Uttam Kumar Reddy: కేసీఆర్ హయాంలోనే నీళ్ల దోపిడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్రంలో నీళ్ల పంచాయితీ మళ్లీ మొదలైంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తరువాత మొదటి అసెంబ్లీ సమావేశంలో ప్రాజెక్టుల విషయంపై అధికార పార్టీ, బీఆర్ఎస్ నాయకులు రాళ్లు రువ్వుకున్నారు. తప్పు మీదంటే.. మీదంటూ ఒకరినోకరు విమర్శించుకున్నారు. స్వేత పత్రాలు సైతం విడుదల చేశారు. తాజాగా రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ హయంలో పోతిరెడ్డిపాడు నుంచి 92 వేల క్యూసెక్కుల నీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వాడుకుందన్నారు. ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కంటే ఎక్కువ నీరు దోపిడీ జరిగిందని తెలిపారు. కేసీఆర్ ను, జగన్ కలిసిన ప్రతి సారి తెలంగాణకి అన్యాయం జరిగిందని ఆరోపించారు. 2014 కి ముందు శ్రీశైలం నుంచి ఆంధ్రాకి రోజుకు 4.1 టీఎంసీలు వెళ్ళేదన్నారు. 2014 తరువాత 9.5 టీఎంసీలకు పెరిగిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో నీటి దోపిడీ జరిగిందని.. కేసీఆర్ అబద్ధాలు చెప్తున్నారన్నారు. మేము అధికారిక వివరాలు బయట పెడుతున్నాం.. కేసీఆర్ తెలివి మీరి మట్లాడుతున్నారన్నారు. డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కింకి వాటర్ సోర్స్ ఫైనల్ చేయనే లేదని తెలిపారు. ఈ టర్మ్ లో డిండి లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. కేసీఆర్ వల్ల నల్గొండకు జరిగిన అన్యాయాన్ని తాము సెట్ చేస్తామన్నారు.
READ MORE: congress: మూడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్.. వారెవరంటే?
Also Read
- Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
- RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
- Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
- Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
ఎస్ఎల్ బీసీ(SLbc) టన్నెల్ ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్నారు. కేఆర్ఎంబీ ని(Krmb) ని మీరు అప్పగిస్తే.. మేము కొట్లాడుతున్నామన్నారు. లిఖిత పూర్వకంగా అప్పగించింది మీరు.. కొట్లాడుతుంది తామని తెలిపారు. కేఆర్ఎమ్ బీకి ప్రాజెక్టులు అప్పగిస్తూ.. 2023 డిసెంబర్ 1న స్మితా సబర్వాల్ లేఖ రాశారని వెల్లడించారు. కేసీఆర్.. ఇంజనీర్ ఆయనే.. క్వాలిటీ కంట్రోల్ ఆయనే.. అందుకే మేడిగడ్డ పరిస్థితి అట్లుందని విమర్శించారు. కేసీఆర్, బీఆర్ఎస్ నేతలు మాట్లాడే మాటలన్నీ అబద్ధాలన్నారు. బీఆర్ఎస్ కోలాప్స్ అయ్యే పరిస్థితిలో ఉందని.. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క ఎంపీ సీటు కూడా గెలవదన్నారు.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!