Chandrababu Naidu: చంద్రబాబుకు నిరసన సెగ.. మంత్రి సురేష్ ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీడీపీ అధినేత చంద్రబాబుకు నిరసన సెగ తగిలింది. చంద్రబాబు యర్రగొండపాలెం పర్యటనలో ఉండగా దళితులు నిరసనకు దిగారు. దళిత ద్రోహి చంద్రబాబు అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నల్ల బ్యాడ్జీలు, నల్ల బెలూన్లతో దళితులు నిరసనలు తెలిపారు. దళితులకు క్షమాపణ చెప్పి జిల్లాల్లో పర్యటించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. చంద్రబాబు దళిత ద్రోహి. చంద్రబాబుకు యర్రగొండపాలెంలో అడుగుపెట్టే అర్హత లేదని దళితులకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి చంద్రబాబు చేసిందేమీ లేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారని ఉద్ఘాటించారు. శాంతియుతంగా చంద్రబాబుకు నిరసన తెలుపుతున్నామని పేర్కొన్నారు.

Also Read
- Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
- Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
- Vaibhav's Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
- Vignesh Shivan : నయనతార భర్త విఘ్నేశ్ శివన్ నా ఆఫీసులో మూడేళ్లు పనిచేశాడు.. ఆ రూమర్లపై నటి సోనా షాకింగ్ కామెంట్స్!
Read Also: RJD MLA: 2019 పుల్వామా దాడి తరహాలోనే పూంచ్ దాడి.. ఆర్జేడీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
ఇదిలా ఉంటే యర్రగొండపాలెంలో చంద్రబాబు పర్యటనకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు మంత్రి సురేష్…చంద్రబాబు కాన్వాయ్ మంత్రి సురేష్ కార్యాలయం దాటే సమయంలో రాళ్లు విసిరారు ఆకతాయిలు..ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మంత్రి సురేష్ కార్యాలయం లోనే ప్రాథమిక చికిత్స అందించారు వైద్యులు..ఇరువర్గాలను కట్టడి చేసిన పోలీసులు.. కాన్వాయ్ దాటి వెళ్ళటంతో ఊపిరి పీల్చుకుంది యంత్రాంగం..యర్రగొండపాలెం క్యాంప్ కార్యాలయం దాడి ఘటనపై మంత్రి ఆదిమూలపు సురేష్ మండిపడ్డారు.
చంద్రబాబు పర్యటన సందర్భంగా శాంతియుతంగా నిరసన తెలిపాం..దళితులను కించపరిచేలా మాట్లాడిన చంద్రబాబు, లోకేష్ క్షమాపణ చెప్పాలన్నాం..కాన్వాయ్ దాటి వెళ్ళే సమయంలో ఉద్దేశ్య పూరితంగా దాడి చేశారు..చంద్రబాబు సిగ్నల్ ఇచ్చిన తర్వాతే రాళ్ల దాడి జరిగింది..చంద్రబాబు వేలు చూపించి రెచ్చగొట్టిన తర్వాతే దాడి చేశారని మంత్రి సురేష్ అన్నారు. ఘటనలో చాలా మందికి తీవ్ర గాయాలయ్యాయి..కొంతమందికి రక్తస్రావం ఎక్కువగా కావటంతో చికిత్స అందిస్తున్నాం..దళితుల మనోభావాలను కించ పరిచాలని చూస్తే ప్రాణత్యాగానికైనా సిద్దం అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
చంద్రబాబు ఏమన్నారంటే?
ఎర్రగొండపాలెంలో మంత్రి సురేష్ ఆగడాలు రోజురోజుకి పెరుగుతున్నాయి.ఎర్రగొండపాలెంలో అసైన్డ్ భూములు మంత్రి సురేష్, అతని బంధువు ఆక్రమించారు.మంత్రి ఆక్రమించిన భూములపై ట్రిబునల్ వేసి పేదలకు తిరిగి అప్పగిస్తా.ఎర్రగొండపాలెంలో తాగు నీటి సమస్య ఉంది…ప్రతి గ్రామానికీ కృష్ణా నీళ్లు తీసుకువస్తాం.రాష్ట్రంలో దళితుల్ని చంపేస్తుంటే మంత్రి సురేష్ ఎక్కడ దాక్కున్నాడు.దళితులకు న్యాయం చేసిన పార్టీ టీడీపీ. ఎరిక్షన్ బాబు రాబోయే ఎన్నికల్లో అభ్యర్థిగా ఉంటాడు.ఆదిమూలపు సురేష్ కి ఎర్రగొండపాలెంతో తిరిగి పోటీ చేసే ధైర్యం ఉందా.ఆదిమూలపు సురేష్ ని శాశ్వతంగా ఇంటికి పంపాలి.జగన్ ని వదిలించుకుంటే తప్ప రాష్ట్రానికి భవిష్యత్ లేదు.
Read Also: Satya Pal Malik: జమ్మూకాశ్మీర్ మాజీ గవర్నర్ కు సీబీఐ పిలుపు.. ఆ కేసులో సత్యపాల్ విచారణ!
తాజావార్తలు
-
Off The Record : కేటీఆర్కు సమాంతరంగా మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పై కేసీఆర్ కసరత్తు
-
Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
-
Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
-
Vaibhav’s Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
-
Vignesh Shivan : నయనతార భర్త విఘ్నేశ్ శివన్ నా ఆఫీసులో మూడేళ్లు పనిచేశాడు.. ఆ రూమర్లపై నటి సోనా షాకింగ్ కామెంట్స్!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!