Crime : అందుకు ఒప్పుకోలేదని మహిళను చున్నీతో ఉరివేసి హత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాయమాటలు చెప్పి మహిళను లొంగదీసుకోవడానికి ప్రయత్నించగా ఆమె నిరాకరించడంతో చున్నీతో ఆమెను ఉరివేసి చంపేసిన ఘటన బాచుపల్లి పియస్ పరిధిలో చోటుచేసుకుంది. నేపాల్ కు చెందిన కుమార్(22) బాచుపల్లి పియస్ పరిధి ఇందిరానగర్ లోని రుచి హోటల్ లో పనిచేస్తున్నాడు. రాత్రి కుమార్ అతని స్నేహితుడు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో పార్సిల్ తీసుకొని పక్కనే ఉన్న తన రూమ్ కి వెళ్లారు. బాలానగర్ లో నివాసం ఉండే పూజిత(45) అనే మహిళ పని నిమిత్తం ఇంద్రానగర్ కు చేరుకోగా ఆమెపై కన్నేసిన కుమార్ అతని స్నేహితుడు పూజితకు మాయమాటలు చెప్పి వారి రూమ్ కు తీసుకెళ్లారు.
Also Read : Chandrababu Naidu: చంద్రబాబుకు నిరసన సెగ.. మంత్రి సురేష్ ఫైర్
Also Read
పూజితను లొంగతీసుకోవడానికి కుమార్ అతని స్నేహితుడు ప్రయత్నించగా ఆమె నిరాకరించడంతో ఆమె మెడకు చున్నీతో ఉరి వేసి హత్యకు పాల్పడ్డారు. అనంతరం వారిద్దరూ పారిపోయారు. ఉదయం ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కు కుమార్ రాలేదని హోటల్ యజమాని కుమార్ రూమ్ కి వచ్చి చూడగా మహిళా మృతదేహం కనిపించడంతో బాచుపల్లి పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు కేసు నమోదు చేసుకొని డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం ల సహయంతో దర్యాప్తు చేస్తున్నారు. కుమార్ అతని స్నేహితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
Also Read : Peacefull Countries: ప్రపంచంలోని టాప్-10 శాంతియుత దేశాలు
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!