మల్కాజ్గిరి కార్నర్ మీటింగ్లో బీఆర్ఎస్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ చచ్చిన పాముతో సమానం.. కారు కార్ఖానాకు పోయింది… ఇక అది వాపస్ రాదని విమర్శించారు. అందుకే కేసీఆర్ కారు వదిలి బస్సు ఎక్కారని దుయ్యబట్టారు. కేసీఆర్ బస్సు యాత్ర.. తిక్కలోడు తిరునాళ్లకు వెళ్లినట్లే ఉందని విమర్శించారు. వంద రోజుల్లోనే ఐదు గ్యారంటీలను అమలు చేసిన మమ్మల్ని కేసీఆర్ తిట్టుకుంటూ తిరుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కేసీఆర్ దివాళాకోరుతనానికి, చేతకానితనానికి నిదర్శనం అని వ్యాఖ్యానించారు.
Arvind Kejriwal: అరవింద్ కేజ్రీవాల్ని కలిసేందుకు భార్య సునీతాకు నో పర్మిషన్..
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాం.. ఆరోగ్యశ్రీ ద్వారా రూ.10లక్షల వరకు ఉచిత వైద్య సదుపాయం కల్పించాం.. రూ.500లకే గ్యాస్ సిలిండర్ అందించి ఆడబిడ్డలను ఆదుకున్నాం.. పేదలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నాం.. మూడు నెలల్లో 30 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మరోవైపు.. మల్కాజ్గిరి బీజేపీ అభ్యర్థి ఈటల కొత్తవాడేం కాదు.. కేసీఆర్ హయాంలో మంత్రిగా పనిచేసినవారేనని అన్నారు. కేసీఆర్ హయాంలో తెలంగాణలో జరిగిన దుర్మార్గాలకు ఈటల కారణం కాదా అని ప్రశ్నించారు. పంపకాలలో తేడా వచ్చి కేసీఆర్ ఈటలను బయటకు పంపారని పేర్కొన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ప్రజలకు హామీ ఇచ్చి మోసం చేశారు… అందుకే అక్కడి ప్రజలు ఆయన్ను తిరస్కరించారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
CM YS Jagan: రేపటి సీఎం జగన్ ప్రచార సభల షెడ్యూల్ ఇదే..
మల్కాజిగిరి ప్రజల సమస్యలను ఏనాడూ పట్టించుకోని ఈటల.. ఇప్పుడు వచ్చి ఓట్లు అడుగుతున్నారని దుయ్యబట్టారు. బీజేపీ, బీఆరెస్ చీకటి ఒప్పందం చేసుకున్నాయని ఆరోపించారు. మీ ఒప్పందాన్ని మేడ్చల్ ఎమ్మెల్యే బట్టబయలు చేశారని పేర్కొన్నారు. మతం ముసుగులో ఓట్లు అడగడం కాదు… దేవుడు గుడిలో ఉండాలి… భక్తి గుండెల్లో ఉండాలన్నారు. అలాంటివారే నిజమైన హిందువని తెలిపారు. ఈటల చుట్టం లాంటి వారు… వచ్చి పోవడం తప్ప చేసేదేం లేదని ఆరోపించారు. బీజేపీకి వేసే ప్రతీ ఓటు రిజర్వేషన్ల రద్దుకు వేసినట్లేనని అన్నారు. ప్రభుత్వ సంస్థలను మోదీ కార్పొరేట్ కు అప్పగిస్తున్నారు.. రైల్వే, బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు ఆలోచించాలని తెలిపారు. మోడీ ఉద్యోగం ఊడగొడితేనే మీ ఉద్యోగాలు ఉంటాయన్నారు. లోక్ సభ ఎంపికల్లో సునీత మహేందర్ రెడ్డిని లక్ష మెజారిటీతో గెలిపించాలని.. సునీతక్కను గెలిపించండి… మల్కాజిగిరిని అభివృద్ధి చేసే బాధ్యత తనది అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.