హైదరాబాద్ నగరంలో గ్యాస్ సిలిండర్లను బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్న భారీ దందాను టాస్క్ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. పంజాగుట్టలోని ఒక శ్మశాన వాటికను అడ్డాగా చేసుకుని, అక్కడ సిలిండర్లను నిల్వ ఉంచి అక్రమంగా విక్రయిస్తున్న ముఠాపై డీసీపీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ నేతృత్వంలోని బృందం మెరుపు దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో సుమారు 414 గ్యాస్ సిలిండర్లతో పాటు అక్రమ రవాణాకు ఉపయోగిస్తున్న 11 వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు శంషాబాద్లో గ్యాస్ గోదాంను, అఫ్జల్గంజ్లో…
Hyderabad Crime: హైదరాబాద్లో రోజు రోజుకు ఆకతాయిల ఆగడాలు పెరుగుతున్నాయి. గంజాయి మత్తులో అమాయకుల పై దాడులు చేస్తున్నారు.. అడిగినంత డబ్బులు ఇవ్వకపోతే, దాడులు చేస్తున్నారు.. రౌడీషీటర్ల అనుచరులమని, తాము ఏం చేసినా అడిగేవాడు లేడంటూ ఇష్టానుసారంగా దాడులు చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. చాధర్ఘాట్లో ఇలాంటి ఘటనే జరిగింది. మరోవైపు మత్తు ఇంజక్షన్లు అమ్ముతున్న ముఠాను కూడా ఛాదర్ఘాట్ పోలీసులు కటకటాల వెనక్కి నెట్టారు. Tamil Nadu: ఉచితంగా ఫ్రిజ్.. పురుషులకు బస్ ఫ్రీ.. అన్నాడీఎంకే…
ప్రేమించమంటూ ఓ యువతి వెంటపడ్డాడు.. వినకపోవడంతో కుటుంబసభ్యులను బెదిరించాడు. ఐనా యువతి దారిలోకి రాకపోవడంతో, చివరకు ఆమెపై విచక్షణా రహితంగా దాడి చేశాడో ప్రేమోన్మాది. కొద్ది సేపటికే ఆ యువతి అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. దీంతో తన కూతురును ప్రేమించమంటూ వెంటపడ్డ యువకుడే హత్య చేశాడని యువతి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. హైదరాబాద్ చిలకలగూడలో ఈ ఘటన కలకలం సృష్టించింది. చిలకలగూడలోని శ్రీనివాస్నగర్లో కోటేశ్వర్రావు, రమాదేవి కుటుంబం నివాసం ఉంటోంది. కూరగాయల వ్యాపారం చేసే ఈ దంపతుల కూతురు…
కూకట్పల్లిలో కోటి రూపాయల లూటీ సంచలనంగా మారింది. కోటి రూపాయల నగదుతో వెళ్తున్న వ్యక్తులపై.. కారం పొడి చల్లి, కత్తులతో బెదిరించి.. నగదు దోచుకెళ్లారు దుండగులు. దోపిడి జరిగిన 7 గంటల్లోనే నిందితులను పట్టుకున్నారు పోలీసులు. కోటి రూపాయల డబ్బును సిల్లీగా కాటన్ డబ్బాలో ప్యాక్ చేసి.. బైక్పై ఎందుకు తీసుకెళ్తున్నారు..?? ఎక్కడికి తీసుకెళ్తున్నారు..? ఇచ్చిందెవరు.. ఇవ్వాల్సింది ఎవరికి..? అనే వివరాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కూకట్పల్లి మెయిన్ రోడ్డులో కోటి రూపాయల దోపిడి జరిగింది. బైక్పై…
మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో విచారణను మరింత వేగవంతం చేస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసు వెనుక ఉన్న మూలాలను, అంతరాష్ట్ర నెట్వర్క్ను ఛేదించేందుకు ప్రభుత్వం ప్రత్యేక విచారణ బృందాన్ని (SIT) ఏర్పాటు చేసింది. ఈ సిట్కు చీఫ్గా చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్ను నియమించగా, ఈ బృందంలో గ్రేహౌండ్స్ కమాండర్ ఎం. రవీందర్ రెడ్డి, షాద్నగర్ డీసీపీ శిరీష, ఈగిల్ ఫోర్స్ అధికారులు సి. హరీష్ చంద్ర రెడ్డి, ఎన్.…
