Uttam Kumar Reddy : తెలంగాణ హక్కుల కోసం ఒక్క అవకాశాన్ని వదులుకోం
- కృష్ణా జలాల వివాదంపై న్యాయపోరాటానికి సిద్ధమైన తెలంగాణ
- న్యాయవాదుల బృందానికి పూర్తి సహకారం అందిస్తామని మంత్రి భరోసా
- తెలంగాణ రైతుల న్యాయం కోసం బ్రిజేశ్ కుమార్ ట్రైబ్యునల్లో స్వయంగా హాజరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttam Kumar Reddy : తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణలో ఒక్క అవకాశాన్ని కూడా కోల్పోకుండా కట్టుబడి పని చేస్తామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం రోజున రాష్ట్ర సాగునీటి ప్రాజెక్టుల ప్రస్తుత పరిస్థితి, కృష్ణా జలాల వివాదాల నేపథ్యంలో న్యాయవాదులు, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ నెల 15, 16, 17 తేదీల్లో జరగనున్న కృష్ణా జలాల వివాదంపై బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు విచారణలో చర్చించాల్సిన అంశాలపై అధికారులతో ఆయన సమీక్షించారు.
న్యాయవాదుల బృందానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని, అవసరమైతే విచారణలకు స్వయంగా హాజరవుతానని మంత్రి తెలిపారు. గతంలో తీసుకున్న వక్రీకృత నీటి కేటాయింపుల వల్ల తెలంగాణ రైతులకు నష్టం జరిగిందని, ఇప్పుడు వాటిని సరిదిద్దేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందడుగు వేస్తోందని ఆయన పేర్కొన్నారు.
Also Read
- Bengal: అసాంఘిక శక్తులకు అడ్డగా బెంగాల్ స్కూల్స్.. భారీగా నగదు, కండోమ్స్ స్వాధీనం
- Two Trains: ఒకే ట్రాక్పై ఎదురెదురుగా వచ్చిన ట్రైన్లు.. తృటిలో తప్పిన ప్రమాదం..
- KC Venugopal: కాంగ్రెస్లో టీఎంసీ విలీనంపై కీలక వ్యాఖ్యలు.. సోనియా-మమత భేటీపై కేసీ.వేణుగోపాల్ క్లారిటీ
- Rajya Sabha Elections: ఏపీ నుంచి రాజ్యసభకు నలుగురు సభ్యులు ఏకగ్రీవ ఎన్నిక.. అధికారిక ప్రకటన
ఇక గోదావరి, కృష్ణా జలాలపై రాష్ట్రం న్యాయ పోరాటానికి సిద్ధమైందని తెలుస్తోంది. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటైన 2014 తర్వాత తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య సాగునీటి పంపిణీపై వాదనలు కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా రాయలసీమ ఎత్తిపోతల పథకం, బనకచర్ల ప్రాజెక్టుల నిర్వహణపై అభిప్రాయభేదాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో, సుప్రీం కోర్టులో తమ వాదనలను న్యాయబద్ధంగా వినిపించి రాష్ట్ర హక్కులను సమర్థవంతంగా రక్షిస్తామని తెలంగాణ ప్రభుత్వం స్పష్టంగా తెలిపింది.
Siddu Jonnalagadda : మేమిద్దరం దాని కోసం కొట్టుకున్నాం.. సిద్ధు జొన్నలగడ్డ షాకింగ్ కామెంట్స్
తాజావార్తలు
-
Bengal: అసాంఘిక శక్తులకు అడ్డగా బెంగాల్ స్కూల్స్.. భారీగా నగదు, కండోమ్స్ స్వాధీనం
-
Two Trains: ఒకే ట్రాక్పై ఎదురెదురుగా వచ్చిన ట్రైన్లు.. తృటిలో తప్పిన ప్రమాదం..
-
KC Venugopal: కాంగ్రెస్లో టీఎంసీ విలీనంపై కీలక వ్యాఖ్యలు.. సోనియా-మమత భేటీపై కేసీ.వేణుగోపాల్ క్లారిటీ
-
Rajya Sabha Elections: ఏపీ నుంచి రాజ్యసభకు నలుగురు సభ్యులు ఏకగ్రీవ ఎన్నిక.. అధికారిక ప్రకటన
-
Firing: హర్యానాలో దారుణం.. జిమ్ యజమానిపై బుల్లెట్ల వర్షం.. 5 సెకండ్లలో 10 రౌండ్ల కాల్పులు..
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!