Manipur Violence: మణిపూర్లో మళ్లీ చెలరేగిన హింస.. వేర్వేరు ఘటనల్లో ముగ్గురు మృతి
- మణిపూర్లో మళ్లీ చెలరేగిన హింస
- శనివారం జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో ముగ్గురు మృతి
- ఇద్దరు బీహార్కు చెందిన కూలీలు
- ఎన్కౌంటర్లో ఓ ఉగ్రవాదిని హతం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మణిపూర్లో మళ్లీ హింస చెలరేగింది. శనివారం జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో ముగ్గురు మృతి చెందారు. వారిలో ఇద్దరు బీహార్కు చెందిన కూలీలు ఉన్నాయి. అంతేకాకుండా.. ఎన్కౌంటర్లో ఓ ఉగ్రవాదిని పోలీసులు హతమార్చారు. శనివారం సాయంత్రం కక్చింగ్ జిల్లాలో ఇద్దరు కార్మికులను కాల్చి చంపారు. మృతులు 18 ఏళ్ల సునీలాల్ కుమార్, 17 ఏళ్ల దశరత్ కుమార్గా గుర్తించారు. వారు బీహార్ రాష్ట్రం గోపాల్గంజ్ జిల్లాలోని రాజ్వాహి గ్రామ నివాసులు. కాగా.. యువకులిద్దరూ కక్చింగ్లోని మెయిటీ ఆధిపత్య ప్రాంతంలో నివసిస్తున్నారు. కక్చింగ్-వాబగై రోడ్డులోని పంచాయతీ కార్యాలయం సమీపంలో సాయంత్రం 5:20 గంటల సమయంలో గుర్తు తెలియని దుండగులు వారిని కాల్చేశారు.
LK Advani: ఐసీయూలో అద్వానీ.. డాక్టర్లు ఏమన్నారంటే?
Also Read
- YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
- Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!
- International Credit Cards: భారతీయులకు క్రెడిట్ కార్డులు ఇచ్చేందుకు నిరాకరిస్తున్న గ్లోబల్ బ్యాంక్స్.. ఎందుకంటే?
- H1N1 Cases Rise: మళ్లీ H1N1 వైరస్ విజృంభణ.. లక్షణాలు ఏంటి? ఎవరికి ప్రమాదం ఎక్కువ?
కార్మికులపై దాడికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. మణిపూర్లో మైతేయి, కుకీ వర్గాల మధ్య జరుగుతున్న కుల ఘర్షణల కారణంగానే వారిని హతమార్చినట్లు తెలుస్తోంది. మణిపూర్ పోలీసు కమాండోలు తౌబల్ జిల్లాలోని సలుంగ్ఫామ్ మానింగ్ లేకై వద్ద అనుమానిత ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో ఒక ఉగ్రవాదిని హతమార్చారు. మరో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. మృతి చెందిన ఉగ్రవాదిని 16 ఏళ్ల లైష్రామ్ ప్రియమ్ అలియాస్ లోక్తక్గా గుర్తించారు. అతను నిషేధిత సంస్థ PREPAK సభ్యుడు. ఆ ప్రాంతంలో సాయుధులు ఉన్నట్లు పోలీసులకు నిఘా వర్గాల సమాచారం అందింది. దీంతో.. ఉదయం 9:30 గంటలకు సలుంగ్ఫామ్ హైస్కూల్ సమీపంలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఎన్కౌంటర్లో ప్రియమ్ను కాల్చి.. అనంతరం ఇంఫాల్లోని రాజ్ మెడిసిటీ ఆసుపత్రికి తరలించగా అక్కడ మరణించాడు.
Atul Subhash Case: టెకీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం.. అతుల్ భార్య, అత్త అరెస్ట్
అతని వద్ద నుంచి పోలీసులు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. మూడు INSAS రైఫిల్స్, SLIR రైఫిల్, 303 రైఫిల్, AMOGH రైఫిల్, అనేక మ్యాగజైన్లు.. మందుగుండు సామగ్రి ఉన్నాయి. నాలుగు చక్రాల వాహనాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు.. కుకీ మిలిటెంట్ల దాడుల నుంచి గ్రామాలను రక్షించేందుకు మూడు నెలల క్రితం తన కుమారుడు ఇంటి నుంచి వెళ్లిపోయాడని ప్రియమ్ తల్లి లైష్రామ్ గీత్మాల తెలిపారు. ప్రియం హైస్కూల్ లీవింగ్ సర్టిఫికెట్ పరీక్షకు సిద్ధమవుతున్నాడని ఆమె చెప్పింది. “ఈ సంక్షోభం అంతం కావాలి. హింస ఆగకపోతే, ఈ రోజు నేను అనుభవిస్తున్న అదే బాధను చాలా కుటుంబాలు అనుభవిస్తాయి” ప్రియమ్ తల్లి అన్నారు.
తాజావార్తలు
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
-
Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!
-
International Credit Cards: భారతీయులకు క్రెడిట్ కార్డులు ఇచ్చేందుకు నిరాకరిస్తున్న గ్లోబల్ బ్యాంక్స్.. ఎందుకంటే?
-
Ravi Teja -Vivek : రవితేజ – వివేక్ ఆత్రేయ సినిమాకు నిర్మాతగా దిల్ రాజు పాత స్నేహితుడు
-
Aroopi OTT Release: తరతరాల శాపం… బొమ్మలో బంధించిన యక్షిణి.. ఓటీటీని వణికించేందుకు వస్తున్న ‘అరూపి’!
ట్రెండింగ్
-
890cc V-Twin ఇంజిన్, కొత్త చాసిస్, కొత్త లుక్ తో Ducati Monster V2 లాంచ్.. ధర ఎంతంటే..?
-
64MP కెమెరా, 9.49 మి.మీ. మందం, AI కెమెరా ఫీచర్లతో ఆగస్టు 25న రానున్న Boltt Ace 5G..!
-
7,000mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరా, FHD+ LCD 120Hz డిస్ప్లేతో వచ్చేందుకు సిద్దమైన Moto G Max..!
-
రూ.8,499కే Lava Smart 4 లాంచ్.. మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 5000mAh బ్యాటరీ, 90Hz LCD డిస్ప్లేతో బడ్జెట్ ఫోన్..!
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!