Vijayasai Reddy : ఐఐఎంలలో 60 శాతం బీసీ, ఎస్సీ కోటా పోస్టులు ఖాళీ.. భర్తీపై దృష్టి సారించాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలోని 20 ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం)లలో వెనుకబడివ వర్గాలు, ఎస్సీలకు కేటాయించిన ఫ్యాకల్టీ పోస్టులలో 60 శాతం భర్తీ కాకుండా మిగిలిపోయాయని వైఎస్సార్సీపీ పార్లమెంట్ సభ్యులు వి. విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. అలాగే ఎస్టీ సామాజికవర్గానికి కేటాయించిన ఫ్యాకల్టీ పోస్టులలో 80 శాతం భర్తీ కాలేదని అన్నారు. ఐఐఎంల బిల్లుపై మంగళవారం రాజ్యసభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ ఐఐఎంలు అన్నింటిలో కలిపి మంజూరు చేసిన పోస్టుల సంఖ్య 1500. అయితే 2023 మార్చి నాటికి వీటిలో భర్తీ చేయని పోస్టులు 500 వరకు ఉన్నాయని అన్నారు. ఐఐఎం వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థలలో సైతం బోధనా సిబ్బంది కొరత ఇలా ఉంటే విద్యార్ధుల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించకోవచ్చని అన్నారు. ఐఐఎంలలో ఉన్నక ప్రమాణాలతో విద్యా బోధన జరగాలంటే తగినంత బోధనా సిబ్బంది ఉంటేనే సాధ్యపడుతుందని అన్నారు.
Also Read : Anushka Malhotra: చిరంజీవి రీల్ కూతురు ఏంట్రా.. ఇంత హాట్ గా ఉంది.. ?
Also Read
- Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
- Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
- Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
- Gold In Bag: అలిపిరిలో దొరికిన బంగారం బ్యాగ్.. సీసీటీవీ పరిశీలించిన అధికారులు..
గడిచిన పదేళ్ళలో కొత్తగా ఏర్పాటు చేసిన ఏడు ఐఐఎంలతో కలిపి దేశంలో ఐఐఎంల సంఖ్య 20కి చేరింది. అయితే వీటికి తగినంత బడ్జెట్ కేటాయింపులు జరగడం లేదని శ్రీ విజయసాయి రెడ్డి అన్నారు. ఐఐఎంల సంఖ్య పెరిగే కొద్దీ వాటికి ప్రభుత్వం నుంచి వచ్చే బడ్జెట్ మద్దతు తగ్గుతూ వస్తోందని తెలిపారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఐఐఎంలకు 654 కోట్ల రూపాయలు కేటాయించాలని బడ్జెట్లో అంచనా వేస్తే. సవరించిన అంచనాల తర్వాత కేటాయించింది 608 కోట్లు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఈ బడ్జెట్ కేటాయింపుల్లో సగానికిపైగా కోత విధించడం పట్ల ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రతిష్టాత్మకంగా పరిగణించే ఐఐఎంలకు తగినంత నిధులు కేటాయించి అవి మరింతగా రాణించేలా ప్రోత్సహించాలని ఆయన విద్యా శాఖ మంత్రికి విజ్ఞప్తి చేశారు. అలాగే వివిధ విద్యా సంస్థలలో స్థానికతకు ఇస్తున్న ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని ఐఐఎం ప్రవేశాలలో స్థానికుల కోటాను కూడా ప్రవేశపెట్టాలని విజయసాయి రెడ్డి కోరారు.
Also Read : ChatGPT : చాట్ జీపిటి లో బిగ్ చెంజెస్… వచ్చే వారం మరో కొత్త ఫీచర్స్..
తాజావార్తలు
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!