బంధువే కదా ఆశ్రయమిస్తే రాబంధువుగా మారింది. ఇంట్లో చోటిచ్చిన పాపానికి బంగారు నగలు, డబ్బు అంతా ఊడ్చుకెళ్లింది. ఆ కిలాడీ లేడీ అంతర్గతంగా వేసిన స్కెచ్ గుర్తు పట్టని ఆ దంపతులు.. సొమ్ము పోయిన తర్వాత లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు. సీన్ కట్ చేస్తే జస్ట్ 24 గంటల్లోనే కిలాడీ లేడీని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్లో ఇదే జరిగింది. బీహెచ్ఈఎల్ కాలనీ పరిధిలోని ఆదర్శనగర్లో పురోహితులైన యర్రవల్లి మణికంఠశర్మ, హేమబిందు దంపతుల ఇంటికి వచ్చింది ఓ…
హైదరాబాద్లో నేపాలీ గ్యాంగ్ మరోసారి రెచ్చిపోయింది. జస్ట్ ఇంట్లో పని మనుషులుగా చేరడం.. కరెక్ట్గా రెక్కీ చేయడం.. ఆ తర్వాత ప్లాన్ పక్కాగా అమలు చేసి ఉన్నదంతా ఊడ్చుకెళ్లడం నేపాలీ గ్యాంగ్ స్టైల్. తాజాగా మరోసారి జూబ్లీహిల్స్లో పని చేసిన ఇంటికే కన్నం వేసింది నేపాలీ గ్యాంగ్. ఏకంగా 2 కోట్ల రూపాయల వరకు ఆభరణాలు దోచుకుని పరారయ్యారు. పొట్ట చేత పట్టుకుని నేపాల్ నుంచి వచ్చాం.. పని ఇవ్వమని అడిగితే పని మనుషులుగా చేర్చుకున్నందుకు ఆ…
హైదరాబాద్ సిటీలో గంజాయి గ్యాంగ్ అరాచకాలకు హద్దే లేకుండా పోతోంది. తాజాగా గంజాయి బ్యాచ్ చేసిన దాడిలో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన మైలార్దేవ్పల్లిలో జరిగింది. గంజాయి రాస్కెల్స్.. స్థానికులపైకి ఇనుప రాడ్లు, కత్తులతో దాడికి పాల్పడ్డట్లు తెలుస్తోంది. తాజాగా గంజాయి బ్యాచ్ చేసిన అరాచకం మరొకటి వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ మైలార్దేవ్పల్లి శాస్త్రిపురంలో గంజాయి బ్యాచ్ చేసిన దాడిలో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.. శాస్త్రిపురంలో మహ్మద్ ఖదీర్, మహ్మద్ ఖలీల్, మహ్మద్…
హైదరాబాద్లో పెళ్లి పేరుతో జరుగుతున్న మోసాలు ఆందోళన కలిగిస్తున్నాయి. కేవలం ప్రేమ పేరుతోనే కాదు, పెద్దలు కుదిర్చిన సంబంధాల మాటున కూడా కొందరు నయవంచకులు యువతులను మోసం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలపై ఇటీవల హైదరాబాద్ షీ టీమ్స్కు ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయి. ముందుగా సంప్రదాయబద్ధంగా పెళ్లి చూపులు, ఆపై ఎంగేజ్మెంట్ జరిపించుకుంటున్నారు కేటుగాళ్లు. పెళ్లి ఖాయమైంది కదా అనే చనువుతో యువతులు వారికి దగ్గరవుతున్నారు. ఎలాగూ పెళ్లే కదా.. ఎప్పుడైతే ఏంటి? అని మాయమాటలు చెప్పి, ఎమోషనల్…
Hyderabad Crime: హైదరాబాద్ శివార్లలోని నార్సింగి ప్రాంతంలో అదృశ్యమైన మైనర్ బాలిక కేసు సంచలన మలుపు తిరిగింది. మూడు రోజుల క్రితం పుప్పాలగూడా పాషా కాలనీలోని తన ఇంటి నుంచి బయటకు వెళ్లిన బాలిక తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. తమ కూతురు కనిపించడం లేదంటూ వారు నార్సింగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చర్యలు ప్రారంభించారు. దర్యాప్తు కొనసాగుతున్న క్రమంలో బాలిక అదృశ్యం…