసాధింపులో భాగమనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.
2021లో రాష్ట్రంలో జరిగిన పంచాయతీ ఎన్నికల సమయంలో కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారం రేపాయి. అప్పటి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్తో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా ఉన్నాయని ఆరోపణలు వచ్చాయి. ఈ అంశాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం సీరియస్గా తీసుకుంది. కొడాలి నాని వ్యాఖ్యలు ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించాయని భావించిన రాష్ట్ర ఎన్నికల సంఘం సంయుక్త కార్యదర్శి.. ఆయనపై చర్యలు తీసుకోవాలని కృష్ణా జిల్లా ఎస్పీకి నివేదిక పంపించారు. ఆ నివేదిక ఆధారంగా పోలీసులు 2021లోనే స్థానిక న్యాయస్థానం అనుమతి తీసుకుని కేసు నమోదు చేశారు.
Also Read
- Gudivada Amarnath: 1-2 కేసులు ఉంటే మనిషిని చంపేస్తారా?.. ప్రజలు భయపడిపోతున్నారు!
- Grain Storage Silos: తెలంగాణలో ధాన్యం నిల్వకు అత్యాధునిక సైలోలు.. రూ.4,450 కోట్లతో భారీ ప్రణాళిక.!
- FIFA World Cup 2026: చరిత్ర సృష్టించిన కెనడా.. 'జొనాథన్ డేవిడ్' హ్యాట్రిక్ గోల్స్.! ఖతార్పై 6-0 భారీ విజయం.!
- Secunderabad: కంటోన్మెంట్లో బ్రిటిష్ పేర్లు తొలగింపు.. 21 రోడ్లు, 3 బజార్లకు వీర జవాన్లు, మహనీయుల నామకరణం!
కేసు నమోదైన సమయంలో కొడాలి నాని రాష్ట్ర మంత్రిగా కొనసాగుతున్నారు. చట్ట ప్రకారం ప్రజాప్రతినిధులు లేదా మంత్రులపై విధుల నిర్వహణకు సంబంధించిన అంశాల్లో విచారణ లేదా ప్రాసిక్యూషన్ చేపట్టాలంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. ఈ కారణంగా కేసు తదుపరి దశకు వెళ్లకుండా నిలిచిపోయింది. తాజాగా కృష్ణా జిల్లా కలెక్టర్ పంపిన నివేదికను పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వం.. కొడాలి నానిపై ప్రాసిక్యూషన్ కొనసాగించేందుకు అనుమతి మంజూరు చేసింది. ఈ మేరకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ అధికారికంగా ఆమోదం తెలిపారు. దీంతో కొడాలి నానిపై నమోదైన కేసులో న్యాయపరమైన ప్రక్రియలు మరింత వేగంగా ముందుకు సాగే అవకాశం ఏర్పడింది.
- Tags
- ap
- ap govt
- kodali nani
- Prosecution
- ycp
తాజావార్తలు
-
Kodali Nani: మాజీ మంత్రి కొడాలి నాని ప్రాసిక్యూషన్కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్!
-
SBI PO Recruitment 2026: 1500 ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులకు ఎస్బీఐ నోటిఫికేషన్.. అర్హత, వయస్సు, జీతం పూర్తి వివరాలు
-
Gudivada Amarnath: 1-2 కేసులు ఉంటే మనిషిని చంపేస్తారా?.. ప్రజలు భయపడిపోతున్నారు!
-
Grain Storage Silos: తెలంగాణలో ధాన్యం నిల్వకు అత్యాధునిక సైలోలు.. రూ.4,450 కోట్లతో భారీ ప్రణాళిక.!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!
ట్రెండింగ్
-
Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
-
144Hz రిఫ్రెష్ రేట్తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Tilak Varma-Siraj: తెలుగు ప్లేయర్స్ సిరాజ్, తిలక్కు లీగల్ నోటీసులు.. ఇద్దరు టాలీవుడ్ హీరోస్కు కూడా!
-
Smriti Mandhana: క్రికెట్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా స్మృతి మంధాన.. పురుష క్రికెటర్లకు కూడా సాధ్యం కాని రేర్ రికార్డు!
-
పార్లమెంట్కూ చేరిన FIFA World Cup జోష్.. వైకింగ్ పడవ ప్రయాణాన్ని అనుకరించిన ఎంపీలు.! వీడియో వైరల్..