Doctors Negligence: డాక్టర్ల నిర్లక్ష్యం.. కట్టుకట్టి బ్లేడ్ మరిచిపోయారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైద్యో నారాయణో హరి అంటారు. వైద్యుడు ఆ దేవుడితో సమానం అంటారు. విజయవాడ ప్రభుత్వ దవాఖానాలో దారుణం జరిగింది. ఓ డాక్టర్ నిర్లక్ష్యం రోగికి ప్రాణసంకటంగా మారింది. డాక్టర్ల నిర్లక్ష్యంతో కూలి మహిళ చేతిని తీసివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిందనే సామెతలా మారింది ఈ ఉదంతం. ఆపరేషన్లు చేసి కడుపులో కత్తెర మరిచిపోయిన ఘటనలు చూశాం మనం, కానీ ఇప్పుడు చేతికి కట్టుకట్టి బ్లేడ్ మరిచిపోయాడా డాక్టర్. వైద్య విధానాలలో ప్రభుత్వ అనేక పెను మార్పులు తీసుకువచ్చిన నేడు డాక్టర్ల పనితీరు కళ్ళకు కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. కొంతమంది డాక్టర్లు తమకున్న నైపుణ్యంతో రోగులకు మంచి వైద్యం అందిస్తారు. కానీ ఇది రివర్స్ అయింది.
Read Also: Post Office : పోస్టాఫీసులో రూ.5 లక్షలు డిపాజిట్ చేస్తే రూ.2.5 లక్షల వడ్డీ
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
విజయవాడ కొత్త గవర్నమెంట్ హాస్పిటల్ నందు అయోమయ స్థితిలో పేద కుటుంబం ఉంది. తిరువూరు నియోజకవర్గం విసన్నపేట గ్రామానికి చెందిన నందిపాం సురేష్ భార్య తులసి తనకున్న పూరిల్లు సర్దుకునే సమయంలో తెలియని పురుగు ముట్టిందని అనుమానంతో స్థానిక ఆసుపత్రికి వెళ్లారు. అక్కడనుండి మెరుగైన వైద్యం కోసం నూజివీడు ఏరియా ఆసుపత్రికి తరలించారు తర్వాత నూజివీడు డాక్టర్ల పరిశీలించి ఇన్ఫెక్షన్ ప్రారంభంతో మెరుగైన వైద్యం కోసం విజయవాడ తరలించారు. విజయవాడలో చేతికి ఉన్న ఇన్ఫెక్షన్ తొలగించి కట్లు (డ్రెస్సింగ్) కడుతూ కట్లు మార్చే సమయంలో ఓ సర్జరీ పరికరాన్ని చేతికి వేసి కట్టడంతో చేయి పూర్తిగా ఇన్ఫెక్షన్ అయిందని మామ నందిపాం దానియేలు తెలుపుతున్నారు.
నందిపం తులసికి ఇద్దరు చిన్నపిల్లలు కావడంతో పిల్లల్ని కూలి పనులకు వెళ్లి పెంచాల్సిన పరిస్థితిలో డాక్టర్లు చేయి తీసేయాలని అనటంతో అయోమయ స్థితిలో ఉన్నావని తెలుపుతున్నారు.దీనిపై ఉన్నతాధికారులు ప్రభుత్వ స్పందించి ప్రజలకు మెరుగైన వైద్యం అందే విధంగా చూడాలని బాధిత కుటుంబానికి న్యాయం జరగాలని కోరుతున్నారు కుటుంబ సభ్యులు.
Read Also: Pm Narendramodi Tour Live: మోడీ టూర్ తో తెలంగాణలో పొలిటికల్ హీట్
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!