Super Six Super Hit: ‘సూపర్ సిక్స్ – సూపర్ హిట్’ సభ.. అసలు ఉద్దేశం అదేనా..?
- అనంతపురంలో సూపర్ సిక్స్-సూపర్ హిట్ భారీ బహిరంగసభ..
- కూటమి లో ఐక్యత పూర్తి స్థాయిలో ఉందని చెప్పడం కోసమే సభ పెట్టారా..?..
- కూటమిలో సఖ్యత కింద స్థాయి వరకు ఉండాలనే సంకేతాలు ఇచ్చారా..?.
- కూటమి ఐక్యత కొనసాగిస్తూ.. ముందుకు వెళ్లడమే ప్రధాన ఎజెండాగా సభ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Super Six Super Hit: సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనే పేరుతో కూటమి పార్టీ నేతలు కీలక సభ నిర్వహించారు… అనంతపురంలో భారీ బహిరంగ సభ ఏర్పాటులో మూడు పార్టీలు నేతలు పాల్గొన్నారు.. కూటమిలో ఐక్యత ఉంది అని చెప్పేందుకు ఈ సభ ఏర్పాటు అయింది అనే అభిప్రాయాలు ప్రధానంగా వ్యక్తం అవుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారి మూడు పార్టీలు కలిసి అనంతపురంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు.. సూపర్ సిక్స్ – సూపర్ హిట్ అయిందని చెప్పడం అదేవిధంగా ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు అన్ని కూడా జనాల్లోకి తీసుకెళ్లాలని ప్రధాన ఉద్దేశంతో ఈ సభ ఏర్పాటు అయిందనే చర్చ ప్రధానంగా జరుగుతూ ఉంది… దీంతో పాటు కూటమి నేతల మధ్య ఐక్యత ఉంది మూడు పార్టీలు పూర్తి సమన్వయంతో పనిచేస్తున్నాయన్న సంకేతాలు ప్రధానంగా ఇవ్వడం కోసమే… అనంతపురం సభ జరిగింది.. అనే అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.. కూటమి నేతలు ఐక్యంగా కలిసి ముందుకు వెళ్తున్నామన్నారు సీఎం చంద్రబాబు.. అభివృద్ధి పైనే ప్రధానంగా దృష్టి పెట్టామన్నారు సీఎం చంద్రబాబు..
Read Also: Shivani Nagaram : శివానీ నగరం దెబ్బ.. ఆ ముగ్గురు భామలకు చెమటలు
Also Read
- నేటి నుంచి BRICS ట్రేడ్ యూనియన్ ఫోరం సమ్మిట్-2026.. 10 దేశాల ప్రతినిధులతో కీలక చర్చలు..!
- Virat Kohli: రాబోయే వన్డే వరల్డ్ కప్లో కోహ్లీ, రోహిత్ ఆడతారా?.. బాంబు పేల్చిన కెప్టెన్ గిల్
- Indian Railways: షాకింగ్.. 42 నరేంద్ర మోదీ స్టేడియాలు కట్టేంత రైల్వే భూమి మాయం!
- Virat Kohli: అందరి చూపు కోహ్లీ వైపే.. ఇంగ్లాండ్తో వన్డే సిరీస్లో బద్దలు కొట్టగల రికార్డులు లిస్ట్ ఇదిగో.!
మూడు పార్టీల మధ్య ఐక్యత కు సంబంధించి ఈ మధ్య కాలంలో రక రకాల అభిప్రాయలు వ్యక్తం అవుతున్నాయి.. బీజేపీ నేతలు కూటమికి సంబంధించి వ్యాఖ్యలు చేయడం… ఓట్ల శాతం తక్కువగా ఉందని చిన్నచూపు చూడద్దని వ్యాఖ్యానించడం జరిగాయి. పవన్ కల్యాణ్ కూడా చాలా సందర్భాల్లో. కూటమి 15 ఏళ్లు కలిసి ఉండాలని చెప్తూ ఉన్నారు. అదే విధంగా కింది స్థాయిలో కూటమి నేతల మధ్య ఐక్యత తగ్గిందనే అభిప్రాయం కూడా బలంగా ఉంది.. వీటికి చెక్ పెట్టడం కోసమే ప్రధానంగా అనంతపురం సభ జరిగిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.. అయితేచ అభివృద్ధి ప్రధాన ఎజెండా గా ముందుకు వెళ్తున్నామన్నారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..
Read Also: Nara Lokesh: నేపాల్లో చిక్కుకున్న తెలుగువారు.. రంగంలోకి మంత్రి లోకేష్..
త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి.. స్థానిక ఎన్నికలు అంటే కింది స్థాయి క్యాడర్ మధ్య ఐక్యత. సమన్వయం చాలా అవసరం…. వీటిని దృష్టిలో పెట్టుకుని అనంతపురం సభ లో ఒక ఇండికేషన్ ఇచ్చారు. పై స్థాయి లో నేతల మధ్య సమన్వయం ఉందని ఇదే విధంగా కింది స్థాయి లో కూడా ఐక్యత ఉండడం కోసమే ప్రధానంగా సభ జరిగింది అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి….సూపర్ సిక్స్ అమలు ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం. ప్రభుత్వ పనితీరు.ప్రభుత్వం అమలు చేస్తున్న పధకాలు కూడా వివరించింది..మొత్తానికి అభివృద్ధి ఐక్యత ప్రధానంగా సభ జరిగింది అనే అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి.
తాజావార్తలు
-
Michael Biopic: రూ.9,500 కోట్లకు పైగా వసూళ్లు.. ప్రపంచ బాక్సాఫీస్ చరిత్ర తిరగరాసిన బయోపిక్!
-
నేటి నుంచి BRICS ట్రేడ్ యూనియన్ ఫోరం సమ్మిట్-2026.. 10 దేశాల ప్రతినిధులతో కీలక చర్చలు..!
-
Virat Kohli: రాబోయే వన్డే వరల్డ్ కప్లో కోహ్లీ, రోహిత్ ఆడతారా?.. బాంబు పేల్చిన కెప్టెన్ గిల్
-
Lenin: ఫ్యాన్స్ ను ఫిదా చేయబోతున్న తమన్.. ‘లెనిన్’ సక్సెస్ ఈవెంట్ లో కొత్త సాంగ్ రిలీజ్
-
Indian Railways: షాకింగ్.. 42 నరేంద్ర మోదీ స్టేడియాలు కట్టేంత రైల్వే భూమి మాయం!
ట్రెండింగ్
-
ఓపెన్-ఇయర్ డిజైన్, AI కాలింగ్ ఫీచర్స్, 37 గంటల బ్యాటరీతో Sony LinkBuds Clip భారత్లో లాంచ్.!
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!