Uddhav Thackeray : ఔను అధికారం కోసమే కలిశాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని మోడీ డిగ్రీల వివరాలను అడిగినందుకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు గుజరాత్ హైకోర్టు రూ. 25 వేల జరిమాన విధించింది. ఈ నేపథ్యంలోనే శివసేన నాయకుడు ఉద్దవ్ థాకరే ప్రధాని మోడీ డిగ్రీ వివాదంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డిగ్రీలు చదివి ఉద్యోగాలు లేని యువకులు ఎంతోమంది ఉన్నారని వ్యంగ్యంగా మాట్లాడారు. కానీ ఈ ప్రధాని మోడీని డిగ్రీ చూపించమని అడిగితే జరిమానా విధిస్తారేంటి అని సెటైర్లు వేశారు. అయినా మా కాలేజీలోనే మోడీ చదువుకున్నాడని గర్వంగా ఫీలవుతూ ఏ కాలేజీ చెప్పేందుకు ముందుకు రాకపోవడం ఆశ్చర్యంగా ఉందంటూ ఉద్దవ్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Also Read : Covid-19 Vaccines : భారీగా కోవిద్ వ్యాక్సిన్లు ధ్వంసం చేసిన అధికారులు
Also Read
- Naturally Lizard Removal Tips: వేసవిలో ఇంట్లో బల్లుల బెడద ఎక్కువైందా..? ఈ సింపుల్ స్ప్రే చాలు.. వెంటనే పారిపోతాయి..!
- Sorakaya Uttappam Recipe: సొరకాయతో సూపర్ టేస్ట్.. మెత్తటి ‘సొరకాయ ఉత్తప్పం’ రెసిపీ..
- Kharif Water Release: ఖరీఫ్కు నీటి విడుదలపై ప్రభుత్వం ఫోకస్.. కృష్ణా, గోదావరి డెల్టాలకు యాక్షన్ ప్లాన్ సిద్ధం
- What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
నిజానికి అసలు ప్రధాని చదువుకున్నారా అంటూ ఉద్దవ్ థాకరే అనుమానం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కావాలనే ఉద్దేశ్యంతోనే సైద్దాంతికంగా భిన్నమైన నేషనలిస్ట్ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నారంటూ బీజేపీ చేస్తున్న ఆరోపణలకు థాకరే గట్టి సమాధానం ఇచ్చారు. ఔను మేము అధికారం కోసమే కలిశాం.. కానీ దానిని కోల్పోయినప్పటికీ ఇంకా కలిసే ఉన్నాం.. మరింత బలంగా ఉన్నాం.. అని ఉద్దవ్ బదులిచ్చాడు. అలాగే సేన నాయకుడు ఏక్ నాథ్ షిండే-40 మంది ఎమ్మెల్యేలతో తిరుగుబాటు చేసి బీజేపీతో కొత్త ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేశారో ప్రస్తావిస్తూ.. అవకాశం కుదిరినప్పుడల్లా బీజేపీ ప్రజలను లోబర్చుకుంటుందని.. సరిగ్గా ఎన్నికల సమయంలో మాయమాటలతో మోసం చేస్తోందని ఉద్దవ్ థాకరే ఆరోపించారు.
Also Read : Indian 2: అయిదేళ్ల తర్వాత మళ్లీ అదే చోటుకి శంకర్ అండ్ టీమ్…
కాగా, బీజేపీ తనను హిందూత్వాన్ని విడిచిపెట్టానని నిందలు వేస్తోంది. నేను హిందూత్వాన్ని విడిచిపెడుతున్నాను అనడానికి ఒక్క ఉదాహరణ చెప్పగలారా.. రాజ్యంగంపై ప్రమాణం చేసేందుకు నేను సిద్దమే మీరు ధృవీకరించగలరా అని ప్రశ్నిస్తే.. అదిగో రాజ్యంగాన్ని అవమానిస్తున్నారంటూ ఆరోపిస్తున్న.. బీజేపీ వితండ వాదన చేస్తోందన్నారు. న్యాయవ్యవస్థను సైతం బీజేపీ నియంత్రించడానికి ప్రయత్నించింది. కానీ అదృష్టవశాత్తు న్యాయవ్యవస్థ అందుకు అంగీకరించ లేదన్నారు. లేదంటే ఇజ్రాయెల్ మాదిరి పరిస్థితి మన దేశంలో కూడా తల్లెత్తేది అంటూ బీజేపీకి ఉద్దవ్ థాకరే గట్టి కౌంటరిచ్చాడు.
తాజావార్తలు
-
Tollywood : చదువుకోవడం కోసం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన టాలీవుడ్ హీరోయిన్
-
Stock Market Crash: స్టాక్ మార్కెట్ కొంప ముంచిన ట్రంప్ ప్రకటన.. ప్రారంభంలోనే సెన్సెక్స్ 800, నిఫ్టీ 250 పాయింట్లు డౌన్!
-
Donald Trump: త్వరగా నిర్ణయం తీసుకోండి, లేకపోతే మీకు ఏమీ మిగలదు.. ఇరాన్ను మళ్లీ హెచ్చరించిన ట్రంప్
-
Veera Bhadrudu : ‘వీర భద్రుడు’కు అసలు పరీక్ష ఇదే..
-
Axar Patel: మిచెల్ స్టార్క్తో చర్చ.. ఆసక్తికర సమాధానం చెప్పిన అక్షర్ పటేల్!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..