Kishan Reddy: కాంగ్రెస్, బీఆర్ఎస్ పై కేంద్రమంత్రి విమర్శనాస్త్రాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్, బీఆర్ఎస్ పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు చేయడం కోసం ప్రజలు అనేక త్యాగాలు చేశారు.. అనేక బలి దానాలు త్యాగాలు చేసి సాధించుకున్న తెలంగాణ మొదటి పది సంవత్సారాలు కేసీఆర్ చేతిలో బంది అయ్యిందని ఆరోపించారు. అరాచకాలకు తెలంగాణ సమాజం ఏ రకంగా ఇబ్బంది పడిందో అందరికీ తెలుసు.. ధర్నా చౌక్ లో ధర్నా చేయడానికి కూడా అవకాశం లేకుండా చేశారని దుయ్యబట్టారు. తెలంగాణ కోసం గజ్జె కట్టిన వారే కేసీఆర్ ను వ్యతిరేఖించారన్నారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ 100 రోజుల పాలన పూర్తి చేసుకుందని కిషన్ రెడ్డి తెలిపారు.
Chandrababu: ప్రజల సంక్షేమం, అభివృద్ధే మా అజెండా..
Also Read
- Hyderabad: హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ.. 8 కాలేజీలకు ఫేక్ ఫైర్ NOCలు
- TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
- Ishan Kishan: మైదానంలో సిక్సర్ల కింగ్.. బ్యాంకులో సర్కారీ నౌకరీ.. బిజీ క్రికెట్ లైఫ్లోనూ ఉద్యోగ బాధ్యతలు
- 115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
కాంగ్రెస్ పార్టీ జాతీయ నేతలు వచ్చి గ్యారెంటీలు ప్రకటించారు.. కానీ ఆ గ్యారెంటీలకు గ్యారెంటీ లేకుండా పోయిందని విమర్శించారు. మహిళలకు 2500 రూపాయిలు ఇస్తామని ప్రకటించారు..రాష్ట్రంలో ఎంత మంది మహిళలు ఉన్నారో ప్రభుత్వం దగ్గర రికార్డ్ ఉందని తెలిపారు. కానీ అది అమలు చేయడానికి మీన మేశాలు లెక్కబెడుతుందని విమర్శించారు. రైతులకు 15 వేలు, వ్యవసాయ కూలీలకు 12 వేలు ఇస్తామని చెప్పి ఆ ఊసే ఎత్తడం లేదన్నారు. పేద వారికి ఇళ్లు ఇస్తా అన్నారు.. మరి ఎలా ఇస్తారో విధి విధానాలు చెప్పడం లేదని తెలిపారు.
Manisha Koirala: నా భర్తే నాకు శత్రువయ్యాడు..పెళ్ళైన ఆరు నెలలకే..
నిరుద్యోగ యువత రాష్ట్ర సాధనకు పని చేశారని అన్నారు. కేసీఆర్ కుటుంబాన్ని గద్దె దించడానికి కూడా నిరుద్యోగుల పాత్ర పెద్దది.. ఆ నిరుద్యోగులకు కూడా కాంగ్రెస్ ఈ వంద రోజుల పాలనలో వెన్ను పోటు పొడిచిందని కిషన్ రెడ్డి ఆరోపించారు. అమ్మాయిలకు స్కూటీలు ఇస్తా అన్నారు.. వంద రోజుల్లో రెండో విడత గొర్రెల పంపిణీ అన్నారు.. 2 వేల పెన్షన్ 4 నాలుగు వేలు చేస్తా అన్నారు.. ముఖ్యంగా ప్రభుత్వం ఏర్పడగానే రేషన్ కార్డులు ఇస్తా అన్నారని తెలిపారు. రేషన్ పై బియ్యం ఉచితంగా ఇచ్చేది కూడా కేంద్ర ప్రభుత్వమేనని పేర్కొన్నారు. ఇలా గ్యారెంటీలు చెప్పారు కానీ అమలు చేయలేదని మండిపడ్డారు. అందుకే బీజేపీ తెలంగాణను ప్రశ్నిస్తుందని చెప్పారు. ఎవరైతే ప్రజలు ఈ గ్యారెంటీల్లో మోసపోయారో.. వారందరినీ కలుస్తామని తెలిపారు. తెలంగాణా ప్రజల తరుపున బీజేపీ నిలబడి ప్రశ్నిస్తుందని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Hyderabad: హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ.. 8 కాలేజీలకు ఫేక్ ఫైర్ NOCలు
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
Aishwarya Rajesh : ఫ్లాప్లతో డీలా పడిన ఐశ్వర్య రాజేశ్.. పెరిగిన రెమ్యునరేషన్ కష్టాలు
-
Naagin: కోరికలు తీర్చే నాగినిగా శ్రద్ధా కపూర్… ఆరేళ్ల తర్వాత మళ్లీ కదిలిన ‘ఇచ్ఛాధారి నాగిన్’..
-
PM Modi: “మార్క్ జుకర్బర్గ్ ప్రధాని మోడీకి క్షమాపణ చెప్పాలి, లేకపోతే…” మెటా సీఈఓకు పార్లమెంటరీ ప్యానెల్ అల్టిమేటం?
ట్రెండింగ్
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!