IPL 2025 Mega Auction: ఐపీఎల్ మెగా వేలంపై బిగ్ అప్డేట్.. ఎప్పుడు, ఎక్కడంటే..?
- ఐపీఎల్ (IPL 2025) మెగా వేలం ఎప్పుడు.. ఎక్కడ జరుగుతుందనే దానిపై తీవ్ర ఆసక్తి
- ఇప్పటికే ఫ్రాంఛైజీలు ఆటగాళ్ల రిటెన్షన్.. రిలీజ్
- మెగా వేలం ఎప్పుడు జరుతుందనే దానిపై క్రికెట్ అభిమానుల్లో ఉత్కంఠ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ (IPL 2025) మెగా వేలం ఎప్పుడు, ఎక్కడ జరుగుతుందనే దానిపై క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఫ్రాంఛైజీలు ఆటగాళ్లను రిటెన్షన్, రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.. ఇక ఉన్నదంతా మెగా వేలం ఎప్పుడు జరుతుందనేది. మెగా వేలంలో ఫ్రాంఛైజీలు ఏ ఏ ఆటగాళ్లను తీసుకుంటారు… ఏఏ ఆటగాళ్లు ఏ జట్టుకు వెళ్తారనేది క్రికెట్ అభిమానుల్లో సస్పెన్స్ నెలకొంది. అయితే.. ఐపీఎల్ 2025 మెగా వేలంకు సంబంధించి బిగ్ అప్ డేట్ వచ్చింది. ఆక్షన్ నిర్వహించే తేదీ, వేదిక గురించి కొన్ని వార్తలు వస్తున్నాయి. ANI ప్రకారం.. ఐపీఎల్ 2025 మెగా వేలం నవంబర్ చివరిలో రియాద్లో జరుగనున్నట్లు తెలుస్తోంది. నవంబర్ 24, 25 తేదీల్లో మెగా వేలం జరుగునున్నట్లు సమాచారం.
Lebanon-Israel War: హిజ్బుల్లా కమాండర్ అబూ అలీ సహా ఇద్దరు హమాస్ నేతలు హతం
Also Read
- Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
- Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
- Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ 'ఎ' ట్రై-సిరీస్ పోరు..
- Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
కాగా.. ఐపీఎల్ 2025 మెగా వేలంలో పంజాబ్ కింగ్స్ జట్టు దగ్గర ఎక్కువ మనీ ఉంది. ఆ జట్టు వేలానికి ముందు ఇద్దరు అన్క్యాప్డ్ ఆటగాళ్లు ప్రభ్సిమ్రాన్ సింగ్, శశాంక్ సింగ్లను మాత్రమే జట్టులో ఉంచుకుంది. ఈ క్రమంలో పంజాబ్ కింగ్స్ అధిక మొత్తంలో డబ్బును ఖర్చు చేయనుంది. ఇదిలా ఉంటే.. జోస్ బట్లర్, కెఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, గ్లెన్ మాక్స్వెల్, రిషబ్ పంత్ వంటి కీలక ఆటగాళ్లు వేలంలో అదృష్టాన్ని పరిక్షించుకోనున్నారు. ఈ క్రమంలో.. అన్ని ఫ్రాంచైజీలు వీరి కోసం భారీ మొత్తాన్ని వెచ్చించేందుకు సిద్ధమవుతున్నాయి.
Supreme Court: నిషేధం ఉన్నప్పటికీ పటాకులు ఎలా కాల్చారు.. ఢిల్లీ ప్రభుత్వానికి కోర్టు చివాట్లు
ఐపీఎల్ 2025లో 5 జట్లు కొత్త కెప్టెన్ కోసం వెతుకుతున్నాయి. ఇందులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు ఉన్నాయి. ఐపీఎల్ 2025 మెగా వేలంలో రిటైన్ చేయబడిన 46 మంది ఆటగాళ్లలో 36 మంది భారతీయులు, 10 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. వీరికి రూ.558.5 కోట్ల భారీ మొత్తం వెచ్చించారు. అత్యధిక మొత్తంతో అట్టిపెట్టుకున్న ఆటగాళ్ల జాబితాలో హెన్రిచ్ క్లాసెన్, విరాట్ కోహ్లీ టాప్-2లో ఉన్నారు. క్లాసెన్ను సన్రైజర్స్ హైదరాబాద్ రూ.23 కోట్లకు, విరాట్ కోహ్లీని రూ.21 కోట్లకు ఆర్సీబీ అట్టిపెట్టుకుంది.
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!