Atul Subhash Case: టెకీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం.. అతుల్ భార్య, అత్త అరెస్ట్
- అతుల్ సుభాష్ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం
- అతుల్ భార్య అరెస్ట్
- జ్యుడీషియల్ కస్టడీకి తరలించనున్న పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అతుల్ సుభాష్ ఆత్మహత్య కేసులో భార్య నికితా సింఘానియా, ఆమె తల్లి నిషా, సోదరుడు అనురాగ్లను పోలీసులు అరెస్టు చేశారు. భార్య నికితను గురుగ్రామ్లో అరెస్టు చేయగా, తల్లి, సోదరుడిని ప్రయాగ్రాజ్లో అదుపులోకి తీసుకున్నారు. వీరిని కోర్టులో హాజరుపరిచి, అక్కడి నుంచి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. కొన్ని రోజుల క్రితం నికితా, ఆమె కుటుంబం వేధింపులకు బరిచలేక ఆరోపిస్తూ.. టెకీ ఆత్మహ్య చేసుకున్న విషయం తెలిసిందే. శుక్రవారం బెంగళూరు పోలీసులు జౌన్పూర్లోని నికితా సింఘానియా ఇంటికి నోటీసులు అంటించారు. 3 రోజుల్లోగా వాంగ్మూలాన్ని నమోదు చేయాలని నోటీసులో పేర్కొన్నారు. నికితా సింఘానియా, నిషా సింఘానియా, అనురాగ్ సింఘానియాల తరఫున అలహాబాద్ హైకోర్టులో మధ్యంతర బెయిల్ కోసం దరఖాస్తు దాఖలైంది.
అసలు ఏంటి ఈ ఘటనన..
భార్య, ఆమె కుటుంబం వేధింపులతో 34 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ అతుల్ సుభాష్ ఆత్మహత్య చేసుకోవడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆయనకు న్యాయం జరగాలని సోషల్ మీడియా వేదిక నెటిజన్లు పోస్టు చేస్తున్నారు. బెంగుళూర్లో సోమవారం ఆయన ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తనపై తప్పుడు నేరం మోపిందని, న్యాయవ్యవస్థ కూడా ఆమెకు సపోర్టు చేస్తుందని చెబుతూ ఆయన రాసిని సూసైడ్ లేఖ, రికార్డ్ వీడియో వైరల్ అవుతున్నాయి. తనతో పాటు తన ఫ్యామిలీపై కేసు పెట్టడంపై అతుల్ తీవ్ర వేదన చెందినట్లు తెలుస్తోంది. బీహార్కి చెందిన అతుల్, బెంగళూర్లో పనిచేస్తున్నాడు.జౌన్పూర్ కోర్టులో న్యాయమూర్తి కేసు సెటిల్మెంట్ కోసం రూ. 5 లక్షలు డిమాండ్ చేసిందని ఆరోపించారు. పురుషులపై తప్పుడు కేసులు పెట్టడాన్ని ఎత్తిచూపుతూ రాష్ట్రపతికి లేఖ రాశారు.
Also Read
- Hyderabad: డ్రగ్స్ కలకలం.. ఎమ్మెల్సీ కుమారుడితో సహా ముగ్గురు అదుపులో, నలుగురు పరారీ..!
- 50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
- 144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
- Guntur: కన్న కొడుకును చంపిన తల్లిదండ్రులు.!
చివరి రోజు…
ఇదిలా ఉంటే, చనిపోయే ముందు రోజు వరకు అతుల్ అంతా ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. చెక్ లిస్ట్ ప్రిపేర్ చేసుకుని ‘‘ చివరి రోజు ముందు రోజు’’, ‘‘చివరి రోజు’’, ‘‘చివరి క్షణం’’ అంటూ మూడు భాగాలుగా విభజించుకున్నాడు. తన ఫోన్ ఫింగర్ ఫ్రింట్, ఫేస్ రికగ్నైజేషన్ని తీసేశాడు. ఇతరులు తన ఫోన్ యాక్సెస్ చేసే విధంగా చేశాడు. తన కారు, బైక్ కీలు, గది తాళాలను ఫ్రిజ్పై ఉంచడంతో పాటు ఆఫీస్ పని అంతా పూర్తి చేసి, ఆఫీస్ ల్యాప్ టాప్, ఛార్జర్ని సమర్పించాలనే పనులని చెక్ లిస్టులో చేర్చాడు.
