Maharashtra Politics: సీఎం ఫడ్నవీస్ను కలిసిన ఉద్ధవ్ ఠాక్రే.. రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ
- ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ను కలిసిన శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే
- వీరిద్దరి మధ్య భేటీ రాజకీయ వర్గాల్లో చర్చ
- డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే అసంతృప్తిగా..,
- ఉన్న తరుణంలో ఈ భేటీ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ను శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే కలిశారు. వీరిద్దరి మధ్య భేటీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ సమావేశంలో ఉద్ధవ్ ఠాక్రేతో పాటు ఆయన కుమారుడు, పార్టీ ఎమ్మెల్యేలు ఆదిత్య ఠాక్రే, అనిల్ పరబ్, వరుణ్ దేశాయ్ తదితరులు పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే అసంతృప్తిగా.. రాజకీయాల్లో హాట్ హాట్గా ఉన్న తరుణంలో ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రి ఫడ్నవీస్ను అభినందించారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇరువురు నేతలు ముఖాముఖి మాట్లాడుకోవడం ఇదే తొలిసారి. కాగా.. మహాయుతి కూటమి ప్రమాణ స్వీకారోత్సవానికి ఠాక్రేతో పాటు ఇతర ప్రతిపక్ష నేతలను ఆహ్వానించారు. అయితే వారు ఆ కార్యక్రమానికి హాజరు కాలేదు.
Read Also: Minister Payyavula Keshav: ఢిల్లీ పర్యటనలో పయ్యావుల.. కేంద్ర ఆర్థిక మంత్రితో భేటీ
Also Read
- YS Jagan: డీఎస్సీలో భారీ అక్రమాలు.. ఫస్ట్ ర్యాంకర్కు ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు!
- Wedding Card Vastu Tips: పెళ్లిళ్ల సీజన్ వచ్చేస్తోంది.. వాస్తు ప్రకారం మీ వెడ్డింగ్ కార్డ్ ఇలా ఉంటేనే శుభప్రదం! ఈ తప్పులు అస్సలు చేయకండి!
- Aus vs Ban: ఆస్ట్రేలియాకు దెబ్బ మీద దెబ్బ.. బంగ్లాదేశ్ బౌలర్ల ధాటికి పరుగుల ఖాతా తెరవకముందే మూడు వికెట్లు డౌన్.!
- తెలంగాణ Inter Advanced Supplementary Results విడుదల.. ఫస్ట్ ఇయర్లో 68.84%, సెకండ్ ఇయర్లో 49.29% ఉత్తీర్ణత.!
సమావేశం అనంతరం శివసేన (యూబీటీ) నేత ఆదిత్య ఠాక్రే మాట్లాడుతూ.. దేశ, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా అధికార పక్షం, ప్రతిపక్షాలు కలిసి పని చేసేందుకు రాజకీయ పరిపక్వత కనబరచాలని అన్నారు. ‘ఈరోజు మా పార్టీ చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నార్వేకర్ను కలిశారు. మహారాష్ట్ర ప్రభుత్వం కోసం పని చేస్తూ దేశ, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా (అధికార పార్టీ, ప్రతిపక్షం) ఇద్దరూ కలిసి పనిచేయాలి. రాజకీయ పరిపక్వత ఉండాలి.” అని ఆదిత్య ఠాక్రే అన్నారు. ఈ సమావేశం మహారాష్ట్ర రాజకీయాల్లో కొత్త అవకాశాలకు దారితీసింది. ఏక్నాథ్ షిండే అసంతృప్తి తర్వాత, భవిష్యత్తులో ఏర్పడే కొత్త రాజకీయ సమీకరణాలకు ఇది సూచనగా పరిగణించబడుతుందా అనే ప్రశ్నలు ఈ సమావేశం నుండి లేవనెత్తుతున్నాయి.
Read Also: Lok Sabha: విప్ జారీ చేసినా డుమ్మా.. 20 మంది బీజేపీ ఎంపీలపై అధిష్టానం ఆగ్రహం
తాజావార్తలు
-
AirAsia: ఆలస్యమైన విమానం.. రైతు అరుదైన హైబ్రిడ్ పనస మొక్క దెబ్బతినడంతో రూ. 90 వేల నష్టపరిహారం
-
Vadde Naveen : బాహుబలి కంటే పుష్పనే స్పెషల్… స్టార్స్ సినిమాలపై వడ్డే నవీన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
-
YS Jagan: డీఎస్సీలో భారీ అక్రమాలు.. ఫస్ట్ ర్యాంకర్కు ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు!
-
TATA Sierra EV: టాటా సియెర్రా ఈవీ రిలీజ్ కు రెడీ..! 500KM రేంజ్, ప్రీమియం ఫీచర్లు
-
Wedding Card Vastu Tips: పెళ్లిళ్ల సీజన్ వచ్చేస్తోంది.. వాస్తు ప్రకారం మీ వెడ్డింగ్ కార్డ్ ఇలా ఉంటేనే శుభప్రదం! ఈ తప్పులు అస్సలు చేయకండి!
ట్రెండింగ్
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..