CPI Ramakrishna: సినిమా వాళ్లకు కోట్లు కోట్లు లాభం వచ్చేలా చేస్తారు కానీ.. రైతులను మాత్రం పట్టించుకోరు!
- రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు
- పంట కనీస మద్దతు ధర ఎందుకు ఇవ్వరు
- విజన్ డాక్యుమెంటరీపై చర్చలు జరపాలి
కూటమి ప్రభుత్వ పాలనపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల్లో వాగ్దానం చేసిన ‘సూపర్ సిక్స్’ పథకాలు అమలు కావటం లేదని మండిపడ్డారు. రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని, నిరుద్యోగ భృతి ఇవ్వలేదన్నారు. విజన్ డాక్యుమెంటరీపై చర్చలు జరపాలని తాను సీఎం చంద్రబాబు నాయుడుకి సవాల్ విసురుతున్నా అని అన్నారు. సినిమాకి పెట్టుబడి పెట్టి టికెట్లు అమ్ముకుంటున్నారని, రైతులు ఎండ వాన చూడకుండా పెట్టుబడి పెట్టి పంట పండిస్తే కనీస మద్దతు ధర ఇవ్వరు అని రామకృష్ణ ధ్వజమెత్తారు. వేరే రాష్ట్రాల్లో లేని సినిమా రేట్లు మన రాష్ట్రానికి ఎందుకు అని ప్రశ్నించారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ… ‘ ఎన్నికల్లో వాగ్దానం చేసిన సూపర్ సిక్స్ పథకాలు అమలు కావటం లేదు. రైతులకు హామీ నెరవేర్చలేదు. నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. మహిళలకు అమ్మ ఒడి, విద్యార్థులకు విద్యాధీవన ఇవ్వలేదు. మహిళలకు నెలకు రూ.1500 ఇస్తానని ఇవ్వలేదు. సీఎం చంద్రబాబుకి సవాల్ చేస్తున్నా.. మీ విజన్ డాక్యుమెంటరీపై చర్చలు జరపాలి. అన్ని పార్టీలతో చర్చలు జరపాలి, చర్చలకు మేము రెడీ. హైదరాబాద్ సంధ్య థియేటర్ దగ్గర తల్లి చనిపోయి, బాబు హాస్పిటల్లో చావుబతుకుల మధ్యలో ఉంటే వారితో ఎందుకు మాట్లాడరు?’ అని ప్రశ్నించారు.
Also Read
- Off The Record : కాంగ్రెస్ పెద్దలకు తలనొప్పిగా ఆర్మూర్ వ్యవహారాలు
- Rose Lassi Recipe: ఎప్పుడైనా రోజ్ లస్సీని రుచి చూశారా..? ఇలా సింపుల్గా తయారు చేయండి.. వన్ మోర్ అనాల్సిందే..
- India New Gaming Rules 2026: సర్కార్ సరి కొత్త గేమింగ్ రూల్స్.. ప్రయోజనకరమా లేక హానికరమా..?
- Sanju Samson: సంజూ శాంసన్ వీర విహారం.. దెబ్బకు ఆ రికార్ట్స్ అన్నీ బ్రేక్..
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు ఆలోచించాలి. టిక్కెట్ ధర ఎందుకు పెంచాలి, అది వారి వ్యాపారం కాబట్టి. సినిమాకి పెట్టుబడి పెట్టి టికెట్లు అమ్ముకుంటున్నారు. రైతులు ఎండ వాన చూడకుండా పెట్టుబడి పెట్టి పంట పండిస్తే కనీస మద్దతు ధర ఇవ్వరు. సినిమా వాళ్లకు కోట్లు కోట్లు లాభం వచ్చేలా చేస్తారు కానీ.. రైతును మాత్రం పట్టించుకోరు. 100 కోట్లు 200 కోట్లు పెట్టి సినిమా తీస్తుంటే.. వాళ్ళకి ప్రభుత్వం ఊడిగం చేస్తోంది. దీనిని పూర్తిగా ఖండిస్తున్నాం. వేరే రాష్ట్రాల్లో లేని సినిమా రేట్లు మన రాష్ట్రానికి ఎందుకు. వెయ్యి రూపాయలా?.. ఇష్టానుసారంగా టికెట్లు రేట్లు పెంచారు. సినిమా వారికి ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులు దోచిపెడుతున్నారు. దీనిని మేం ఖండిస్తున్నాము’ అని రామకృష్ణ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Off The Record : కాంగ్రెస్ పెద్దలకు తలనొప్పిగా ఆర్మూర్ వ్యవహారాలు
-
Rose Lassi Recipe: ఎప్పుడైనా రోజ్ లస్సీని రుచి చూశారా..? ఇలా సింపుల్గా తయారు చేయండి.. వన్ మోర్ అనాల్సిందే..
-
Telangana Cabinet: రాష్ట్ర కేబినెట్లో కీలక నిర్ణయాలు.. అక్కడ అతి పెద్ద స్టేడియం నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
-
India New Gaming Rules 2026: సర్కార్ సరి కొత్త గేమింగ్ రూల్స్.. ప్రయోజనకరమా లేక హానికరమా..?
-
Sanju Samson: సంజూ శాంసన్ వీర విహారం.. దెబ్బకు ఆ రికార్ట్స్ అన్నీ బ్రేక్..
ట్రెండింగ్
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!