Uddhav Thackeray : ఔను అధికారం కోసమే కలిశాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని మోడీ డిగ్రీల వివరాలను అడిగినందుకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు గుజరాత్ హైకోర్టు రూ. 25 వేల జరిమాన విధించింది. ఈ నేపథ్యంలోనే శివసేన నాయకుడు ఉద్దవ్ థాకరే ప్రధాని మోడీ డిగ్రీ వివాదంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డిగ్రీలు చదివి ఉద్యోగాలు లేని యువకులు ఎంతోమంది ఉన్నారని వ్యంగ్యంగా మాట్లాడారు. కానీ ఈ ప్రధాని మోడీని డిగ్రీ చూపించమని అడిగితే జరిమానా విధిస్తారేంటి అని సెటైర్లు వేశారు. అయినా మా కాలేజీలోనే మోడీ చదువుకున్నాడని గర్వంగా ఫీలవుతూ ఏ కాలేజీ చెప్పేందుకు ముందుకు రాకపోవడం ఆశ్చర్యంగా ఉందంటూ ఉద్దవ్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Also Read : Covid-19 Vaccines : భారీగా కోవిద్ వ్యాక్సిన్లు ధ్వంసం చేసిన అధికారులు
Also Read
- Sugar Price Fall: చక్కెర ధరలపై కేంద్రం మాస్టర్ ప్లాన్.. సామాన్యులకు గుడ్ న్యూస్..
- Operation Sindoor: భారత్ హిట్ లిస్టులో పాకిస్తాన్ ‘‘స్కార్దు’’.. చైనాకు కూడా హెచ్చరికేనా..?
- Egg Prices Rise: గుడ్ల ధరలకు ఇథనాల్ ఎఫెక్ట్.. అసలు కారణం ఇదే!
- Nepal Flash Floods: నేపాల్ వరద ప్రళయం.. బీహార్కు పెను ప్రమాదం..
నిజానికి అసలు ప్రధాని చదువుకున్నారా అంటూ ఉద్దవ్ థాకరే అనుమానం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కావాలనే ఉద్దేశ్యంతోనే సైద్దాంతికంగా భిన్నమైన నేషనలిస్ట్ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నారంటూ బీజేపీ చేస్తున్న ఆరోపణలకు థాకరే గట్టి సమాధానం ఇచ్చారు. ఔను మేము అధికారం కోసమే కలిశాం.. కానీ దానిని కోల్పోయినప్పటికీ ఇంకా కలిసే ఉన్నాం.. మరింత బలంగా ఉన్నాం.. అని ఉద్దవ్ బదులిచ్చాడు. అలాగే సేన నాయకుడు ఏక్ నాథ్ షిండే-40 మంది ఎమ్మెల్యేలతో తిరుగుబాటు చేసి బీజేపీతో కొత్త ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేశారో ప్రస్తావిస్తూ.. అవకాశం కుదిరినప్పుడల్లా బీజేపీ ప్రజలను లోబర్చుకుంటుందని.. సరిగ్గా ఎన్నికల సమయంలో మాయమాటలతో మోసం చేస్తోందని ఉద్దవ్ థాకరే ఆరోపించారు.
Also Read : Indian 2: అయిదేళ్ల తర్వాత మళ్లీ అదే చోటుకి శంకర్ అండ్ టీమ్…
కాగా, బీజేపీ తనను హిందూత్వాన్ని విడిచిపెట్టానని నిందలు వేస్తోంది. నేను హిందూత్వాన్ని విడిచిపెడుతున్నాను అనడానికి ఒక్క ఉదాహరణ చెప్పగలారా.. రాజ్యంగంపై ప్రమాణం చేసేందుకు నేను సిద్దమే మీరు ధృవీకరించగలరా అని ప్రశ్నిస్తే.. అదిగో రాజ్యంగాన్ని అవమానిస్తున్నారంటూ ఆరోపిస్తున్న.. బీజేపీ వితండ వాదన చేస్తోందన్నారు. న్యాయవ్యవస్థను సైతం బీజేపీ నియంత్రించడానికి ప్రయత్నించింది. కానీ అదృష్టవశాత్తు న్యాయవ్యవస్థ అందుకు అంగీకరించ లేదన్నారు. లేదంటే ఇజ్రాయెల్ మాదిరి పరిస్థితి మన దేశంలో కూడా తల్లెత్తేది అంటూ బీజేపీకి ఉద్దవ్ థాకరే గట్టి కౌంటరిచ్చాడు.
తాజావార్తలు
-
Sugar Price Fall: చక్కెర ధరలపై కేంద్రం మాస్టర్ ప్లాన్.. సామాన్యులకు గుడ్ న్యూస్..
-
Ranabaali: ఇప్పుడు రష్మిక – విజయ్ వంతు.. ఈ వారంలోనే ‘రణబాలి’ బిగ్ సర్ప్రైజ్? అసలు ట్విస్ట్ ఇదే!
-
Operation Sindoor: భారత్ హిట్ లిస్టులో పాకిస్తాన్ ‘‘స్కార్దు’’.. చైనాకు కూడా హెచ్చరికేనా..?
-
Food Facts : పప్పులో తెల్లటి నురుగు.. మురికేనా.? అసలు నిజం ఇదే.!
-
Egg Prices Rise: గుడ్ల ధరలకు ఇథనాల్ ఎఫెక్ట్.. అసలు కారణం ఇదే!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..