KTR: ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం కాలేదు.. న్యాయం కోసం పోరాటం కొనసాగిస్తాం!
- ఈడీ విచారణకు కేటీఆర్
- ఫార్ములా-ఈ రేస్ కేసులో A-1గా కేటీఆర్
- కేటీఆర్ ట్వీట్ వైరల్
ఫార్ములా ఈ రేస్ కేసులో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరికొద్దిసేపట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎదుట హాజరుకానున్నారు. ఈడీ విచారణకు ఈ నెల 7న హాజరుకావాల్సి ఉన్నా.. తాను రాలేనని కేటీఆర్ చెప్పడంతో 16న విచారణకు హాజరు కావాలని ఈడీ అధికారులు మరోసారి నోటీసులు ఇచ్చారు. ఫార్ములా ఈ రేస్లో నిబంధనల ఉల్లంఘనపై ఓవైపు ఏసీబీ దర్యాప్తు చేస్తుండగా.. మరోవైపు ఆర్బీఐ అనుమతి లేకుండా విదేశీ సంస్థకు నిధుల చెల్లింపుపై ఈడీ మరో కేసు నమోదు చేసింది. ఈడీ విచారణ నేపథ్యంలో కేటీఆర్ ఓ ట్వీట్ చేశారు. ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం కాలేదని, ప్రతి రూపాయికి లెక్క ఉంటుందన్నారు. త్వరలో నిజం వెల్లడి అవుతుందని, అప్పటి వరకు న్యాయం కోసం పోరాటం కొనసాగిస్తాం అని కేటీఆర్ పేర్కొన్నారు.
Also Read: BCCI: బీసీసీఐ కఠిన ఆంక్షలు.. ఇక నుంచి వారం రోజులు మాత్రమే!
Also Read
- Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్పై రూ.25, డీజిల్పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
- Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
- Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్లో.. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
- Telangana : పోలీస్ శాఖలో భారీ పదోన్నతులు.. సజ్జనార్, మహేష్ భగవత్ లకు డీజీపీ హోదా..!
‘భారతదేశం/తెలంగాణ/హైదరాబాద్లో ఫార్ములా ఈ రేస్ హోస్ట్ చేయడం మంత్రిగా నా అత్యంత ప్రతిష్టాత్మకమైన నిర్ణయాలలో ఒకటి. అంతర్జాతీయ రేసర్లు, ఇ-మొబిలిటీ పరిశ్రమ నాయకులు మా నగరాన్ని ప్రశంసించడం గర్వించదగ్గ విషయం. పనికిమాలిన కేసులు, చౌకగా బురదజల్లడం, రాజకీయాలు చేయడం ద్వారా ఆ మంచి పనిని తొలగించలేవు. నాకు బ్రాండ్ హైదరాబాద్ అత్యంత ముఖ్యమైనది. నిన్న, నేడు, రేపు మరియు ఎల్లప్పుడూ ఫార్ములా ఈ రేస్ మన నగరాన్ని అంతర్జాతీయ క్రీడా వేదికపై నిలబెట్టింది. బ్యాంక్-టు-బ్యాంక్ లావాదేవీ ద్వారా ఫార్ములా ఈ రేస్ ఆపరేషన్స్ లిమిటెడ్ కి రూ. 46 కోట్లు చెల్లించబడింది. ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం కాలేదు, ప్రతి రూపాయికి లెక్క ఉంటుంది. ఇందులో అవినీతి, దుర్వినియోగం, మనీ లాండరింగ్ ఎక్కడ ఉంది?. ఏదైతేనేం సీఎం రేవంత్ రెడ్డి చిన్న చూపు, ఆయన ఆలోచనా రహిత, ఏకపక్ష నిర్ణయంతో ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లిన కార్యక్రమం రెండో ఏడాది రద్దు. గౌరవనీయమైన కోర్టులతో సహా అందరికీ కనిపించేలా త్వరలో నిజం వెల్లడి అవుతుందని నేను విశ్వసిస్తున్నా. అప్పటి వరకు న్యాయం కోసం పోరాటం కొనసాగిస్తాం’ అని ఎక్స్లో కేటీఆర్ రాసుకొచ్చారు.
Hosting Formula E in India/Telangana/Hyderabad remains one of my most cherished decisions as a Minister. The pride I felt, witnessing international racers & E-Mobility industry leaders praise our city, is memorable
No amount of frivolous cases, cheap mudslinging, or political…
— KTR (@KTRBRS) January 16, 2025
- Tags
- BRS
- ED
- Formula E Case
- ktr
- telangana
తాజావార్తలు
-
Off The Record : ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్ట్
-
Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్పై రూ.25, డీజిల్పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
-
Asian Games: ‘ఆసియా క్రీడల’ ప్రత్యక్ష ప్రసారం సోనీ నెట్వర్క్ చేతికి.. యాప్లో కూడా..
-
Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
-
Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్లో.. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?