Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Union Minister Kishan Reddy Fierce Criticism On Telangana Government Calls For Support To Bjp Candidates

Kishan Reddy: త్వరలో తెలంగాణ బీజేపీకి నూతన అధ్యక్షుడు.. కేంద్రమంత్రి

Published Date :February 16, 2025 , 12:30 pm
By Kothuru Ram Kumar
  • వరంగల్ జిల్లాలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటన
  • త్వరలో తెలంగాణ బీజేపీకి నూతన అధ్యక్షుడు.
  • కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు.
Kishan Reddy: త్వరలో తెలంగాణ బీజేపీకి నూతన అధ్యక్షుడు.. కేంద్రమంత్రి
  • Follow Us :
  • google news
  • dailyhunt

Kishan Reddy: వరంగల్ జిల్లాలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటించారు. టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. వేద ఫంక్షన్ హాల్‌లో జరిగిన ప్రెస్ మీట్‌లో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. కిషన్ రెడ్డి తన ప్రసంగంలో ఈ ఎన్నికల్లో రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలు, ఒక పట్టభద్రుల స్థానం బీజేపీ ఖాతాలో పడతాయని ధీమా వ్యక్తం చేశారు. మేధావులు, ఉపాధ్యాయులు, పట్టభద్రులు ఇప్పుడు బీజేపీ వైపు చూస్తున్నారని తెలిపారు. కేంద్ర మంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. ప్రజలు బీఆర్ఎస్‌పై వ్యతిరేకతతో కాంగ్రెస్‌ను గెలిపించారని, కానీ వారు ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోయారని ఆరోపించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి విఫలమైందని, అధికారంలోకి వచ్చాక నిధుల కోసం భూములు అమ్మాలని మాత్రమే ఆలోచిస్తోందని ఆయన అన్నారు. ప్రభుత్వ పాఠశాలలకు కనీసం రంగులు వేయలేని స్థితిలో ఉందని ఆయన అన్నారు. తెలంగాణను బీఆర్ఎస్ కుటుంబ పాలన చేసి అప్పులు చేసిందని, దోచుకుంది అని వ్యాఖ్యానించారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ బాటలోనే నడుస్తున్నారని ఆరోపించారు. ప్రాజెక్టుల పేరుతో కేసీఆర్ ప్రభుత్వం దోపిడీ చేసింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి అదే విధంగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచి, భూములు అమ్మడం ద్వారా నిధులు సమకూర్చుకోవాలని చూస్తున్నారు. ప్రణాళిక లేని పాలన సాగుతోంది, హామీలు అమలు చేయడంలో అసమర్థతను ప్రదర్శిస్తున్నారు.

Read Also: Delhi : రెండు స్పెషల్ రైళ్లను ఎందుకు రద్దు చేశారు… రైల్వే స్టేషన్‌లో జరిగిన తొక్కిసలాటపై అనేక ప్రశ్నలు

ప్రజల సమస్యల కోసం బీజేపీ రాబోయే రోజుల్లో మరింత ఉధృతంగా పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలు ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోలేదని విమర్శించారు. బీజేపీ అభ్యర్థులను గెలిపించి, తగిన బుద్ధి చెప్పాలంటూ ఉపాధ్యాయులను, పట్టభద్రులను కోరారు.తెలంగాణ సీఎం ప్రతివారం ఢిల్లీలో అటెండెన్స్ వేయడం కొత్త ట్రెండ్ అయ్యిందని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్‌కు గట్టి బుద్ధి చెప్పాలని ప్రజలకు కిషన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

ఇప్పటివరకు ఏ ఒక్క బీసీ సంఘం కూడా కాంగ్రెస్ ప్రభుత్వ సర్వేను సమర్థించలేదని అన్నారు. బీజేపీ ఎప్పటికీ బీసీ రిజర్వేషన్లకు మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సర్వే పూర్తయి, బీసీ సంఘాలు అనుమతిస్తే కేంద్రాన్ని ఒప్పించి ఆమోదం చేపిస్తామన్నారు. కేంద్ర మంత్రి రాహుల్ గాంధీ కులం గురించి సర్వే చేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. రాహుల్ గాంధీది ఏ కులమో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డే చెప్పాలి అంటూ వ్యాఖ్యానించారు. బీసీల హక్కుల గురించి మాట్లాడే కాంగ్రెస్, తమ నాయకుల కులం వెల్లడించడంలో ఎందుకు వెనుకడుగేస్తుందో చెప్పాలని ప్రశ్నించారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు త్వరలో మారబోతున్నట్లు కిషన్ రెడ్డి వెల్లడించారు. మొత్తానికి, ఈ ఎన్నికలు రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారాయి. ప్రజలు ఎవరి వైపు ఉంటారో ఫలితాల తర్వాత తెలుస్తుంది. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఆసక్తికరమైన సమరం నెలకొంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • BC Reservations
  • bjp
  • BRS
  • congress
  • Kishan Reddy

తాజావార్తలు

  • Israel – Iran War Live Updates : మళ్లీ డ్రోన్లతో విరుచుకుపడుతున్న ఇరాన్‌..

  • Vegetable Market: మరోసారి తెరపైకి కూరగాయల హోల్ సేల్ మార్కెట్ వివాదం

  • Sanju Samson: సంజూ సెలబ్రేషన్ వివాదం.. భావోద్వేగంలో బిగ్ మిస్టెక్.. ఐసీసీ చర్యలు తప్పవా?

  • Shimron Hetmyer: మ్యాచ్ ఓడినా భారీ రికార్డ్ సృష్టించిన విండీస్ ప్లేయర్..!

  • Suryakumar Yadav: మంచి మనుషులకు అంతా మంచే జరుగుతుంది.. సంజు కష్టమే గెలిపించింది!

ట్రెండింగ్‌

  • Sanju Samson Record: సంజు శాంసన్‌ రేర్ రికార్డు.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రికార్డులు బ్రేక్!

  • Sanju Samson: ఈ రోజు కోసమే ఎదురుచూశా.. నా జీవితంలో ఈ ఇన్నింగ్స్‌ను మర్చిపోలేను!

  • The IQ Era థీమ్‌తో MWC 2026 నేడే ప్రారంభం.. ఏ కొత్త ఫోన్ల లాంచ్‌ కానున్నాయంటే..!

  • Virendra Sehwag-MS Dhoni: ఎంఎస్ ధోనీ అదృష్టంతో జన్మించాడు.. సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

  • IND vs WI Super 8: ఈడెన్‌ గార్డెన్స్‌లో ‘కింగ్’.. అయినా భారత్‌ను వెంటాడుతున్న ఆ సమస్య!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions