Woman Kidnapped Married Boyfriend: మరో పెళ్లి చేసుకున్న ప్రియుడు.. కిడ్నాప్ చేసి తాళికట్టించుకున్న ప్రియురాలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chennai Woman Kidnapped and Married Boyfriend: తన ప్రియురాలికి ఏదైనా ఆపద ఎదురైతే తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కాపాడుకుంటాడు ప్రియుడు. ప్రేమించిన అమ్మాయికి మరొకరితో పెళ్లి నిశ్చయం అయితే.. లేచిపోయైనా సరే పెళ్లి చేసుకునేందుకు వెనకాడరు. ఇందుకు యువతులు కూడా అతీతులు ఏమీ కాదు. తాజాగా ఓ యువతి తను ప్రాణానికంటే అమితంగా ప్రేమించిన వాడు మరొకరిని పెళ్లి చేసుకోవడం భరించలేక పోయింది. ఏకంగా తన ప్రియుడిని కిడ్నాప్ చేసి.. బలవంతంగా తాళి కట్టించుకుంది. ఈ ఘటన తమిళనాడులోని చెన్నైలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి..
చెన్నై వేళచ్చేరికి చెందిన పార్తిబన్ (31) ఓ ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. గత జూలైలో ప్రియ అనే అమ్మాయిని పార్తిబన్ పెళ్లి చేసుకున్నాడు. ప్రియ కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తోంది. అయితే పార్తిబన్ పెళ్లికి మందు రాణిపేటకు చెందిన సౌందర్యను ప్రేమించాడు. చదువుకునే రోజుల్లో వీరిద్దరూ ప్రేమించుకున్నారు. ఏడేళ్ల తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు వచ్చి విడిపోయారు.
Also Read
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Abhishek Sharma: మళ్లీ రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకు అరుదైన రికార్డు..
- Asim Munir: టెహ్రాన్కు వెళ్లిన పాక్ ఆర్మీ చీఫ్ మునీర్.. శాంతి చర్చలపై సర్వత్రా ఆసక్తి
- IPL Team: కొత్త ఐపీఎల్ జట్టులో దిగ్గజాలు.. CSK, MI, RCB తట్టుకునేనా..?
పార్తిబన్ పెళ్లి విషయం తెలుసుకున్న సౌందర్య అతడిని మర్చిపోలేకపోయింది. అతన్నే వివాహం చేసుకుంటానని తన తల్లి, బంధువులతో చెప్పింది. ఇక చేసేదిలేక సౌందర్యకు ఆమె తల్లి ఉమ అండగా నిలిచింది. తల్లి ఉమ.. బంధువులు రమేష్, శివ కుమార్ల సాయంతో పార్తిబన్ను కిడ్నాప్ చేసేందుకు ప్రణాళిక వేసింది. శుక్రవారం ఎప్పటిలాగానే ఆఫీస్ వెళ్లేందుకు పార్తీబన్ కారు ఎక్కాడు. ఇంతలో ఓ ముఠా హఠాత్తుగా వచ్చి కారులో ఉన్న పార్తిబన్ను కిడ్నాప్ చేశారు. ఇది చూసిన పార్తిబన్ తల్లి కారును ఆపేందుకు ప్రయత్నించగా.. అతివేగంతో ఆమెను ఢీకొట్టి వెళ్లిపోయింది. ఇరుగుపొరుగు వారు వచ్చి ఆమెను ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు.
Also Read: Sunday Good Luck Remedies: ఆదివారం నాడు ఈ చర్యలు చేస్తే.. వ్యాపారంలో విజయం! ఊహించని డబ్బు మీ సొంతం
కిడ్నాప్ ముఠా పార్తిబన్ను నేరుగా కాంచీపురంలోని ఓ ఆలయానికి తీసుకెళ్లారు. అక్కడ సౌందర్య మెడలో బలవంతంగా తాళి కట్టించారు. విషయం తెలుసుకున్న పార్తీపన్ భార్య ప్రియ వెలాచ్చేరి పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు ఘటనా స్థలిలోని సీసీ కెమెరా ఫుటేజి ఆధారంగా నిందితులను గుర్తించారు. సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఓ ఇంట్లో పార్తిబన్ ఉన్నట్లు గుర్తించారు. ఇంట్లో ఉన్న పార్తిబన్ మాజీ ప్రియురాలు సౌందర్య, ఆమె బంధువులను పోలీసులు అరెస్ట్ చేశారు.
తాజావార్తలు
-
Bhatti Vikramarka : 3 ట్రిలియన్ల ఆర్థిక వ్వవస్థే లక్ష్యం
-
Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
-
Abhishek Sharma: మళ్లీ రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకు అరుదైన రికార్డు..
-
Asim Munir: టెహ్రాన్కు వెళ్లిన పాక్ ఆర్మీ చీఫ్ మునీర్.. శాంతి చర్చలపై సర్వత్రా ఆసక్తి
-
IPL Team: కొత్త ఐపీఎల్ జట్టులో దిగ్గజాలు.. CSK, MI, RCB తట్టుకునేనా..?
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!