Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Vijayasai Reddy 2027 Jammili Elections Victory Assurance

Vijayasai Reddy: 2027లో జమిలి ఎన్నికల్లో వైసీపీ గెలవడం ఖాయం

Published Date :December 15, 2024 , 3:28 pm
By Mahesh Jakki
  • జమిలీ ఎన్నికలపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు
  • జమిలి ఎన్నికలు వస్తాయి..
  • 2027 ఎన్నికలకు అందరం సిద్ధంగా ఉండాలి.-విజయసాయి రెడ్డి.
Vijayasai Reddy: 2027లో జమిలి ఎన్నికల్లో వైసీపీ గెలవడం ఖాయం
  • Follow Us :
  • google news
  • dailyhunt

Vijayasai Reddy: జమిలీ ఎన్నికలపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. జమిలి ఎన్నికల్లో భాగంగా 2027లో ఎన్నికలు వస్తాయని, వైసీపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఉత్తరాంధ్రకు తిరిగి రావడం చాలా సంతోషంగా ఉందని.. గత ఎన్నికల్లో ఏ పార్టీ కార్యాలయంగా వేదికగా విజయం సాదించామో మళ్లీ అదే పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం చేయడం చాలా ఆనందంగా ఉందని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ఓడిపోయామనే ఆందోళన అవసరం లేదని.. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు అందరినీ కలుపుకుపోవాలన్నారు. కార్యకర్తలకు వైఎస్ జగన్ అండగా ఉంటారని.. వారికి ఎలాంటి నష్టం జరగకుండా చూసుకుంటారని అన్నారు. నిత్యం కార్యకర్తలకు, ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. “జమిలి ఎన్నికలు వస్తాయి.. వన్ నేషన్ వన్ ఎలెక్షన్ జరుగుతాయి.. 2027 ఎన్నికలకు అందరం సిద్ధంగా ఉండాలి. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను వస్తాయి..అసెంబ్లీ, ఎంపీ స్థానాలు పెరుగుతాయి.. మూడు స్థానాల్లో ఒక స్థానం మహిళకు వస్తుంది.మహిళలకు వైఎస్ జగన్ తగిన ప్రాధాన్యం ఇస్తారు.. నాకు విశాఖ నుంచి పోటీ చేసే ఆలోచన లేదు. పార్టీని గెలిపించడమే నా పని.” అని ఆయన అన్నారు.

Read Also: CPI Ramakrishna: సినిమా వాళ్లకు కోట్లు కోట్లు లాభం వచ్చేలా చేస్తారు కానీ.. రైతులను మాత్రం పట్టించుకోరు!

2027లో జమిలి ఎన్నికల్లో పార్టీ ఖచ్చితంగా విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ కార్యకర్తలను కూటమి నేతలు గ్రామాల నుంచి తరిమేస్తున్నారన్నారు. గ్రామాల చివర్లో టెంట్‌లు వేసుకుని వుండే భయానక వాతావరణం సృష్టించారన్నారు. గతంలో ఏ ప్రభుత్వంలో ఈ పరిస్థితి లేదన్నారు. కాకినాడ సీ పోర్టులో కేవీ రావు ఎవరో తెలియకపోయినా తనపై కేసు పెట్టారని చెప్పారు. మేము అధికారంలోకి వచ్చాక ఆ కేసులు తిరిగి వెంటాడుతాయి అని గుర్తు పెట్టుకోవాలన్నారు. అవసరమైతే 3 ,4 నెలలు జైల్లోకి వెళ్ళినా పోరాటం చేస్తామన్నారు. నా మీద లుక్ అవుట్ నోటీస్ ఎందుకు.. మీరు పిలిస్తే నేను సీఐడి ఆఫీస్ కు వస్తా.. అరెస్టు చేసుకోండని వ్యాఖ్యానించారు. బెయిల్ పిటిషన్ కూడా వేయమన్నారు. భయపడేది లేదని.. భయం వైసీపీ నాయకుల రక్తంలో లేదన్నారు. నేను విశాఖలో ఒక్క సెంట్ ప్రభుత్వ భూమి కూడా కబ్జా చేయలేదన్నారు. బంధువులు కోనుగోలు చేస్తే తన మీద దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. నేను ఏ తప్పు చేయలేదు.. అందుకే ధైర్యంగా వున్నా.. జైలుకి అయినా వెళ్తానన్నారు.

