NTV Telugu Site icon

Husband Murder: హైదరాబాద్‌లో హత్య.. ఊటీ ఎస్టేట్‌లో నిప్పు పెట్టిన భార్య

Hyderabad Crime

Hyderabad Crime

Husband Murder: ఈ రోజుల్లో ఆస్తికోసం ఎన్నో దారుణాలు జరుగుతున్నాయి. బంధాలు, బంధుత్వాలకు విలువ లేకుండా దారుణాలకు తెగబడుతున్నారు. జన్మనిచ్చిన వాళ్లను కూడా ఆస్తి కోసం హత్య చేసిన దాఖలాలు కూడా ఉన్నాయి. తాజాగా హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త దారుణంగా హత్యకు గురయ్యాడు. వ్యాపారవేత్త రమేశ్‌కుమార్(54) హత్యకు గురయ్యారు. ఆయనను హైదరాబాద్‌ సమీపంలో హత్య చేసి ఊటీ ఎస్టేట్‌లో ఆయన మృతదేహాన్ని తగులబెట్టారు. ఉప్పల్-భువనగిరి ప్రాంతంలో ఆయనను హత్య చేసినట్లు తెలిసింది. భార్య నిహారిక, ఆమె ప్రియుడు డాక్టర్‌ నిఖిల్ ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసుల విచారణలో తేలింది. వ్యాపారవేత్త రమేశ్‌కుమార్ మృతదేహాన్ని కర్ణాటక పరిధిలోని కొడగు కాఫీ ఎస్టేట్‌లో తగులబెట్టారు. కాఫీ తోటల్లో సగం కాలిన మృతదేహాన్ని కర్ణాటక పోలీసులు గుర్తించారు.

Read Also: Fake Baba : రిటైర్డ్ టీచర్‌ని బురిడీ కొట్టించిన దొంగ బాబాలు..

మెర్సిడెస్ బెంజ్ కార్‌లో రమేష్ మృతదేహాన్ని హైదరాబాద్ నుంచి ఊటీ దగ్గర వున్న కాఫీ ఎస్టేట్‌కు నిహారిక తీసుకెళ్లింది. 8 కోట్ల రూపాయల ఆస్తి కోసమే నిహారిక భర్తను హైదరాబాద్‌లో హత్య చేయించినట్టు కర్ణాటక పోలీసులు విచారణలో తేల్చారు. రమేష్ హత్య చేసి కాఫీ ఎస్టేట్‌లో తగుల బెట్టిన రాణా అనే నిందితుడిని హర్యానాలోని ఓ డాబా వద్ద టీ తాగుతుండగా కర్ణాటక పోలీసులు అరెస్టు చేశారు. డాక్టర్ నిఖిల్ మైరెడ్డిది ఏపీలోని‌ కడప జిల్లా కాగా.. మృతుడు రమేష్‌ది హైదరాబాద్‌ స్వస్థలం. నిహారిక యాదాద్రి జిల్లాకు చెందినవారిగా తెలిసింది. ఆస్తి కోసమే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు భార్య ఒప్పుకున్నట్లు సమాచారం.