Manipur Violence: మణిపూర్లో మళ్లీ చెలరేగిన హింస.. వేర్వేరు ఘటనల్లో ముగ్గురు మృతి
- మణిపూర్లో మళ్లీ చెలరేగిన హింస
- శనివారం జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో ముగ్గురు మృతి
- ఇద్దరు బీహార్కు చెందిన కూలీలు
- ఎన్కౌంటర్లో ఓ ఉగ్రవాదిని హతం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మణిపూర్లో మళ్లీ హింస చెలరేగింది. శనివారం జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో ముగ్గురు మృతి చెందారు. వారిలో ఇద్దరు బీహార్కు చెందిన కూలీలు ఉన్నాయి. అంతేకాకుండా.. ఎన్కౌంటర్లో ఓ ఉగ్రవాదిని పోలీసులు హతమార్చారు. శనివారం సాయంత్రం కక్చింగ్ జిల్లాలో ఇద్దరు కార్మికులను కాల్చి చంపారు. మృతులు 18 ఏళ్ల సునీలాల్ కుమార్, 17 ఏళ్ల దశరత్ కుమార్గా గుర్తించారు. వారు బీహార్ రాష్ట్రం గోపాల్గంజ్ జిల్లాలోని రాజ్వాహి గ్రామ నివాసులు. కాగా.. యువకులిద్దరూ కక్చింగ్లోని మెయిటీ ఆధిపత్య ప్రాంతంలో నివసిస్తున్నారు. కక్చింగ్-వాబగై రోడ్డులోని పంచాయతీ కార్యాలయం సమీపంలో సాయంత్రం 5:20 గంటల సమయంలో గుర్తు తెలియని దుండగులు వారిని కాల్చేశారు.
LK Advani: ఐసీయూలో అద్వానీ.. డాక్టర్లు ఏమన్నారంటే?
Also Read
- Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్... సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
- Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
- Pakistan: గర్భిణీలు, చిన్న పిల్లల్ని కూడా వదల్లేదు.. POKలో పాక్ ఆర్మీ దుర్మార్గాలు..
- Off The Record: అధికారం కోసం తప్ప పార్టీ కోసం ఎవరూ పని చేయట్లేదా..? ఆ ఉమ్మడి జిల్లా జనసేన కమిటీ మొత్తం రద్దు..
కార్మికులపై దాడికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. మణిపూర్లో మైతేయి, కుకీ వర్గాల మధ్య జరుగుతున్న కుల ఘర్షణల కారణంగానే వారిని హతమార్చినట్లు తెలుస్తోంది. మణిపూర్ పోలీసు కమాండోలు తౌబల్ జిల్లాలోని సలుంగ్ఫామ్ మానింగ్ లేకై వద్ద అనుమానిత ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో ఒక ఉగ్రవాదిని హతమార్చారు. మరో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. మృతి చెందిన ఉగ్రవాదిని 16 ఏళ్ల లైష్రామ్ ప్రియమ్ అలియాస్ లోక్తక్గా గుర్తించారు. అతను నిషేధిత సంస్థ PREPAK సభ్యుడు. ఆ ప్రాంతంలో సాయుధులు ఉన్నట్లు పోలీసులకు నిఘా వర్గాల సమాచారం అందింది. దీంతో.. ఉదయం 9:30 గంటలకు సలుంగ్ఫామ్ హైస్కూల్ సమీపంలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఎన్కౌంటర్లో ప్రియమ్ను కాల్చి.. అనంతరం ఇంఫాల్లోని రాజ్ మెడిసిటీ ఆసుపత్రికి తరలించగా అక్కడ మరణించాడు.
Atul Subhash Case: టెకీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం.. అతుల్ భార్య, అత్త అరెస్ట్
అతని వద్ద నుంచి పోలీసులు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. మూడు INSAS రైఫిల్స్, SLIR రైఫిల్, 303 రైఫిల్, AMOGH రైఫిల్, అనేక మ్యాగజైన్లు.. మందుగుండు సామగ్రి ఉన్నాయి. నాలుగు చక్రాల వాహనాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు.. కుకీ మిలిటెంట్ల దాడుల నుంచి గ్రామాలను రక్షించేందుకు మూడు నెలల క్రితం తన కుమారుడు ఇంటి నుంచి వెళ్లిపోయాడని ప్రియమ్ తల్లి లైష్రామ్ గీత్మాల తెలిపారు. ప్రియం హైస్కూల్ లీవింగ్ సర్టిఫికెట్ పరీక్షకు సిద్ధమవుతున్నాడని ఆమె చెప్పింది. “ఈ సంక్షోభం అంతం కావాలి. హింస ఆగకపోతే, ఈ రోజు నేను అనుభవిస్తున్న అదే బాధను చాలా కుటుంబాలు అనుభవిస్తాయి” ప్రియమ్ తల్లి అన్నారు.
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!