Read Also: AP-Telangana: సన్న ధాన్యంకు బోనస్.. ఆంధ్రా నుంచి తెలంగాణకు భారీగా లారీలు

విద్యుత్ ఒప్పందంలో వైసీపీ ప్రభుత్వం ఏ తప్పు చేయలేదు. దురుద్దేశంతో కేసు పెట్టారన్నారు. లోకేశ్ అమెరికా వెళ్లి నిరాధార ఆరోపణలకు పథక రచన చేశాడని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలో వుంది, ఆరోపణలు ప్రూవ్ చేయవచ్చు కదా అంటూ వ్యాఖ్యానించారు. భీమిలి తీరంలో మా వియ్యంకులు టీడీపీ ఎంపీ భరత్ తండ్రి వద్దే భూమి కొన్నారు. ఇంకొంత వేరే వాళ్ళ దగ్గర కొన్నారన్నారు. అందులో ప్రభుత్వ భూమి ఇంచు కూడా లేదన్నారు. శారద పీఠంకు మేము భూమి ఇస్తే రద్దు చేశారన్నారు. చంద్రబాబు తన హయాంలో అనేక పీఠాలకు, సంస్థలకు భూములు కేటాయించ లేదా అంటూ ప్రశ్నించారు. 2027లో జమిలి ఎన్నికల్లో పొత్తులపై జగన్ నిర్ణయం తీసుకుంటారన్నారు. నాయకుల్ని పోగుట్టుకోమని.. అందరినీ నిలబెట్టుకుంటామన్నారు. జగన్ ఫిబ్రవరి నుంచి ప్రజల్ని, నాయకుల్ని కలుసుకునేందుకు ప్రజల్లోకి వస్తున్నారన్నారు. పార్టీలో పూర్తిస్థాయిలో మార్పులు చూస్తారన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంశంలో కేంద్ర మంత్రి కుమార స్వామిని వైసీపీ ఎంపీలం ఇప్పటికే కలిశామన్నారు. ఎటువంటి పరిస్థితుల్లో ప్రయివేటీకరణ చేయం అని హామీ ఇచ్చారన్నారు. కార్మికులకు వ్యతిరేకంగా ఏ నిర్ణయిం తీసుకున్నా ఉద్యమిస్తామని ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 2027 Elections
  • Andhra Pradesh Politics
  • Jammili Elections
  • Political Controversies
  • political Strategy

తాజావార్తలు

  • Jobs Growth: ఏఐ, ఐటీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. భారీగా పెరిగిన నియామకాలు..

  • Holi 2026 Eye Safety Tips: సర్వేంద్రియాణాం నయనం ప్రధానం.. హోలీ సమయంలో మీ కళ్లలో కలర్స్‌ పడితే.. వెంటనే ఇలా చేయండి..

  • Israel-Iran War: అయోధ్యలో ‘‘ఇజ్రాయిల్ ప్రధాని’’ కోసం పూజలు..

  • Ola Roadster: ఓలా హోలీ బంపర్ ఆఫర్.. రోడ్‌స్టర్ X రూ.79,999కే.. హీరో సూపర్ స్ప్లెండర్ కంటే చౌక!

  • Sapthami Gowda: మా బాడీని జూమ్ చేసి వీడియోలు తీయొద్దు.. హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు

ట్రెండింగ్‌

  • Udyam Benefits : వ్యాపారస్తులకు వరం ‘ఉద్యమ్ రిజిస్ట్రేషన్’.. రూపాయి ఖర్చు లేకుండా బిజినెస్ ప్రయోజనాలు ఇవే.!

  • మారిన Income Tax ఫారమ్స్..! పాన్ కార్డ్ వాడేవారు ఈ తప్పు అస్సలు చేయకండి.!

  • Best Selling Cars: SUVల జోరు.. ఫిబ్రవరిలో అత్యధికంగా అమ్ముడైన కార్లు ఇవే..!

  • క్లాసిక్ స్టైల్‌కు మోడర్న్ టచ్.. Yezdi Roadster Red Wolf Edition భారత్‌లో లాంచ్..!

  • IND Playing 11 vs ENG: ఇంగ్లాండ్‌తో సెమీఫైనల్‌.. భారత జట్టులో కీలక మార్పు, ఆ స్టార్ ప్లేయర్ అవుట్!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions