Virat Kohli: ఇంకాస్త ముందుగా మొదలుపెట్టి ఉంటే బాగుండేది: విరాట్ కోహ్లీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Virat Kohli Says For me it’s still quality over quantity: వరుసగా విజయాలను సాధించడం ఇంకాస్త ముందుగా మొదలుపెట్టి ఉంటే.. ఐపీఎల్ 2024 ప్లే ఆఫ్స్ అవకాశాల కోసం ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఉండేది కాదని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తెలిపాడు. సీజన్ ఆరంభంలో తాము అనుకున్న విధంగా ఫలితాలు రాలేదని, చాలా వెనుకబడిపోయాం అని అన్నాడు. ఇప్పుడు పాయింట్ల పట్టికను చూడకుండా.. ఆత్మగౌరవం కోసం ఆడతాం అని కోహ్లీ పేర్కొన్నాడు. ఐపీఎల్ 2024లో భాగంగా గురువారం ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ 60 పరుగుల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్లో 47 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్సర్లతో 92 పరుగులు చేశాడు.
కీలక ఇన్నింగ్స్ ఆడిన విరాట్ కోహ్లీకి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. పంజాబ్ కింగ్స్ సహా యజమాని ప్రీతి జింతా చేతుల మీదుగా విరాట్ అవార్డును అందుకున్నాడు. పోస్ట్ మ్యాచ్ ప్రజంటేషన్ సందర్భంగా ఐపీఎల్ 2024లో తన స్ట్రైక్రేట్పై వచ్చిన విమర్శలకు మరోసారి గట్టిగా సమాధానం ఇచ్చాడు. ‘నా వరకు క్రికెట్లో ఎప్పుడూ క్వాంటిటీ కంటే క్వాలిటీ ముఖ్యమని నమ్ముతా. గేమ్ పరిస్థితి అంచనా వేస్తూ ఆడాలి. అందుకు పెద్దగా ప్రాక్టీస్ అవసరం లేదు. గతంలో ఇలాంటి ఇన్నింగ్స్లను ఎన్నో ఆడా. ఇప్పటికీ నా ఆట మెరుగుకావడానికి ప్రయత్నిస్తూనే ఉంటా. ఇది నిరంతరం జరిగే ప్రక్రియ’ అని కోహ్లీ అన్నాడు.
Also Read
- US-Iran War: ఇరాన్ ప్రతీకార దాడులు.. గాయపడిన అమెరికన్ సైనికులు.?
- Samsung గెలాక్సీ డబుల్ ధమాకా.. ఫోల్డబుల్ ఫోన్లు, స్మార్ట్ గ్లాసెస్ లాంచ్కు ముహూర్తం ఖరారు..
- Rohit Sharma Retirement: బిగ్ షాక్.. సెలక్టర్లకు ఎదురుతిరిగిన రోహిత్ శర్మ.. జైస్వాల్ కోసం గిల్ త్యాగం!
- Amit Shah: 'చికెన్ నెక్' కారిడార్ భద్రతపై అమిత్ షా హై లెవల్ రివ్యూ..
Also Read: Virat Kohli-Preity Zinta: ‘కింగ్’ను ఎవరైనా ఇష్టపడాల్సిందే.. విరాట్ కోహ్లీ-ప్రీతి జింతా ఫోటో వైరల్!
‘స్పిన్ బౌలింగ్లో స్లాగ్ స్వీప్ ఆడితే.. బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శించేందుకు వీలుంటుంది. ఇందుకు పెద్దగా ప్రాక్టీస్ చేయలేదు. నాకు పూర్తి అవగాహన ఉంది. కొన్నిసార్లు రిస్క్ తీసుకుంటేనే ఫలితం వస్తుంది. అలా ఆడాలంటే నమ్మకం ఉండాలి. నా స్ట్రైక్రేట్ను మెరుగు పర్చుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నా. ఈ సీజన్ ఆరంభంలో మేం అనుకున్న ఫలితాలు రాలేదు. చాలా వెనుకబడిపోయాం. ఇప్పుడు పాయింట్ల పట్టికను చూడకుండా ఆత్మగౌరవం కోసం ఆడతాం. ఫాన్స్ గర్వపడేలా చేయడానికి ప్రయత్నిస్తాం. వరుసగా విజయాలను సాధించడం ఇంకాస్త ముందుగా మొదలుపెట్టి ఉంటే ప్లేఆఫ్స్ అవకాశాలు ఉండేవి’ అని విరాట్ కోహ్లీ తెలిపాడు.
తాజావార్తలు
-
US-Iran War: ఇరాన్ ప్రతీకార దాడులు.. గాయపడిన అమెరికన్ సైనికులు.?
-
Preity Mukhundhan: ఈ ముద్దుగుమ్మ రామానుజన్ మునిమనవరాలా? అసలు నిజం ఇదే!
-
Samsung గెలాక్సీ డబుల్ ధమాకా.. ఫోల్డబుల్ ఫోన్లు, స్మార్ట్ గ్లాసెస్ లాంచ్కు ముహూర్తం ఖరారు..
-
Criminal Gang : నల్లగొండలో మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ అరెస్ట్.. రూ.53 లక్షల సొత్తుతో.!
-
Rohit Sharma Retirement: బిగ్ షాక్.. సెలక్టర్లకు ఎదురుతిరిగిన రోహిత్ శర్మ.. జైస్వాల్ కోసం గిల్ త్యాగం!
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!