Tilak Varma-Siraj: తెలుగు ప్లేయర్స్ సిరాజ్, తిలక్కు లీగల్ నోటీసులు.. ఇద్దరు టాలీవుడ్ హీరోస్కు కూడా!
- టీజీ20 లీగ్పై వివాదం
- సిరాజ్, తిలక్ వర్మకు లీగల్ నోటీసులు
- అక్రమ లీగ్కు ప్రచారం ఎందుకు?
- పేర్లు మారినా అనుమతులు లేవన్న టీసీఏ
- లీగల్ నోటీసులపై స్పందించని సెలబ్రిటీలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tilak Varma, Mohammed Siraj Gets Legal Notices Over TG20 League: తెలంగాణ క్రికెట్ వర్గాల్లో టీజీ20 లీగ్ వివాదం సంచలనంగా మారింది. భారత క్రికెట్ నియంత్రణ (బీసీసీఐ) అనుమతి లేకుండా నిర్వహించబోతున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ లీగ్కు మద్దతు ఇస్తున్నారనే కారణంతో టీమిండియాకు ఆడుతున్న తెలుగు ప్లేయర్స్, ప్రముఖ సినీ నటులకు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (టీసీఏ) లీగల్ నోటీసులు జారీ చేసింది. భారత క్రికెటర్లు మహ్మద్ సిరాజ్, తిలక్ వర్మ.. మాజీ క్రికెటర్ అంబటి రాయుడు.. హీరోలు విజయ్ దేవరకొండ, వెంకటేష్ దగ్గుబాటికి నోటీసులు జారీ అయ్యాయి. ఈ విషయాన్ని టీసీఏ జనరల్ సెక్రటరీ గురవా రెడ్డి తెలిపారు.
అక్రమ లీగ్కు ప్రచారం ఎందుకు?:
టీసీఏ ప్రధాన కార్యదర్శి గురవా రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) నిర్వహించాలనుకుంటున్న టీజీ20 లీగ్కు బీసీసీఐ నుంచి అనుమతులు లేవని ఆరోపించారు. అలాంటి లీగ్ను ప్రముఖులు ప్రచారం చేయడం సరైనది కాదని పేర్కొన్నారు. ‘టీజీ20 లీగ్ను చట్టబద్ధమైన టోర్నీగా చూపించేందుకు సెలబ్రిటీలను ఉపయోగిస్తున్నారు. ఇది వాటాదారులను, అభిమానులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం’ అని ఆయన విమర్శించారు. టీజీ20 లీగ్ గతంలో తెలంగాణ ప్రీమియర్ లీగ్ (TPL), తర్వాత టీటీఎల్ (TTL), అనంతరం టీజీ20 ప్రీమియర్ లీగ్ పేర్లతో మార్పులు చేసుకుంటూ వచ్చిందని టీసీఏ ఆరోపించింది.
Also Read
- IND vs SL 2nd Test: శ్రీలంకకు ట్రిపుల్ షాక్.. రెండో టెస్టులో కూడా టీమిండియాదే విజయం!
- India vs Pakistan: పాకిస్థాన్ను చిత్తు చేసిన భారత్.. హాకీ వరల్డ్ కప్లో టాప్-8కి దూసుకెళ్లిన టీమిండియా
- WTC Final: భారత్కు అసలైన పరీక్ష.. WTC ఫైనల్ చేరాలంటే ఇలా చేయాల్సిందే..
- India vs Sri Lanka Test: మానవ్ సుతార్ సంచలనం.. అశ్విన్, హర్భజన్ రికార్డులు బద్దలు..!
కోర్టుకు వెళ్లే అవకాశం:
రాష్ట్ర స్థాయి ఫ్రాంచైజీ లీగ్ నిర్వహించాలంటే బీసీసీఐ నిబంధనల ప్రకారం ప్రత్యేక గవర్నింగ్ కౌన్సిల్ ఉండాలని గురవా రెడ్డి అంటున్నారు. అలాగే లీగ్ ఛైర్మన్ను అసోసియేషన్ సాధారణ సభ ద్వారా ఎన్నుకోవాలని అన్నారు. అయితే టీజీ20 విషయంలో అలాంటి ప్రక్రియ ఏదీ పాటించలేదని ఆయన పేర్కొన్నారు. లీగల్ నోటీసులు పంపినప్పటికీ సంబంధిత సెలబ్రిటీలు టీజీ20 లీగ్తో తమ అనుబంధాన్ని కొనసాగిస్తే.. న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని టీసీఏ హెచ్చరించింది. ‘నోటీసులు పంపాం. అయినా సెలబ్రిటీలు ఈ లీగ్తో కొనసాగితే కోర్టులో కేసులు కూడా వేస్తాం’ అని గురవా రెడ్డి స్పష్టం చేశారు.
హెచ్సీఏపై మరో ఆరోపణ:
2021లో హైదరాబాద్ నగరానికి వెలుపల క్రికెట్ అభివృద్ధి కోసం హెచ్సీఏ, టీసీఏ కలిసి పనిచేయాలని బీసీసీఐ సూచించిందని.. అయితే ఆ ఆదేశాలను హెచ్సీఏ అమలు చేయలేదని టీసీఏ ఆరోపించింది. టీసీఏ జారీ చేసిన లీగల్ నోటీసులపై ఇప్పటివరకు విజయ్ దేవరకొండ, వెంకటేష్ దగ్గుబాటి, మహ్మద్ సిరాజ్, తిలక్ వర్మ, అంబటి రాయుడు స్పందించలేదు. టీజీ20 లీగ్ చుట్టూ నెలకొన్న ఈ వివాదం తెలంగాణ క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. బీసీసీఐ అనుమతులు, లీగ్ చట్టబద్ధత, సెలబ్రిటీల ప్రమేయం వంటి అంశాలపై రాబోయే రోజుల్లో మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Uber Expands: ఇక బైక్ ఎక్కేయ్ బాస్.. తెలంగాణలోని ఈ జిల్లాల్లోనూ ఉబర్ సేవలు..
-
Heavy Rain Alert: ఆగస్టు 24 వరకు భారీ వర్షాలు.. హిమాలయాల నుంచి మధ్య భారతం వరకు హై అలర్ట్!
-
Sowcar Janaki Health: సీనియర్ నటి ‘షావుకారు’ జానకికి తీవ్ర అస్వస్థత.. వెంటిలేటర్పై చికిత్స!
-
India-Pakistan Tensions: పాక్ హైకమిషన్ వద్ద భద్రతా బారికేడ్లు తొలగించిన భారత్.. J&K వ్యాఖ్యల వేళ కీలక పరిణామం
-
IND vs SL 2nd Test: శ్రీలంకకు ట్రిపుల్ షాక్.. రెండో టెస్టులో కూడా టీమిండియాదే విజయం!
ట్రెండింగ్
-
మళ్లీ కొత్త ఫీచర్లతో వస్తున్న Nokia 125 4G 2nd Edition ఫీచర్ ఫోన్..!
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!