IPL 2023 : క్రికెట్ అభిమానులకు డబుల్ మజా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2023లో భాగంగా ఇవాళ రెండు మ్యాచ్ లు జరుగనున్నాయి. తొలుతా పంజాబ్ కింగ్స్-కోల్ కతా నైట్ రైడర్స్ తో తలపడనుండగా.. మధ్యాహ్నం 3.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. అనంతరం లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు పోటీపడనున్నాయి. ఈ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది. కాగా శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ గెలిచింది.

Also Read
Also Read : Vikram Reddy : వైసీపీ వీడుతున్నట్లు ప్రచారం.. క్లారిటీ ఇచ్చిన ఆత్మకూరు ఎమ్మెల్యే
ఐపీఎల్ 2023లో భాగంగా నేడు పంజాబ్ కింగ్స్, కోల్ కతా నైట్ రైడర్స్ జట్లు తలపడనున్నాయి. మొహాలీలో ఇరు జట్ల మధ్య మ్యాచ్ జరుగనుంది. గత సీజన్ లో కేకేఆర్ టీమ్ ప్రదర్శన చాలా కష్టంగా ఉంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022లో కోల్ కతా జట్టు ఏడవ స్థానంలో నిలిచింది. కేకేఆర్ జట్టు గణాంకాలను పరిశీలిస్తే.. గత నాలుగేళ్లలో మూడుసార్లు ప్లేఆఫ్ కు అర్హత సాధించలేకపోయింది. కానీ ఈసారి జట్టు బ్యాటింగ్ తో ప్రారంభించాలనుకుంటుంది.
Also Read : Atrocious News: బిడ్డ తెల్లగా ఉన్నాడని.. కన్న కొడుకునే గోడకేసి కొట్టిచంపిన తండ్రి
అయితే ఈసారి కోల్ కతా నైట్ రైడర్స్ కు నితీష్ రాణా కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. శ్రేయాస్ అయ్యర్ స్థానంలో జట్టకు సారథిగా ఎంపికయ్యాడు. జట్టు బ్యాటింగ్ లో వెంకటేశ్ అయ్యర్, నితీష్ రాణా, ఆండ్రీ రస్సెల్ ఉండగా.. బౌలింగ్ లో సునీల్ నరైన్, లాకీ ఫెర్గూసన్, ఉమెష్ యాదవ్ వంటి బౌలర్లు ఉన్నారు. ఈ ఆటగాళ్లందరూ మ్యాచ్ విన్నర్ల విభాగంలోకి వస్తారు. మొహాలీలోని పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ ఐఎస్ బింద్రా స్టేడియంలో పంజాబ్ కింగ్స్, కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య ఈ మ్యాచ్ జరుగనుంది. ఈ రెండ్లు జట్ల మధ్య ఇప్పటి వరకు మొత్తం 30 మ్యాచ్ లు జరిగాయి. ఇందులో కోల్ కతా నైట్ రైడర్స్ 20 మ్యాచ్ ల్లో విజయం సాధించగా.. పంజాబ్ 10 మ్యాచ్ ల్లో మాత్రమే గెలిచింది. అయితే ఈసారి పంజాబ్ పై కోల్ కతా జట్టు మెరుగైన రికార్డును నిలబెట్టుకోవడం కాస్త కష్టంగానే కనిపిస్తోంది.
Also Read : Tirumala temple: నడిచి వెళ్లే భక్తులకు గమనిక.. నేటి నుంచి దివ్య దర్శనం టోకెన్ల జారీ
రెండు జట్లను చూసిన..కోల్ కతా కంటే పంజాబ్ జట్టు పటిష్టంగానే కనిపిస్తాంది. పంజాబ్ కింగ్స్ లో బౌలర్లు, బ్యాట్స్ మెన్, ఆల్ రౌండర్లతో జట్టు సమతుల్యంగా ఉంది. మరోవైపు కోల్ కతా జట్టు ఈసారి కూడా కరేబియన్ జంట ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్ లపైనే ఎక్కువగా ఆధారపడనుంది. పంజాబ్ కింగ్స్, కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య ఈ మ్యాచ్ కూడా పంజాబ్ జట్టుకు హామ్ గ్రౌండ్ అయిన మొహాలీలో జరుగనుంది. పంజాబ్ జట్టు గత కొన్ని రోజులుగా ఇక్కడే నిరంతరం ప్రాక్టీస్ చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో పంజాబ్ ను సొంత గడ్డపై ఓడించడం కోల్ కతా టీమ్ కు పెద్ద సవాల్ గా మారనుంది.
తాజావార్తలు
-
Paper Leaks: పంజాబ్లో పేపర్ లీక్.. చిక్కుల్లో ఆమ్ ఆద్మీ పార్టీ..
-
CM Revanth Reddy vs KTR : సీఎం రేవంత్ రెడ్డి, కేటీఆర్ మధ్య సవాళ్లు.. మాటల తూటాలు.!
-
CJI Protest: నిరసనకారులకు ఢిల్లీ పోలీసులు బిగ్ షాక్.. అలా చేస్తే పాస్పోర్టులు రద్దు!
-
Whisky Business: విస్కీ కిక్కు మామూలుగా లేదు.. మూడు నెలల్లోనే రూ.391 కోట్ల లాభం!
-
Shikhar Dhawan: కాక్రోచ్ ఉద్యమంపై శిఖర్ ధావన్ పోస్ట్.. సోషల్ మీడియాలో ట్రోలింగ్..
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?