Drone Attack: మాస్కో నగరంపై డ్రోన్ లతో దాడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రష్యా రాజధాని మాస్కోలో భారీ డ్రోన్ దాడి కలకలం రేపుతుంది. పలు డ్రోన్లు ఏకకాలంలో దాడి చేయడంతో స్థానికుల్లో భయాందోళన నెలకొంది. అప్రమత్తమైన రష్యా సైన్యం డ్రోన్లను కూల్చివేసింది. డ్రోన్ దాడి తరువాత మాస్కోలో విమానాల రాకపోకలను ఆపేశారు. ఈ దాడిలో రెండు బిల్డింగ్ లు దెబ్బతిన్నాయి. అయితే, ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని చెప్పారు. రష్యా రాజధాని మాస్కో మేయర్ సెర్గే సోబియానిన్ ఇవాళ (ఆదివారం) తెల్లవారు జామున ఇష్యూపై రియాక్ట్ అయ్యారు. మాస్కోపై రాత్రి సమయంలో ఉక్రెయిన్ డ్రోన్లు దాడి చేయడంతో రెండు భవనాలు దెబ్బతిన్నాయని చెప్పుకొచ్చారు.
Read Also: Kiara Advani: ఆ కోరిక కోసం తహతహలాడుతున్న కియారా.. ఎప్పుడు తీరుతుందో?
Also Read
- PM Modi: పర్యావరణ పరిరక్షణతోనే ఆర్థిక ప్రగతి.. ప్రపంచానికి భారత్ ఆదర్శం
- West Bengal Bypolls: మమతా బెనర్జీకి మరో షాక్.. రేజీనగర్ అభ్యర్థి కూడా బరి నుంచి ఔట్
- Kishan Reddy: కాంగ్రెస్, బీఆర్ఎస్కు హైకోర్టు తీర్పు చెంపపెట్టు.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..
- Petrol Pump UPI Payments: పెట్రోల్ పంపుల్లో UPI చెల్లింపులకు బ్రేక్..? డీలర్ల కీలక ప్రకటన
ఉక్రెయిన్ సరిహద్దు నుంచి 500 కిలో మీటర్లు దూరంలో ఉన్న రష్యా రాజధాని మాస్కో, దాని పరిసరాలపై ఈ డ్రోన్ల ద్వారా దాడి చేసినట్లు మాస్కో మేయర్ ప్రకటించారు. అయితే ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం వల్ల ఇలాంటివి అప్పుడప్పుడు జరుగుతుంటాయన్నారు. తాజా డ్రోన్ల దాడితో రాజధాని యొక్క వ్యకోవ్ విమానాశ్రయం పూర్తిగా మూసి వేయబడింది. ఎయిర్ పోర్ట్ కు రాకపోకలు నిలిపివేసినట్లు ఏవియేషన్ సర్వీసెస్ వెల్లడించింది. ఈనెల ప్రారంభంలో డ్రోన్ దాడుల కారణంగా మాస్కోకు విమానాల రాకపోకలకు కొంతకాలం అంతరాయం ఏర్పడింది. అయితే, శనివారం అర్థరాత్రి తరువాత జరిగిన డ్రోన్ల దాడిలో ఐదు డ్రోన్లను కూల్చివేసినట్లు రష్యా అధికారులు పేర్కొన్నారు.
Read Also: Tirumala: తిరుమల శ్రీవారి ఆలయంలో స్టీలు హుండీలు.. ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన టీటీడీ
రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య 2022 ఫిబ్రవరి నెల నుంచి యుద్దం కొనసాగుతుంది. రష్యా స్వాధీనం చేసుకున్న భూభాగాన్ని వెనక్కి తీసుకునేందుకు ఉక్రెయిన్ మాస్కోపై దాడులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే శుక్రవారం రష్యా, ఉక్రెయిన్ సరిహద్దులో ఉన్న దక్షిణ రోస్టోవ్ ఏరియాలో రెండు ఉక్రెయిన్ క్షిపణులను అడ్డగించిందని టాగన్రోగ్ నగరంపై శిథిలాలు పడటంతో 16 మందికి గాయాలైనట్లు రష్యా వెల్లడించింది. ఇదిలా ఉంటే శనివారం రాత్రి మాస్కోపై డ్రోన్ల దాడికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మాస్కోలోని ఒక అపార్ట్ మెంట్ భవనంలో మహిళ నిద్రిస్తుండగా డ్రోన్ ఢీకొట్టినట్లు ఓ వీడియోలో కనబడుతుంది.
తాజావార్తలు
-
Motorola Signature 27: మోటరోలా Signature 27 లాంచ్ డేట్ కన్ఫర్మ్.. 200MP కెమెరా, Dolby Vision సపోర్ట్, ప్రీమియం డిజైన్
-
PM Modi: పర్యావరణ పరిరక్షణతోనే ఆర్థిక ప్రగతి.. ప్రపంచానికి భారత్ ఆదర్శం
-
West Bengal Bypolls: మమతా బెనర్జీకి మరో షాక్.. రేజీనగర్ అభ్యర్థి కూడా బరి నుంచి ఔట్
-
Indian Cinema: పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ మార్కెట్ వైపు అడుగులు వేస్తున్న ఇండియన్ సినిమాలు
-
Kishan Reddy: కాంగ్రెస్, బీఆర్ఎస్కు హైకోర్టు తీర్పు చెంపపెట్టు.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!