Arvind Kejriwal: అరవింద్ కేజ్రీవాల్ని కలిసేందుకు భార్య సునీతాకు నో పర్మిషన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఈడీ ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అతను తీహార్ జైలులో ఉన్నాడు. సోమవారం కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ జైలులో కలవాల్సి ఉంది. అయితే, దీనికి తీహార్ జైలు అధికారులు అనుమతి నిరాకరించినట్లు తెలుస్తోంది. అనుమతి నిరాకరించడానికి ఎలాంటి కారణాలను అధికారులు పేర్కొన లేదని ఆప్ వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉంటే ఢిల్లీ మంత్రి అతిషి రేపు మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో అరవింద్ కేజ్రీవాల్తో సమావేశం కానున్నారు.
Read Also: Hinglaj Mata festival: పాకిస్తాన్లో “హింగ్లాజ్ మాత” తీర్థయాత్ర.. లక్షలాదిగా హిందువులు హాజరు..
Also Read
- Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
- Ketan Murder Case: "ఒక్క మాట చెబితే పెళ్లి ఆపేవాళ్లం".. కూతురు ఘాతుకంపై తల్లిదండ్రుల కన్నీటిపర్యంతం!
- Muskan Pradhan: తాగొచ్చిన వరుడికి చెంపదెబ్బ.. ఇప్పుడు మహిళలకు మార్గదర్శి! కౌన్సెలర్గా నియమితురాలైన ముస్కాన్
- Operation Sindoor: ‘ఆపరేషన్ సిందూర్’ అమరవీరుల పేర్లు ఇవే.. దేశం కోసం ప్రాణాలర్పించిన ఆరుగురు వీరులు!
ఆప్ చెబుతున్న దాని ప్రకారం.. ఇద్దరికి అనుమతుల్ని ఒకేసారి మంజూరు చేశారని, అయితే వారు సునీతా కేజ్రీవాల్కి అనుమతి నిరాకరించారని చెబుతోంది. మంగళవారం పంజాబ్ సీఎం భగవత్ మాన్ కూడా కేజ్రీవాల్తో సమావేశం కానున్నారు. ఈ వరస సమావేశాల కారణంగా సునీతా కేజ్రీవాల్కి అనుమతి నిరాకరించబడిందని, ఈ సమావేశాల తర్వాత తన భర్తను కలిసేందుకు అనుమతిస్తామని తీహార్ జైలు వర్గాలు తెలిపాయి. జైలు మాన్యువల్ ప్రకారం, ఒక ఖైదీని ఒకేసారి ఇద్దరు వ్యక్తులు మరియు వారంలో గరిష్టంగా నలుగురు కలవవచ్చు.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మార్చి 21న ఢిల్లీలోని అధికార నివాసంలో కేజ్రీవాల్ని ఈడీ అరెస్ట్ చేసింది. ఈ కుంభకోణంలో కేజ్రీవాల్ కీలక సూత్రధారిగా ఈడీ పేర్కొంది. మద్యం వ్యాపారుల నుంచి డబ్బులు డిమాండ్ చేయడంలో నేరుగా ప్రమేయం ఉందని కేంద్ర దర్యాప్తు సంస్థ ఆరోపించింది. ఈ డబ్బును గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఖర్చు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే, ఈడీ వాదనల్ని ఆప్ ఖండించింది. జైలులో ఉన్నప్పటికీ ఆయనే ముఖ్యమంత్రిగా కొనసాగుతారని ఆప్ చెప్పింది. ఈడీ అరెస్టును సవాల్ చేస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ని రేపు సుప్రీంకోర్టు సోమవారం విచారించనుంది.
తాజావార్తలు
-
Hyderabad: ఏఎంబీ ఫ్లైఓవర్పై ఘోర ప్రమాదం.. ఇద్దరి ప్రాణాలు తీసిన రాంగ్ రూట్ ప్రయాణం..
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
Vaibhav Sooryavanshi Debut: ఎంతో ప్రతిభ ఉన్నా.. వైభవ్ సూర్యవంశీకి అరంగేట్రం చేసే అర్హత ఉందా?
-
Ketan Murder Case: “ఒక్క మాట చెబితే పెళ్లి ఆపేవాళ్లం”.. కూతురు ఘాతుకంపై తల్లిదండ్రుల కన్నీటిపర్యంతం!
-
Muskan Pradhan: తాగొచ్చిన వరుడికి చెంపదెబ్బ.. ఇప్పుడు మహిళలకు మార్గదర్శి! కౌన్సెలర్గా నియమితురాలైన ముస్కాన్
ట్రెండింగ్
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!