Nara Lokesh: నేపాల్లో చిక్కుకున్న తెలుగువారు.. రంగంలోకి మంత్రి లోకేష్..
- నేపాల్లో చిక్కుకున్న తెలుగువారు..
- సురక్షితంగా రాష్ట్రానికి తీసుకురావడానికి రంగంలోకి మంత్రి లోకేష్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nara Lokesh: నేపాల్లో చిక్కుకున్న తెలుగువారిని సురక్షితంగా రాష్ట్రానికి తీసుకురావడానికి రంగంలోకి దిగారు మంత్రి నారా లోకేష్.. అనంతపురంలో సూపర్ సిక్స్ – సూపర్ హిట్ సభకు కూడా వెళ్లకుండా.. నేపాల్ నుంచి ఏపీవారిని సురక్షితంగా రాష్ట్రానికి రప్పించడానికి అధికారులతో నిరంతరం సమన్వయం చేస్తున్నారు మంత్రి నారా లోకేష్.. కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీలోని ఏపీ భవన్, రాష్ట్రానికి చెందిన వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.. ఈ సమీక్షలో హోంమంత్రి అనిత, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.. నేపాల్ రాజధాని ఖాట్మండు విమానాశ్రయానికి సమీపంలోనే 165 మంది తెలుగువారు ఉన్నారని తెలిపారు అధికారులు. సిమిల్ కోట్ సమీపంలో మరో 12 మంది తలదాచుకున్నారని లోకేష్కి వివరించారు అధికారులు.
Read Also: Nepal: క్లియర్ మెసేజ్ ఇచ్చిన నేపాల్ ఆర్మీ చీఫ్.. ‘‘హిందూ రాజ్యం’’గా మారుతుందా..?
Also Read
- AP Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో వర్షాలు.. ఏ జిల్లాల్లో అంటే..
- Talliki Vandanam Scheme: గుడ్న్యూస్.. రూ.10,049 కోట్లు విడుదల.. 'తల్లికి వందనం'కి సొమ్ము ఖాతాల్లో పడేది ఎప్పుడంటే..?
- AP Local Body Elections: ఏపీలో ఎన్నికల సందడి.. స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధం..
- Jagan 2.0 Super App: జగన్ 2.0 సూపర్ యాప్ ఆవిష్కరణ.. పోలీసు కేసుల నుంచి పార్టీ సమావేశాల వరకు అన్నీ..
పరిస్థితులు అనుకూలించిన వెంటనే ప్రత్యేక విమానం ద్వారా వీరందరినీ దేశానికి తీసుకురావడంపై అధికారులకు దిశానిర్దేశం చేశారు మంత్రి లోకేష్. ఇందుకు కావాల్సిన అనుమతులను వివరించిన అధికారులు, కేంద్రంతో సమన్వయం చేసుకుని అవసరమైన చర్యలు చేపట్టాలని లోకేష్ ఆదేశించారు.. బాధితులతో ప్రతి రెండు గంటలకోసారి ఫోన్ లో మాట్లాడుతూ వారిలో ధైర్యం నింపుతున్నారు లోకేష్.. ఆహారం, నీరు, ఇతర సౌకర్యాలు అందుతున్నాయా అని బాధితులను వాకబు చేసిన ఆయన.. సురక్షితంగానే ఉన్నామని, అక్కడ ఉన్న పరిస్థితులను లోకేష్ కు వివరించారు నేపాల్ లో చిక్కుకున్న తెలుగువారు. ఏ సాయం కావాలన్నా ఫోన్ ద్వారా సంప్రదించాలని తెలుగువారికి సూచించారు.. రాష్ట్రానికి సురక్షితంగా తీసుకురావడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని బాధితులకు భరోసా ఇస్తున్నారు మంత్రి నారా లోకేష్..
తాజావార్తలు
-
MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
-
Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
-
IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
-
The Odyssey: ‘ది ఒడిస్సీ’ ప్రీ రివ్యూ ..
-
Amen : “గుండె జబ్బులు ఉన్నవాళ్లు థియేటర్కు రావద్దు”.. హారర్ మూవీ మేకర్స్ సంచలన హెచ్చరిక!
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!