ఫ్రిజ్పై సూసైడ్ నోట్ ..
ఆర్థిక పరమైన విషయాలలతో పాటు, తన ఆఫీసు పనికి సంబంధించి డేటా బ్యాకప్ చేయడంతో పాటు వీడియో సూసైడ్ నోట్లను అప్లోడ్ చేయడం వంటి అంశాలు ఉన్నాయి. ‘‘లాస్ట్ మూమెంట్ అమలు’’ సెక్షన్లో స్నానం చేయాలని రాసుకున్నాడు. ఫ్రిజ్పై సూసైడ్ నోట్ పెట్టి వాటిపై కార్, బైక్, గది తాళాలు ఉంచాడు. అతుల్ సోదరుడు బికాస్ కుమార్ మాట్లాడుతూ.. తనకు చివరిగా వీడ్కోలు సందేశాలు పంపాడని, అతని కారు గూగుల్ మ్యాప్స్ లొకేషన్స్ పంచుకున్నాడని చెప్పారు. వీటిలో పాటు అతడి లాయర్లకు, కుటుంబ సబ్యులకు మెసేజులు పంపడం, హైకోర్టు-సుప్రీంకోర్టుకు మెయిల్ పంపండం వంటికి చెక్ లిస్టులో రాసుకున్నాడు.
నెల రోజులుగా ప్లాన్..
వీటన్నింటిని నెల రోజులుగా అతుల్ ప్లాన్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. “నేను నా కుటుంబం పట్ల పెండింగ్లో ఉన్న నా బాధ్యతలను పూర్తి చేయడానికి, నా పని కట్టుబాట్లు మొదలైనవాటిని పూర్తి చేయడానికి నాకు కొన్ని నెలలు పట్టింది. అలాగే చాలా ప్రభుత్వ కార్యాలయ పనులు నెమ్మదిగా ఉన్నాయి, ఇది ఆత్మహత్యకు ఈ ఆలస్యంకు దారితీసింది. ఈ ఆలస్యం నన్ను, నా కుటుంబాన్ని వేధించే వారికి, దోపిడీ చేసే వారికి సాయం చేయదు’’ అని ఆయన నోట్లో రాసుకున్నారు.
ఆవేదనతో చివరికీ..
నేను ఎక్కువగా కష్టపడి పనిచేస్తే, నా పనిలో మరింత మెరుగైతే అది నా కుటుంబాన్ని వేధింపులకు గురి చేస్తుంది. మొత్తం న్యాయ వ్యవస్థ నన్ను వేధించేవారిని ప్రోత్సహిస్తుంది, సాయం చేస్తుంది. ఇప్పుడు నేను పోయిన తర్వాత డబ్బు ఉండు. ఇక నా కుటుంబాన్ని, నా తల్లిదండ్రుల్ని, సోదరుడిని వేధించే వారు ఉండరు.’’ అని ఆవేదతో ఆయన చేసిన వ్యాఖ్యలు అందరితో కన్నీరు పెట్టిస్తున్నాయి. భార్యతో పాటు ఆమె తల్లి కూడా ‘‘నువ్వు ఇంకా ఎందుకు చావలేదు’’ అని అన్నారని అతుల్ వీడియోలో చెప్పారు. ప్రస్తుతం ఆయన భార్య, కుటుంబ సభ్యులపూ పోలీసులు కేసు నమోదు చేశారు.
తాజావార్తలు
-
Diljit Dosanjh: రూ.1 రెమ్యునరేషన్ తీసుకున్న స్టార్ హీరో.. షాకింగ్ నిజం బయటపెట్టిన దర్శకుడు
-
Hyderabad: డ్రగ్స్ కలకలం.. ఎమ్మెల్సీ కుమారుడితో సహా ముగ్గురు అదుపులో, నలుగురు పరారీ..!
-
PM Modi: ఘనంగా ప్రారంభమైన పూరీ జగన్నాథ రథయాత్ర.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు..
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
Allu Arjun : అల్లు అర్జున్ తెలుగు డైరెక్టర్స్ను పట్టించుకోడా?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!