CPI Ramakrishna: సినిమా వాళ్లకు కోట్లు కోట్లు లాభం వచ్చేలా చేస్తారు కానీ.. రైతులను మాత్రం పట్టించుకోరు!
- రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు
- పంట కనీస మద్దతు ధర ఎందుకు ఇవ్వరు
- విజన్ డాక్యుమెంటరీపై చర్చలు జరపాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కూటమి ప్రభుత్వ పాలనపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల్లో వాగ్దానం చేసిన ‘సూపర్ సిక్స్’ పథకాలు అమలు కావటం లేదని మండిపడ్డారు. రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని, నిరుద్యోగ భృతి ఇవ్వలేదన్నారు. విజన్ డాక్యుమెంటరీపై చర్చలు జరపాలని తాను సీఎం చంద్రబాబు నాయుడుకి సవాల్ విసురుతున్నా అని అన్నారు. సినిమాకి పెట్టుబడి పెట్టి టికెట్లు అమ్ముకుంటున్నారని, రైతులు ఎండ వాన చూడకుండా పెట్టుబడి పెట్టి పంట పండిస్తే కనీస మద్దతు ధర ఇవ్వరు అని రామకృష్ణ ధ్వజమెత్తారు. వేరే రాష్ట్రాల్లో లేని సినిమా రేట్లు మన రాష్ట్రానికి ఎందుకు అని ప్రశ్నించారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ… ‘ ఎన్నికల్లో వాగ్దానం చేసిన సూపర్ సిక్స్ పథకాలు అమలు కావటం లేదు. రైతులకు హామీ నెరవేర్చలేదు. నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. మహిళలకు అమ్మ ఒడి, విద్యార్థులకు విద్యాధీవన ఇవ్వలేదు. మహిళలకు నెలకు రూ.1500 ఇస్తానని ఇవ్వలేదు. సీఎం చంద్రబాబుకి సవాల్ చేస్తున్నా.. మీ విజన్ డాక్యుమెంటరీపై చర్చలు జరపాలి. అన్ని పార్టీలతో చర్చలు జరపాలి, చర్చలకు మేము రెడీ. హైదరాబాద్ సంధ్య థియేటర్ దగ్గర తల్లి చనిపోయి, బాబు హాస్పిటల్లో చావుబతుకుల మధ్యలో ఉంటే వారితో ఎందుకు మాట్లాడరు?’ అని ప్రశ్నించారు.
Also Read
- Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
- Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
- Jobs: నిరుద్యోగులకు గొప్ప అవకాశం.. నెలకు శాలరీ రూ.1.99 లక్షలు..
- Petrol-Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై పుకార్లు.. ఎంత పెరగవచ్చంటే..!
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు ఆలోచించాలి. టిక్కెట్ ధర ఎందుకు పెంచాలి, అది వారి వ్యాపారం కాబట్టి. సినిమాకి పెట్టుబడి పెట్టి టికెట్లు అమ్ముకుంటున్నారు. రైతులు ఎండ వాన చూడకుండా పెట్టుబడి పెట్టి పంట పండిస్తే కనీస మద్దతు ధర ఇవ్వరు. సినిమా వాళ్లకు కోట్లు కోట్లు లాభం వచ్చేలా చేస్తారు కానీ.. రైతును మాత్రం పట్టించుకోరు. 100 కోట్లు 200 కోట్లు పెట్టి సినిమా తీస్తుంటే.. వాళ్ళకి ప్రభుత్వం ఊడిగం చేస్తోంది. దీనిని పూర్తిగా ఖండిస్తున్నాం. వేరే రాష్ట్రాల్లో లేని సినిమా రేట్లు మన రాష్ట్రానికి ఎందుకు. వెయ్యి రూపాయలా?.. ఇష్టానుసారంగా టికెట్లు రేట్లు పెంచారు. సినిమా వారికి ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులు దోచిపెడుతున్నారు. దీనిని మేం ఖండిస్తున్నాము’ అని రామకృష్ణ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Off The Record : విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు.. మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ పై తీవ్ర ఆరోపణలు
-
Story Board : నిర్లక్ష్యానికి శిక్షల్లేవా? పిల్లల మానసిక వేదన పట్టించుకోరా?
-
Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
-
DGP CV Anand: ఉగ్ర ముప్పుపై తెలంగాణ అప్రమత్తం.. OCTOPUS యాక్షన్ ప్లాన్..!
-
Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!