బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన టైగర్ 3 చిత్రం గతేడాది నవంబర్లో విడుదలై మోస్తరు విజయం అందుకుంది.కత్రీనా కైఫ్ హీరోయిన్గా నటించిన ఆ చిత్రానికి మనీశ్ శర్మ దర్శకత్వం వహించారు.అలాగే, టైగర్ వర్సెస్ పఠాన్ చిత్రంలో షారూఖ్ ఖాన్తో కలిసి సల్మాన్ కూడా నటించనున్నారు. అయితే, ఈ తరుణంలో తన తదుపరి మూవీని సల్మాన్ ఖాన్ అధికారికంగా ప్రకటించారు. తమిళ స్టార్ దర్శకుడు ఏఆర్ మురుగదాస్తో ఆయన సినిమా చేయనున్నారు.సల్మాన్ ఖాన్, ఏఆర్ మురుగదాస్ కాంబినేషన్లో రానున్న ఈ చిత్రానికి సాజిద్ నడియడ్వాలా నిర్మాతగా వ్యహరించనున్నారు. సాజిద్ నిర్మాణంలో సల్లూ భాయ్ కిక్ మరియు జుడ్వా సహా మరిన్ని మూవీస్ చేశారు. ఆయన దర్శకత్వంలో కిక్ మూవీలోనూ నటించారు. ఇప్పుడు మరోసారి ఆయన బ్యానర్లో సినిమా చేయనున్నారు. ఈ కొత్త సినిమా గురించి సల్మాన్ ఖాన్ నేడు (మార్చి 12) ట్వీట్ చేశారు.”
అద్భుత టాలెంట్ ఉన్న ఏఆర్ మురుగదాస్ మరియు నా స్నేహితుడు సాజిద్ నడియడ్వాలాతో ఓ ఎగ్జైటింగ్ సినిమా కోసం కలిసి పని చేయనున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ భాగస్వామ్యం చాలా ప్రత్యేకమైనది. మీ ప్రేమ, ఆశీర్వాదంతో ఈ జర్నీ కోసం నేను వేచిచూస్తున్నా” అని సల్మాన్ ఖాన్ ట్వీట్ చేశారు.2025 ఈద్కు ఈ చిత్రం రిలీజ్ అవుతుందని సల్మాన్ ఖాన్ తెలిపారు. తమిళంలో స్టార్ డైరెక్టర్ అయిన ఏఆర్ మురుగదాస్.. ఆమిర్ ఖాన్తో గజినీ హిందీ రీమేక్ తర్వాత బాలీవుడ్లో కూడా బాగా ఫేమస్ అయ్యారు. గజినీ మూవీ బాలీవుడ్లోనూ భారీ బ్లాక్ బస్టర్ అయింది. ఆ తర్వాత మరో రెండు హిందీ చిత్రాలు కూడా చేశారు. ఇప్పుడు సల్మాన్ ఖాన్తో భారీ మూవీ చేయనున్నారు.సల్మాన్ ఖాన్ , ఏఆర్ మురుగదాస్ కాంబోలో ఈ చిత్రం భారీ బడ్జెట్తో రూపొందనుందని తెలుస్తోంది. ఇండియాలోని కొన్ని లొకేషన్లతో పాటు పోర్చుగల్ మరియు యూరోపియన్ దేశాల్లో ఈ మూవీ షూటింగ్ జరగనుందని పింక్విల్లా రిపోర్ట్ వెల్లడించింది. సుమారు రూ.400 కోట్ల బడ్జెట్తో యాక్షన్ థ్రిల్లర్ మూవీగా ఇది తెరకెక్కుతుందని తెలుస్తోంది.
Glad to join forces with the exceptionally talented, @ARMurugadoss and my friend, #SajidNadiadwala for a very exciting film !! This collaboration is special, and I look forward to this journey with your love and blessings. Releasing EID 2025.@NGEMovies @WardaNadiadwala pic.twitter.com/dv00nbEBU1
— Salman Khan (@BeingSalmanKhan) March 12, 2024