Manipur Violence: మణిపూర్లో మళ్లీ చెలరేగిన హింస.. వేర్వేరు ఘటనల్లో ముగ్గురు మృతి
- మణిపూర్లో మళ్లీ చెలరేగిన హింస
- శనివారం జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో ముగ్గురు మృతి
- ఇద్దరు బీహార్కు చెందిన కూలీలు
- ఎన్కౌంటర్లో ఓ ఉగ్రవాదిని హతం.
మణిపూర్లో మళ్లీ హింస చెలరేగింది. శనివారం జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో ముగ్గురు మృతి చెందారు. వారిలో ఇద్దరు బీహార్కు చెందిన కూలీలు ఉన్నాయి. అంతేకాకుండా.. ఎన్కౌంటర్లో ఓ ఉగ్రవాదిని పోలీసులు హతమార్చారు. శనివారం సాయంత్రం కక్చింగ్ జిల్లాలో ఇద్దరు కార్మికులను కాల్చి చంపారు. మృతులు 18 ఏళ్ల సునీలాల్ కుమార్, 17 ఏళ్ల దశరత్ కుమార్గా గుర్తించారు. వారు బీహార్ రాష్ట్రం గోపాల్గంజ్ జిల్లాలోని రాజ్వాహి గ్రామ నివాసులు. కాగా.. యువకులిద్దరూ కక్చింగ్లోని మెయిటీ ఆధిపత్య ప్రాంతంలో నివసిస్తున్నారు. కక్చింగ్-వాబగై రోడ్డులోని పంచాయతీ కార్యాలయం సమీపంలో సాయంత్రం 5:20 గంటల సమయంలో గుర్తు తెలియని దుండగులు వారిని కాల్చేశారు.
LK Advani: ఐసీయూలో అద్వానీ.. డాక్టర్లు ఏమన్నారంటే?
Also Read
- Best Bedsheets for Summer: వేసవి ఉక్కపోతతో నిద్రపట్టడం లేదా..? ఈ బెడ్షీట్ మార్చి చూడండి.. హాయిగా నిద్ర పడుతుంది...!
- Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
- Spirit : స్పిరిట్.. మెంటలెక్కించే అప్డేట్!
- Stock Market: హార్ముజ్ డెడ్లాక్ ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో సూచీలు
కార్మికులపై దాడికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. మణిపూర్లో మైతేయి, కుకీ వర్గాల మధ్య జరుగుతున్న కుల ఘర్షణల కారణంగానే వారిని హతమార్చినట్లు తెలుస్తోంది. మణిపూర్ పోలీసు కమాండోలు తౌబల్ జిల్లాలోని సలుంగ్ఫామ్ మానింగ్ లేకై వద్ద అనుమానిత ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో ఒక ఉగ్రవాదిని హతమార్చారు. మరో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. మృతి చెందిన ఉగ్రవాదిని 16 ఏళ్ల లైష్రామ్ ప్రియమ్ అలియాస్ లోక్తక్గా గుర్తించారు. అతను నిషేధిత సంస్థ PREPAK సభ్యుడు. ఆ ప్రాంతంలో సాయుధులు ఉన్నట్లు పోలీసులకు నిఘా వర్గాల సమాచారం అందింది. దీంతో.. ఉదయం 9:30 గంటలకు సలుంగ్ఫామ్ హైస్కూల్ సమీపంలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఎన్కౌంటర్లో ప్రియమ్ను కాల్చి.. అనంతరం ఇంఫాల్లోని రాజ్ మెడిసిటీ ఆసుపత్రికి తరలించగా అక్కడ మరణించాడు.
Atul Subhash Case: టెకీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం.. అతుల్ భార్య, అత్త అరెస్ట్
అతని వద్ద నుంచి పోలీసులు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. మూడు INSAS రైఫిల్స్, SLIR రైఫిల్, 303 రైఫిల్, AMOGH రైఫిల్, అనేక మ్యాగజైన్లు.. మందుగుండు సామగ్రి ఉన్నాయి. నాలుగు చక్రాల వాహనాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు.. కుకీ మిలిటెంట్ల దాడుల నుంచి గ్రామాలను రక్షించేందుకు మూడు నెలల క్రితం తన కుమారుడు ఇంటి నుంచి వెళ్లిపోయాడని ప్రియమ్ తల్లి లైష్రామ్ గీత్మాల తెలిపారు. ప్రియం హైస్కూల్ లీవింగ్ సర్టిఫికెట్ పరీక్షకు సిద్ధమవుతున్నాడని ఆమె చెప్పింది. “ఈ సంక్షోభం అంతం కావాలి. హింస ఆగకపోతే, ఈ రోజు నేను అనుభవిస్తున్న అదే బాధను చాలా కుటుంబాలు అనుభవిస్తాయి” ప్రియమ్ తల్లి అన్నారు.
తాజావార్తలు
-
5G Smart Phones Under 15000: 7,000 mAh బ్యాటరీ.. హైటెక్ ఫీచర్లతో, 15,000 బడ్జెట్లో కొత్త 5G స్మార్ట్ఫోన్లు ఇవే
-
Best Bedsheets for Summer: వేసవి ఉక్కపోతతో నిద్రపట్టడం లేదా..? ఈ బెడ్షీట్ మార్చి చూడండి.. హాయిగా నిద్ర పడుతుంది…!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Spirit : స్పిరిట్.. మెంటలెక్కించే అప్డేట్!
-
Stock Market: హార్ముజ్ డెడ్లాక్ ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో సూచీలు
ట్రెండింగ్
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!
-
Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్లో బంధువులు!
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!