What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- గుంటూరులో పర్యటించనున్న డిప్యూటీ సీఎం పవన్
- మహబూబ్నగర్ జిల్లాలో పర్యటించనున్న సీఎం రేవంత్
- దక్షిణాఫ్రికాతో రెండో టీ20 నేడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేడు గుంటూరులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు పవన్ గుంటూరు చేరుకోనున్నారు. నగరం పాలెంలోని అరణ్య భవన్లో అటవీ అమరవీరుల సంస్మరణ సభలో డిప్యూటీ సీఎం పాల్గొననున్నారు.
నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టూరిజం సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 8 గంటలకు రాజమహేంద్రవరం జేఎన్ రోడ్ నందు APMSA స్విమ్మింగ్ కాంపిటీషన్స్ కార్యక్రమంలో పాల్గొననున్నారు. రాత్రి వరకు పలు కార్యక్రమాలలో మంత్రి కందుల దుర్గేష్ పాల్గొంటారు.
Also Read
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి మహబూబ్నగర్ జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు సీఎం హైదరాబాద్ నుంచి బయలుదేరి.. మధ్యాహ్నం 12 గంటలకు మహబూబ్నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం అమ్మాపురంలోని కురుమూర్తి స్వామి దేవాలయానికి చేరుకుంటారు. కురుమూర్తి స్వామి దేవాలయానికి సమీపంలో ఘాట్ రోడ్, ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం శ్రీ కురుమూర్తి స్వామి దర్శనం చేసుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
నేడు హన్మకొండకు దక్షిణమధ్య రైల్వే అదనపు జనరల్ మేనేజర్ నీరజ్ అగర్వాల్ రానున్నారు. కాజీపేట రైల్వే స్టేషన్ను ఆయన సందర్శించనున్నారు.
నేడు హన్మకొండ జిల్లాలో మాజీ మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. రాంపూర్ సమీపంలో పెళ్లికి హాజరు కానున్నారు. అనంతరం హన్మకొండ జిల్లా పార్టీ కార్యాలయంలో బీఆర్ఏస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు.
నేడు నాంపల్లిలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పర్యటించనున్నారు. మల్లేపల్లి, అసిఫ్ నగర్ డివిజన్లలో కమ్యూనిటీ హాల్లు ప్రారంభిస్తారు.
నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. రాగల 36 గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం అల్పపీడనం తమిళనాడు, శ్రీలంక వైపు కదులుతోంది. నవంబర్ 12, 13, 14 తేదీల్లో రాయలసీమ, దక్షిణ కోస్తాలో ఓ మోస్తరు వర్షాలు పడనున్నాయి.
దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ను ఘన విజయంతో ఆరంభించిన భారత్.. మరో విజయంపై కన్నేసింది. నాలుగు మ్యాచ్ల సిరీస్లో భాగంగా నేడు రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. గెబేహా వేదికగా రాత్రి 7.30 నుంచి మ్యాచ్ ఆరంభం కానుంది.
తాజావార్తలు
-
Oppo A7 Pro Max: ఒప్పో A7 ప్రో మాక్స్ రిలీజ్.. 10000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Vaddi Kasula Vaadu: మంచు మనోజ్ ‘వడ్డీ కాసుల వాడ’లో అదిరే సర్ప్రైజ్… వెంకటేశ్వర స్వామిగా జయం రవి
-
India Flagged Cargo Ship Attack: యెమెన్ తీరంలో భారత కార్గో నౌకపై దాడి.. ఘటన సమయంలో 14 మంది సిబ్బంది..!
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!