Uttam Kumar Reddy : బీఆర్ఎస్ పది ఏండ్ల పాలనలో అవినీతి తప్ప ప్రజలకు చేసింది ఏమి లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హరీశ్ రావు లాగా పెట్రోల్ ముందు పోసుకున్నట్లు నటించి వేరే వాళ్ల చావుకు కారణం కాలేదని, పోసుకుని చచ్చిపోతా అని నాటకాలు ఆడలేదన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉద్యమ సమయంలో కూడా వాళ్ళు అందరూ బ్లాక్ మైలర్స్ గా ఉన్నారని, ఆ బ్లాక్ మెయిల్ వివరాలు కూడా బయట పెట్టాల్సి వస్తదన్నారు. తెలంగాణ రావడానికి మూల కారణం… ఆల్ పార్టీ లో కేంద్రాన్ని ఒప్పించింది ఉత్తమ్ కుమార్ రెడ్డే. అవిషయం నీకు తెలియక పోతే మీ మామ కేసీఆర్ ను అడుగు అని ఆయన వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ పది ఏండ్ల పాలనలో అవినీతి తప్ప ప్రజలకు చేసింది ఏమి లేదని, బీఆర్ఎస్ చేసిన తీసుకున్న నిర్ణయాల వలన తెలంగాణకి అన్యాయం జరుగుతూ వచ్చిందన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. నీటి పంపకాల విషయంలో krmb బోర్డు నీటి వాటాను పంచుతూ తెలంగాణ కి అన్యాయం చేస్తుంటే బీఆర్ఎస్ ఏమి చేసిందని ఆయన ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రాజెక్ట్ ల అప్పగింత పై నిర్ణయం జరిగిందని ఆయన అన్నారు. చివరగా బీఆర్ఎస్ వాళ్ళు అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన బడ్జెట్లో కూడా krmb కి 200 కోట్లు కేటాయిస్తున్నట్లు బడ్జెట్ లో పేర్కొన్నారని, మేము ప్రాజెక్ట్ లను అప్పగించలేదు..కావాలని బీఆర్ఎస్ వాళ్ళు అబద్ధాలు చెపుతున్నారన్నారు.
అంతేకాకుండా.. ‘జగన్, కేసీఆర్ కలిసి తెలంగాణకి కుట్ర చేశారు… 203 జీవో తీసుకువచ్చి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కు కృష్ణ నీళ్ళు దొంగలించుకుని వెళ్ళారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కి ఎస్టిమేషన్ పెంచారు కానీ ఒక్క ఎకరాకు కూడా నీళ్ళు ఇవ్వలేదు. బీఆర్ఎస్ వాళ్ళు పది ఏండ్లు అధికారంలో ఉన్న కృష్ణ నది పరివాహక ప్రాంతలలో ఉన్న ఒక్క పెండింగ్ ప్రాజెక్ట్ లను పూర్తి చేయలేదు. జగన్ తో కేసీఆర్ కుమ్మక్కై కృష్ణ నది నుండి తెలంగాణకు గ్రావిటీ ద్వారా రావాల్సిన 8 tmc లను ఏపీ కి అప్పగించాడు. 95,000 ఖర్చు పెట్టి కాళేశ్వరం కట్టారు..ఒక్క బ్యారేజ్ కూలి పోయింది.. రెండో బ్యారేజ్ కూలడానికి రెడీ గా ఉంది.. బీఆర్ఎస్ వాళ్ళు కమిషన్ ల కోసం అవినీతి చేయడానికి ప్రాజెక్ట్ లు కట్టారు.. మేము ప్రాజెక్ట్ లు ఎవరికి అప్పచెప్పము.మా ప్రభుత్వం పై కావాలని brs వాళ్ళు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. మేము ప్రాజెక్ట్ లను ఎవరికి అప్పచెప్పము..ఇదే విషయాన్ని కేంద్ర మంత్రి కూడా చెప్పాము.. హరీష్ రావు లాగా మేము పెట్రోల్ పోసుకుని నటించలేదు…వాళ్ల లాగా మేము బ్లాక్ మెయిలర్ లము కాదు.. తెలంగాణ రావడానికి ఒక కారణం ఉత్తమ్ కుమార్ రెడ్డి ..ఆ విషయాన్ని మీ మామ ను అడుగి తెలుసుకో.. జగన్ కెసీఆర్ మాట్లాడుకుని తెలంగాణ లో ఎన్నికలను ప్రభావితం చేయడానికి నాగార్జున సాగర్ మీదికి ఏపీ ఫోర్స్ ను పంపారు.. అసెంబ్లీ కంటే ముందు టైం ఉంటే అఖిల పక్షం పెట్టాలని అనుకున్నాము కానీ టైమ్ లేక అఖిల పక్షం పెట్టడం లేదు..’ అని ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు.
Also Read
- Saraswati Pushkaralu 2026: కాళేశ్వరంలో ఆధ్యాత్మిక మహోత్సవం.. వైభవంగా సరస్వతీ అంత్య పుష్కరాలు ప్రారంభం..
- Trump: క్లైమాక్స్ చేరుకున్న అమెరికా, ఇరాన్ దేశాల ఉద్రిక్తతలు? ఇరాన్కు ట్రంప్ లాస్ట్ వార్నింగ్!
- What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Astrology: మే 21 గురువారం దినఫలాలు.. ఏ రాశివారు ఏ పూజ చేస్తే మేలు..
తాజావార్తలు
-
Kashmir Issue: పాకిస్థాన్పై భారత్ ఆగ్రహం.. ఉగ్రవాదాన్ని పెంచే దేశం మానవ హక్కుల గురించి మాట్లాడటం హాస్యాస్పదం..
-
West Bengal repolling: బెంగాల్లో మళ్లీ ఎన్నికల వేడి.. ఫల్తాలో రీ-పోలింగ్ షురూ! అసలు ట్విస్ట్ ఇదే..
-
Manish Pandey: వర్షం వచ్చినా, ఎండ ఉన్నా ఆగం.. కేకేఆర్ హీరో మనీష్ పాండే ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Saraswati Pushkaralu 2026: కాళేశ్వరంలో ఆధ్యాత్మిక మహోత్సవం.. వైభవంగా సరస్వతీ అంత్య పుష్కరాలు ప్రారంభం..
-
RBI: లోన్ తిరిగి చెల్లించకపోతే బ్యాంకు మీ మొబైల్ ఫోన్ను లాక్ చేస్తుందా? షాకిస్తున్న ఆర్బిఐ కొత్త ప్రతిపాదన
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!