Kishan Reddy: త్వరలో తెలంగాణ బీజేపీకి నూతన అధ్యక్షుడు.. కేంద్రమంత్రి
- వరంగల్ జిల్లాలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటన
- త్వరలో తెలంగాణ బీజేపీకి నూతన అధ్యక్షుడు.
- కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kishan Reddy: వరంగల్ జిల్లాలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటించారు. టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. వేద ఫంక్షన్ హాల్లో జరిగిన ప్రెస్ మీట్లో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. కిషన్ రెడ్డి తన ప్రసంగంలో ఈ ఎన్నికల్లో రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలు, ఒక పట్టభద్రుల స్థానం బీజేపీ ఖాతాలో పడతాయని ధీమా వ్యక్తం చేశారు. మేధావులు, ఉపాధ్యాయులు, పట్టభద్రులు ఇప్పుడు బీజేపీ వైపు చూస్తున్నారని తెలిపారు. కేంద్ర మంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. ప్రజలు బీఆర్ఎస్పై వ్యతిరేకతతో కాంగ్రెస్ను గెలిపించారని, కానీ వారు ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోయారని ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి విఫలమైందని, అధికారంలోకి వచ్చాక నిధుల కోసం భూములు అమ్మాలని మాత్రమే ఆలోచిస్తోందని ఆయన అన్నారు. ప్రభుత్వ పాఠశాలలకు కనీసం రంగులు వేయలేని స్థితిలో ఉందని ఆయన అన్నారు. తెలంగాణను బీఆర్ఎస్ కుటుంబ పాలన చేసి అప్పులు చేసిందని, దోచుకుంది అని వ్యాఖ్యానించారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ బాటలోనే నడుస్తున్నారని ఆరోపించారు. ప్రాజెక్టుల పేరుతో కేసీఆర్ ప్రభుత్వం దోపిడీ చేసింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి అదే విధంగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచి, భూములు అమ్మడం ద్వారా నిధులు సమకూర్చుకోవాలని చూస్తున్నారు. ప్రణాళిక లేని పాలన సాగుతోంది, హామీలు అమలు చేయడంలో అసమర్థతను ప్రదర్శిస్తున్నారు.
Also Read
- Cockroach Janta Party: ఎంతకీ వదలని కాక్రోజ్.. ఎక్స్ అకౌంట్ బ్లాక్ చేసిన వెంటనే కొత్త అకౌంట్ ప్రత్యక్షం!
- Dog Nanny Jobs: ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం.. కుక్కను చూసుకుంటే చాలు.. లక్షల్లో జీతం..!
- Cabinet Meeting: ప్రధాని మోడీ నేతృత్వంలో 4.5 గంటల కేబినెట్ భేటీ.. ఏం చర్చించారంటే..?
- Rooftop Water Tank Cooling Tips: ఎండ వేడితో ఇంటిపైన ఉన్న ట్యాంక్ నీరు మరుగుతోందా..? ఈ చిన్న చిట్కాలతో చల్లగా మారిపోతుంది..!
ప్రజల సమస్యల కోసం బీజేపీ రాబోయే రోజుల్లో మరింత ఉధృతంగా పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలు ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోలేదని విమర్శించారు. బీజేపీ అభ్యర్థులను గెలిపించి, తగిన బుద్ధి చెప్పాలంటూ ఉపాధ్యాయులను, పట్టభద్రులను కోరారు.తెలంగాణ సీఎం ప్రతివారం ఢిల్లీలో అటెండెన్స్ వేయడం కొత్త ట్రెండ్ అయ్యిందని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్కు గట్టి బుద్ధి చెప్పాలని ప్రజలకు కిషన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
ఇప్పటివరకు ఏ ఒక్క బీసీ సంఘం కూడా కాంగ్రెస్ ప్రభుత్వ సర్వేను సమర్థించలేదని అన్నారు. బీజేపీ ఎప్పటికీ బీసీ రిజర్వేషన్లకు మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సర్వే పూర్తయి, బీసీ సంఘాలు అనుమతిస్తే కేంద్రాన్ని ఒప్పించి ఆమోదం చేపిస్తామన్నారు. కేంద్ర మంత్రి రాహుల్ గాంధీ కులం గురించి సర్వే చేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. రాహుల్ గాంధీది ఏ కులమో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డే చెప్పాలి అంటూ వ్యాఖ్యానించారు. బీసీల హక్కుల గురించి మాట్లాడే కాంగ్రెస్, తమ నాయకుల కులం వెల్లడించడంలో ఎందుకు వెనుకడుగేస్తుందో చెప్పాలని ప్రశ్నించారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు త్వరలో మారబోతున్నట్లు కిషన్ రెడ్డి వెల్లడించారు. మొత్తానికి, ఈ ఎన్నికలు రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారాయి. ప్రజలు ఎవరి వైపు ఉంటారో ఫలితాల తర్వాత తెలుస్తుంది. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఆసక్తికరమైన సమరం నెలకొంది.
తాజావార్తలు
-
ITR Filing Deadline Alert: పన్ను చెల్లింపుదారులకు అలర్ట్.. ఈ తేదీ తర్వాత ITR దాఖలు చేస్తే రూ. 5,000 జరిమానా!
-
Shubman Gill: “ఆ ఒక్క విజయం మమ్మల్ని మార్చేసింది”.. గుజరాత్ విజయరహస్యం చెప్పిన కెప్టెన్ గిల్
-
Cockroach Janta Party: ఎంతకీ వదలని కాక్రోజ్.. ఎక్స్ అకౌంట్ బ్లాక్ చేసిన వెంటనే కొత్త అకౌంట్ ప్రత్యక్షం!
-
Rakul Preet Singh: “మోసం చేస్తే వదిలేస్తా”.. పెళ్లి తర్వాత రిలేషన్పై రకుల్ షాకింగ్ కామెంట్స్!
-
Dog Nanny Jobs: ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం.. కుక్కను చూసుకుంటే చాలు.. లక్షల్లో జీతం..!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!