Gun Fire: పెళ్లాం విడాకులు కోరిందని… ఫ్యామిలీ మొత్తాన్ని కాల్చేశాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gun Fire: తన భార్య విడాకులు కోసం దరఖాస్తు చేసుకున్న విషయం తెలుసుకుని కోపోద్రిక్తుడయ్యాడు. ఏం చేస్తున్నానో కూడా తెలియకుండా తన ఐదుగురు పిల్లలను, అత్త, భార్యను కాల్చి చంపాడు. ఆ తరువాత తనను తాను కాల్చకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన అమెరికాలో కలకలం రేపింది. తన భార్య విడాకుల కోసం దాఖలు చేయడంతోనే ఈ దారుణానికి తెగించాడని, కుటుంబంలోని ఏడుగురి మీద తుపాకీతో కాల్పులకు పాల్పడ్డాడని అమెరికా అధికారులు గురువారం తెలిపారు. ఉతాహ్ రాష్ట్రంలోని నోచ్ సిటీలోని ఒక నివాసంలో ఎనిమిది మృతదేహాలను పోలీసులు కనుగొన్నారు. మృతుల్లో నాలుగేళ్ల పాప కూడా ఉంది. అనుమానితుడిని మేఖేల్ హెయిట్గా పోలీసులు గుర్తించారు.
Read Also: Boy Kidnap: డామిట్ కథ అడ్డం తిరిగింది.. కిడ్నాప్తో లైఫ్ సెట్ అయినట్టే అనుకున్నారు.. కానీ
Also Read
గతేడాది డిసెంబర్ 21న మేఖేల్ భార్య విడాకులకు అప్లై చేసింది. దాంతో, అతను కోపం ఆపుకోలేకపోయాడు. ఆమెతో పాటు అత్త, ఐదుగురు బిడ్డలను తుపాకీతో కాల్చి చంపాడు. బుధవారం రాత్రి నిర్వహించిన వెల్ఫేర్ చెకింగ్లో ఆ ఇంటి వాళ్లంతా చనిపోయారనే విషయం వెలుగులోకి వచ్చింది. ఆధారాలను బట్టి ఏడుగురిని చంపిన తర్వాత అనుమానితుడు తనను తాను కాల్చుకున్నాడని తెలుస్తోంది. కాల్పుల ఘటనుకు కారణం విడాకుల వివాదమే అని ఎనోక్ మేయర్ జియోఫ్రే చెస్నట్ తెలిపాడు. కోర్టు డాక్యుమెంట్ల ప్రకారం, డిసెంబర్ 21వ తేదీన కోర్టులో అతని భార్య విడాకుల పిటిషన్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది” అని ఆయన విలేకరులతో అన్నారు. చెస్నట్ ఎనోచ్ చిన్న ఊరు. అందరూ ఒకరికొకరు బాగా తెలుసు. పక్కింటి వ్యక్తి మాట్లాడుతూ.. నిందితుడు మా పొరిగింట్లో ఉంటారు. వారి పిల్లలు మా పిల్లలతో కలిసి ఆడుకుంటారని తెలిపారు. డైవర్స్కు గల కారాణాలేంటో కూడా ఇంకా తెలియరాలేదు.
తాజావార్తలు
-
Lax Gopisetty: ఐటీ రంగంలో 30 ఏళ్ల అనుభవం.. నేపాల్ వరదల్లో ఇన్ఫోసిస్ ఎగ్జిక్యూటివ్ అదృశ్యం.
-
Nepal Floods: భారత పౌరుల గురించి కీలక వివరాలు వెల్లడించిన కేంద్రం
-
Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ, మండలి సమావేశాల ముహూర్తం ఖారారు..
-
ACB Raid: భూమి మ్యుటేషన్ కోసం లంచం అవతారం.. ఏసీబీ వలలో వీఆర్వో..
-
Sonia Gandhi: సోనియా గాంధీ ఓటర్ లిస్ట్ కేసులో కీలక పరిణామం
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!