Uttar Pradesh Crime: ప్రియుడి గుట్టు బయటపడుతుందని దారుణం.. చెల్లెళ్లను గొంతుకోసి చంపిన అక్క
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttar Pradesh Crime: ఓ యువకుడితో ప్రేమలో పడింది.. వారి ఇద్దరి మధ్య సన్నిహిత్యం పెరిగింది.. అయితే, ఇంట్లో తల్లిదండ్రులు లేని సమయంలో.. ప్రియుడిని ఇంటికి రమ్మని చెప్పింది.. ఇంటికి వచ్చిన ప్రియుడితో రొమాన్స్లో మునిగిపోయింది.. అయితే, ఇద్దరూ అత్యంత సన్నిహితంగా ఉన్న సమయంలో.. ఆ యువతి చెల్లెళ్లు అయిన ఇద్దరు చిన్నారులు ఆ దృశ్యాలను చూశారు.. దీంతో.. భయంతో వణికిపోయిన ఆ యువతి.. ఈ విషయం తల్లిదండ్రులకు తెలిస్తే కష్టమని.. ఆ ఇద్దరు చెల్లెళ్లను దారుణంగా హత్య చేసింది.. ఈ ఘటనలో ఉత్తరప్రదేశ్లో సంచలనంగా మారింది.
యూపీలోని బల్రాయ్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఇద్దరు చిన్నారుల హత్యకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బహదూర్పుర్ గ్రామానికి చెందిన 20 ఏళ్ల యువతి.. ఇంట్లో తల్లిదండ్రులు లేని సమయంలో ప్రియుణ్ని రమ్మని చెప్పింది.. అతడితో అత్యంత సన్నిహితంగా ఉంది.. అయితే, ఆ దృశ్యాలను ఏడు, నాలుగేళ్ల వయసున్న ఆ యువతి ఇద్దరు చెల్లెళ్లు చూశారు. ఈ విషయం తల్లిదండ్రులకు చెబుతారేమోనని భయపడిన యువతి.. ఆ చిన్నారులు తన చెల్లెళ్లు అనే విషయాన్ని కూడా మరిచి కర్కషంగా వ్యవహరింంచింది.. పదునైన ఆయుధంతో గొంతు కోసి చెల్లెళ్లను దారుణంగా హత్య చేసింది. అయితే, ఓ కట్టుకథ అల్లి బయటపడాలని చూసింది.. చెల్లెళ్లను ఎవరో చంపేశారని తల్లిదండ్రులకు చెప్పింది.. కానీ, ఘటనా స్థలంలో రక్తపు మరకలతో ఉన్న ఆ యువతి దుస్తులను గుర్తించిన పోలీసులు.. జంట హత్యలపై ఆమెను నిలదీశారు. దీంతో.. అసలు విషయం బయటపెట్టింది.. వెంటనే ఆమెను అరెస్ట్ చేశారు పోలీసులు.. అయితే, ఇద్దరు చిన్నారుల హత్యకు.. నిందితురాలైన అంజలికి ప్రియుడు, మరికొందరు సహకరించినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.
Also Read
- Astrology: మే 17 శనివారం దినఫలాలు.. ఈ రాశివారు కాస్త జాగ్రత్త..
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
ఈ ఘటనపై మీడియాతో మాట్లాడిన ఓ పోలీసు అధికారి.. ఇద్దరు చిన్నారులు.. అంజలి తన ప్రియుడితో అభ్యంతరకర స్థితిలో ఉన్నప్పుడు చూశారు.. దీంతో తన గురించి అందరికీ చెప్పేస్తారనే భయంతో.. ఆమె వారిని పారతో చంపేసిందని.. సాక్ష్యాలు దొరకకుండా ఉండేందుకు ఆమె తన బట్టలు ఉతికి, హత్యకు ఉపయోగించిన పారను కూడా శుభ్రం చేసిందని.. ఘటనా స్థలానికి వెళ్లినప్పుడు పారకు ఉన్న రక్తపు మరకలు క్లీన్ చేసి ఉన్నాయని తెలిపారు.. ఈ ఘటనపై విచారణ జరుగుతోంది.. పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు పోలీసులు.
తాజావార్తలు
-
Shubman Gill: “మేం గెలవడానికి అస్సలు అర్హులం కాదు”.. సొంత జట్టుపై కెప్టెన్ గిల్ తీవ్ర ఆగ్రహం..
-
Rajinikanth-Kamal Haasan: రజినీ – కమల్ మల్టీస్టారర్ నుంచి త్రిష ఔట్..?
-
Finn Allen: 10 సిక్సర్లు, 4 ఫోర్లు.. అభిషేక్, వైభవ్ల ప్రత్యేక బ్యాట్స్మెన్ల జాబితాలో ఫిన్ అలెన్..
-
Astrology: మే 17 శనివారం దినఫలాలు.. ఈ రాశివారు కాస్త జాగ్రత్త..
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..