Vikram Reddy : వైసీపీ వీడుతున్నట్లు ప్రచారం.. క్లారిటీ ఇచ్చిన ఆత్మకూరు ఎమ్మెల్యే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నెల్లూరు జిల్లా రాజకీయాలు ఆసక్తి రేపుతున్నాయి. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు టీడీపీకి ఓటేశారు. ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి క్రాస్ ఓటింగ్ చేసినట్లు వైసీపీ ఆరోపించింది. కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నట్లు టీడీపీ ప్రచారం చేసింది. ఈ క్రమంలో నెల్లూరు జిల్లాకు చెందిన ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి పార్టీ మారతున్నట్లు ప్రచారం జరిగింది. ఈ క్రమంలో ఆయన స్పందించారు.
Also Read: Mallu Bhatti Vikramarka: లిక్కర్ స్కాం పై భట్టి విక్రమార్క హాట్ కామెంట్స్
Also Read
- IMD Alert: దేశవ్యాప్తంగా భారీ వర్షాల హెచ్చరిక.. 3 రాష్ట్రాలకు రెడ్ అలర్ట్
- Pralhad Joshi: ధర్మేంద్ర ప్రధాన్ వారసుడిగా ప్రహ్లాద్ జోషి.. కొత్త విద్యాశాఖ మంత్రిగా నియామకం
- Indai: దేశ చరిత్రలో రాజీనామాలు చేసిన కేంద్రమంత్రులు ఎవరంటే..!
- Dharmendra Pradhan: సోషల్ మీడియా ఖాతాల్లో మార్పు.. కేంద్రమంత్రి హోదా తొలగింపు
ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్రెడ్డి మాట్లాడుతూ ఇలాంటి పుకార్లను తాను పట్టించుకోనని, వైఎస్ జగన్మోహన్రెడ్డితోనే తన ప్రయాణం అని స్పష్టం చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలోని అన్ని స్థానాలను వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. జగన్మోహన్రెడ్డితో తమ కుటుంబానికి చాలా కాలంగా అనుబంధం ఉందని, తన తండ్రి మేకపాటి రాజమోహన్రెడ్డి జగన్ కు మద్దతుగా రెండుసార్లు ఎంపీ సీటుకు కూడా రాజీనామా చేశారని విక్రమ్రెడ్డి గుర్తు చేశారు. మా అన్న గౌతమ్ అకాల మరణం తర్వాత కూడా ఆయన (జగన్) మమ్మల్ని పిలిచి ఆ సీటు ఇచ్చారని చెప్పారు. ఏ సహాయం కావాలన్నా తాను ముందుగా జగన్ అన్ననే సంప్రదిస్తాను అని విక్రమ్ రెడ్డి ఇంటర్వ్యూలో చెప్పారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్కు పాల్పడ్డారనే ఆరోపణలపై సస్పెన్షన్కు గురైన మేకపాటి చంద్రశేఖర్రెడ్డి వైఎస్సార్సీపీని వీడితే తన అసలు సత్తా ఏంటో తెలుస్తుందని ఆయన అన్నారు. పార్టీని ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామని విక్రమ్ రెడ్డి స్పష్టం చేశారు.
Also Read:Pakistan : కరాచీలో తొక్కిసలాట.. 12 మంది మృతి
ఇటీవల ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి అనుకూలంగా ఓటు వేసినందుకు నలుగురు ఎమ్మెల్యేలు ఆనం రాంనారాయణరెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలను వైఎస్సార్సీపీ సస్పెండ్ చేసింది. వీరిలో ముగ్గురు నెల్లూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలే కావడం గమనార్హం.
తాజావార్తలు
-
OTR : రాజ్యసభ ఎంపీ గొల్ల బాబూరావు అసంతృప్తి? వైసీపీలో ప్రాధాన్యం లేదంటూ ఫీల్!
-
IMD Alert: దేశవ్యాప్తంగా భారీ వర్షాల హెచ్చరిక.. 3 రాష్ట్రాలకు రెడ్ అలర్ట్
-
CM Revanth Reddy : జెన్-జీ గెలిచింది.. మోడీ తలవంచారన్న రేవంత్!
-
OTR: కోమటిరెడ్డి బ్రదర్స్ కు తుంగతుర్తి ఎమ్మెల్యే సీరియస్ వార్నింగ్..! అసలు ఏం జరిగింది ?
-
OTR: జనగామ కాంగ్రెస్లో వర్గపోరు.. డీసీసీ vs నియోజకవర్గ ఇంచార్జ్ వార్!
ట్రెండింగ్
-
Parents Alert: రోజూ ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నారా? పిల్లల్లో ఈ ప్రమాదం 52% పెరుగుతుందట.!
-
Easy Wall Cleaning Tips: గోడలపై మరకలా? ఖరీదైన క్లీనర్లు వద్దు.. ఇంట్లో ఉన్నవే చాలు.!
-
Smart Money Rules: జీవితాన్ని మార్చే స్మార్ట్ ‘మనీ రూల్స్’.! ఆర్థికంగా బలపడాలంటే తప్పక తెలుసుకోవాల్సిన సూత్రాలు ఇవే..
-
12.1 అంగుళాల 2.5K డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో రానున్న Moto Pad 70.!
-
3.2 అంగుళాల టచ్స్క్రీన్, Doubao AIతో HMD Touch AI ఫీచర్ ఫోన్ లాంచ్.!